Home » Gujarat
నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కీలక ఆపరేషన్ నిర్వహించి దేశంలోకి అక్రమంగా మాదక ద్రవ్యాలు సరఫరా చేయాలనుకున్న పాకిస్థాన్ భారీ కుట్రను ఛేదించింది. గుజరాత్ తీరంలో 86 కిలోల డ్రగ్స్ను గుజరాత్ తీరప్రాంతంలో అధికారులు ఆదివారంనాడు స్వాధీనం చేసుకున్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన ప్రధానులతో పాటు ఎందరో ప్రధానులను తాను చూశానని, కానీ బహిరంగంగా పచ్చి అబద్ధాలు చెప్పే ప్రధానిని చూడటం మాత్రం ఇదే మొదటిసారని అన్నారు.
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నివాసంపై కాల్పుల ఘటనలో ఇద్దరు షూటర్లు ఉపయోగించిన ఆయుధాలను, తూటాలను ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గుజరాత్లోని తపతీ నదిలో వీటిని కనుగొని, వెలికి తీసినట్టు పోలీసులు మంగళవారంనాడు తెలిపారు.
గాడిద పాలు అమ్ముకుంటూ కోట్లల్లో ఆర్జిస్తున్న గుజరాత్ వ్యాపారి ధీరేన్ సోలంకీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాడు.
అసలే వేసవి కాలం.. ఆపై ట్రాఫిక్ పోలీసులు. ఎండలో పని. వారి కష్టం మామూలుగా ఉండదు. భానుడి భగభగల మధ్య విధులు నిర్వహించాలి. ఎండ వేడిని తట్టుకునేలా సంరక్షణ చర్యలు తీసుకోవాలి. ఇంతటి కష్టం అనుభవించే ట్రాఫిక్ పోలీసుల బాధను అర్థం చేసుకుని గుజరాత్లోని వడోదర పోలీసులు పరిష్కారం కనుగొన్నారు. తమ పరిధిలోని ట్రాఫిక్ పోలీసులకు ఏసీ హెల్మెట్(AC Helmet)లను అందిస్తున్నారు.
ఎక్స్ప్రెస్ హైవేపై అత్యంత వేగంగా వెళ్తున్న కార్(car), ముందు వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్(truck)ను వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది(accident). దీంతో కారులో ఉన్న 10 మంది మృత్యువాత చెందారు. మరికొంత మందికి గాయాలైనట్లు తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు(police) రంగంలోకి దిగి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు
చాలా మంది వ్యాపారం చేస్తుంటారు గానీ.. అందులో కొంత మందే సక్సెస్ అవుతుంటారు. వారిలో వినూత్నంగా ఆలోచించే వారు మరిన్ని లాభాలను ఆర్జిస్తుంటారు. ఈ క్రమంలో కొందరు వ్యాపారులు ఒకరిని మించి మరొకరు తెలివితేటలు ప్రదర్శిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. ఇలాంటి..
భార్యను వందేభారత్ రైలెక్కించేందుకు వెళ్లి రైల్లోనే ఇరుక్కుపోయిన పెద్దాయన ఉదంతం ప్రస్తుతం నెట్టింట్లో ట్రెండింగ్లో ఉంది.
గుజరాత్ లోని దేవభూమి ద్వారకలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆదిత్య రోడ్డులో ఉన్న ఓ అపార్ట్మెంట్ మొదటి అంతస్తులో తెల్లవారుజామున 3.30 గంటలకు మంటలు చెలరేగాయి.
IPL 2024లో ఆదివారం (మార్చి 31) రెండు మ్యాచ్లు జరుగుతాయి. తొలి మ్యాచ్ గుజరాత్ టైటాన్స్(Gujarat Titans), సన్ రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) జట్ల మధ్య జరగనుంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మధ్యాహ్నం 3.30 గంటల నుంచి మ్యాచ్ జరగనుంది. అయితే రెండు జట్లు కూడా ఒక మ్యాచ్ గెలిచి రెండో గెలుపుపై కన్నేశాయి. ఈ నేపథ్యంలో ఈ మ్యాచులో ఏ జట్టు గెలిచే అవకాశం ఉందో ఇప్పుడు చుద్దాం.