Home » GHMC
సాధారణంగా జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశాల్లో తరుచూ వాడీ వేడీ చర్చలు జరుగుతుంటాయి. సభ్యుల మధ్య వాగ్వాదాలు తారాస్థాయికి చేరి ఆందోళన పరిస్థితులు ఏర్పడతాయి. ప్రస్తుతం జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో వార్డుల డీలిమిటేషన్ అంశంపై చర్చలు జరుగుతున్నాయి.
జీహెచ్ఎంసీ వార్డుల విభజనపై సభ్యులు ఇచ్చే ప్రతీ అభ్యంతరాలు పరిగణనలోకి తీసుకుంటామని కమిషనర్ కర్ణన్ తెలిపారు. వార్డుల పేర్లు చేంజ్ చేయాలని ఎక్కువగా అభ్యంతరాలు వచ్చాయన్నారు.
జీహెచ్ఎంసీ ప్రత్యేక కౌన్సిల్ మంగళవారం సమావేశమైంది. ఈ సభలో పలు కీలక అంశాలపై చర్చిస్తున్నారు. ప్రధానంగా వార్డుల డీ లిమిటేషన్పై చర్చ జరుగుతోంది.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్లో వార్డుల పునర్విభజన విషయంపై అటు ప్రజలు, ఇటు రాజకీయ నేతల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బల్దియా ప్రధాన కార్యాలయానికి నేతలు, నగరవాసులు క్యూ కడుతున్నారు.
జీహెచ్ఎంసీ వార్డుల పునర్విభజనపై భారీగా అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. అభ్యంతరాల స్వీకరణ ఈరోజు(సోమవారం)తో పూర్తికానుంది. ఈ క్రమంలో రేపు(మంగళవారం) బల్దియా ప్రత్యేక కౌన్సిల్ సమావేశం కానుంది.
జీహెచ్ఎంసీని ఔటర్ అవతలి వరకు విలీనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేయగానే ఆ మేరకు బిల్డ్నౌలో మార్పులు చేశారు. కేవలం వెయ్యి చదరపు మీటర్లలోపు ఏడు అంతస్తుల వరకు భవన నిర్మాణ అనుమతులు జారీ చేసేవిధంగా బిల్డ్నౌలో సాంకేతిక మార్పులు తీసుకొచ్చారు.
నగరంలో.. కుక్కలు స్వైరవిహరం చేస్తున్నాయి. ఎక్కడ పడితే అక్కడ కుక్కలు దర్శనమిస్తున్నాయి. దీంతో వీధుల్లోకి వెళ్లాలంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఒక్క హైదరాబాద్ నగరంలోనే రోజుకూ 300 వరకు కుక్కకాటు కేసులు నమోదవుతున్నాయంటే.. ఇక పరిస్థితి ఏంటో ఇట్టే ఊహించుకోవచ్చు.
భాగ్యనగరంలో.. ఈవెంట్ గ్రౌండ్ ఏర్పాటవుతోంది. ప్రసాద్ మల్టీప్లెక్స్కు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ భారీ విగ్రహానికి మధ్యన ఉన్న మూడెకరాల స్థలంలో ఈ మైదానాన్ని ముస్తాబు చేస్తున్నది. ఈ ఈవెంట్ గ్రౌండ్ను హైదరాబాద్ మెట్రో డవలప్ మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ) ఏర్పాటుచేస్తోంది.
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జీహెచ్ఎంసీ వార్డుల సంఖ్యను 150 నుంచి 300కి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) పరిధిలోకి మొత్తం 20 మునిసిపాల్టీలు, ఏడు కార్పొరేషన్లను విలీనం చేశారు. ఈ మేరకు దానికి సంబంధించిన పనులన్నీ బుధవారం రాత్రి పూర్తయ్యాయి. దీంతో ఆ ఏరియాలన్నీ జీహెచ్ఎంసీ పరిధిలోకి వస్తాయి. వివరాలిలా ఉన్నాయి.