Home » Gautham Gambhir
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) ఫైనల్ రేసులో నిలవాలంటే భారత్కు శ్రీలంకతో జరిగే రెండు టెస్టుల సిరీస్ అత్యంత కీలకం కానుంది. మరి భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలు సజీవంగా ఉండాలంటే సమీకరణాలు ఇలా..
రోహిత్ శర్మ భవిష్యత్తుపై నెలకొన్న వివాదం బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పదవిపైనా ప్రభావం చూపనున్నట్లు తెలుస్తోంది. అగార్కర్ స్థానంలో భారత క్రికెట్ దిగ్గజం వీవీఎస్ లక్ష్మణ్ను నియమించే అవకాశాలను బీసీసీఐ పరిశీలిస్తున్నట్లు వార్తలు జోరందుకున్నాయి.
భారత స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్కు వరుసగా అవకాశాలు ఇవ్వకపోవడంపై మాజీ క్రికెటర్ దీప్ దాస్గుప్తా అసంతృక్తి వ్యక్తం చేశాడు. ఇటీవల ఇంగ్లండ్ పర్యటనలో ఒక్క మ్యాచ్లోనూ అతడికి అవకాశం ఇవ్వని సంగతి తెలిసిందే.
డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో నిలవాలంటే శ్రీలంక పర్యటనలో టీమిండియా తప్పనిసరిగా మెరుగైన ప్రదర్శన చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఆగస్టు 15 నుంచి శ్రీలంకతో ప్రారంభమయ్యే రెండు టెస్టుల సిరీస్ భారత్కు అత్యంత కీలకంగా మారింది.
టీమిండియా కోచింగ్ స్టాఫ్లో మరో కీలక మార్పు చోటు చేసుకోనుంది. ఫీల్డింగ్ కోచ్ టీ.దిలీప్ ఒప్పందాన్ని పొడిగించకూడదని బీసీసీఐ నిర్ణయించింది. దీంతో అతడి స్థానంలో అస్సాంకు చెందిన మాజీ క్రికెటర్ సుభదీప్ ఘోష్ను నియమించేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది.
గంభీర్ నేతృత్వంలో ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల్లో సిరీస్లు కోల్పోయిన టీమిండియా.. వీవీఎస్ లక్ష్మణ్ నేతృత్వంలో అద్భుత ప్రదర్శన కనబర్చింది. దీంతో గంభీర్ను తప్పించి లక్ష్మణ్ను పూర్తి స్థాయి కోచ్గా నియమించాలంటూ సోషల్ మీడియాలో డిమాండ్లు మొదలయ్యాయి.
ఇంగ్లండ్ పర్యటనను భారత్ ఓటమితో ముగించింది. ఈ నేపథ్యంలో టీమిండియా హెచ్కోచ్ గౌతమ్ గంభీర్పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్.. గంభీర్పై ఆగ్రహం వ్యక్తం చేశాడు.
భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మధ్య విభేదాలు ఉన్నాయంటూ గత కొంతకాలంగా సాగుతున్న ఊహాగానాలకు తెరపడినట్లే కనిపిస్తోంది. ఇంగ్లండ్ పర్యటనలో ఇద్దరి మధ్య సఖ్యత లేదంటూ సోషల్ మీడియాలో జరిగిన చర్చలకు తాజాగా ఓ ఫొటోతో ఆ ఇద్దరూ సమాధానం ఇచ్చేశారు.
ఇంగ్లండ్తో జరిగిన తొలి వన్డేలో స్టార్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్(52*) అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. మ్యాచ్ అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్లో సుందర్ మాట్లాడాడు.
ఇంగ్లండ్తో సిరీస్ అనంతరం భారత అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డస్కాటే తన పదవికి రాజీనామా చేస్తాడన్న అంశంపై మరో కొత్త ప్రచారం మొదలైంది. బీసీసీఐ అతడికి ఇచ్చిన హామీ ఇంకా తీర్చలేదని ర్యాన్ అసంతృప్తితో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.