Home » Gautham Gambhir
క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్.. టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. గంభీర్ అసలు కోచ్ కాదని.. జట్టుకు మేనేజర్ మాత్రమే అని అన్నాడు. కాగా కపిల్ దేవ్ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్కు ప్రముఖ వ్యాఖ్యాత హర్ష భోగ్లే పలు కీలక సూచనలు చేశాడు. జట్టుకు తానే సీఈవో అన్నట్లు భావించకూడదని.. కెప్టెన్ అన్నీ నిర్ణయాలు తీసుకుంటాడని అన్నాడు.
సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో టీమిండియా 51 పరుగుల తేడాతో ఓడింది. ఈ ఓటమిపై మాజీ క్రికెటర్లు తీవ్రంగా స్పందించారు. గంభీర్ తీసుకున్న నిర్ణయాల వల్లే పరాభవం ఎదురైందని విమర్శించారు.
సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్లో టీమిండియా సొంతగడ్డపై వైట్ వాష్ అయిన విషయం తెలిసిందే. అప్పుడు ఐపీఎల్ ఢిల్లీ క్యాపిట్సల్ సహ యజమాని.. కోచింగ్ సిబ్బందిపై విమర్శలు చేస్తూ పోస్ట్ పెట్టాడు. దానికి గంభీర్ ఇప్పుడు ఘాటుగా స్పందిస్తూ కౌంటర్ ఇచ్చాడు.
రో-కోకి హెడ్ కోచ్ గంభీర్కి మధ్య అభిప్రాయభేదాలు ఉన్నట్లు వస్తోన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ఈ విషయంపై స్పందించాడు. రో-కోతో పెట్టుకోవద్దని పరోక్షంగా సూచించాడు.
సౌతాఫ్రికా చేతిలో టీమిండియా సొంతగడ్డపై వైట్వాష్కు గురైంది. ఈ నేపథ్యంలో తప్పు ఎవరిది? అనే చర్చ మొదలైంది. నెలల వ్యవధిలోనే టీమిండియా సిరీస్లు ఓడిపోవడంపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ప్రధాన కోచ్ గంభీర్ దీనికి కారణమనే చర్చ నడుస్తోంది.
టీమిండియా సౌతాఫ్రికాపై 2-0 తేడాతో క్లీన్ స్వీప్నకు గురైంది. ఈ క్రమంలో టీమిండియా హెడ్ కోచ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. తన భవిష్యత్పై తుది నిర్ణయం తీసుకోవాల్సింది బీసీసీఐ అని వెల్లడించాడు. ఈ పదవిలో కొనసాగడానికి అర్హత ఉందా? లేదా? బోర్డు డిసైడ్ చేస్తుందని తెలిపాడు.
వాషింగ్టన్ సుందర్ను మూడో స్థానంలో ఆడించడంపై మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ స్పందించాడు. ఆ స్థానంలో సుందర్ సరిపోతాడని తాను అనుకోవట్లేదని వెల్లడించాడు.
ఈడెన్ గార్డెన్స్ పిచ్పై వస్తున్న విమర్శలపై పిచ్ క్యురేటర్ సుజన్ ముఖర్జీ స్పందించారు. భారత శిబిరం చెప్పినట్లుగానే పిచ్ తయారు చేశానని చెప్పాడు. టెస్టు మ్యాచ్లకు పిచ్ ఎలా సిద్ధం చేయాలో తనకు తెలుసని వెల్లడించాడు.
సౌతాఫ్రికాతో తొలి టెస్ట్లో భారత జట్టు 30 పరుగుల తేడాతో ఓడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో క్రికెట్ దిగ్గజం గంగూలీ.. హెడ్ కోచ్ గంభీర్కు ఓ కీలక సూచన చేశాడు.