Home » Gas price Hike
ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా దేశాలు చేపడుతున్న యుద్ధం సామాన్యులపై పెను ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా గ్యాస్ కష్టాలు అధికమయ్యాయి.
పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం హైదరాబాద్ నగరంలోని చిరు వ్యాపారులను సైతం అతలాకుతలం చేస్తోంది. యుద్ధం సేపథ్యంలో ఇక్కడి వాణిజ్య సిలిండర్లకు కొరత ఏర్పడడంతో చిన్న, మధ్యతరహా హోటళ్ల వ్యాపారం కుదేలవుతోందని తెలంగాణ హోటళ్ల అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటరెడ్డి చెబుతున్నారు.
ఇండక్షన్ స్టవ్లకు డిమాండ్ గ్రేటర్లో భారీగా పెరిగింది. గ్యాస్ కొరత, బుక్ చేసినా సిలిండర్ ఆలస్యంగా రావడం వంటి కారణాలతో నగరవాసులు ఇండక్షన్ స్టవ్లు వినియోగిస్తుండటంతో వాటి అమ్మకాలు ఒక్కసారిగా పెరిగాయి. విక్రయాలు పెరగడంతో హోల్ సేల్ మార్కెట్లో వీటి ధరలు 20-30 శాతం పెరిగాయి.
ఎల్పీజీ నిల్వలు, బుకింగ్, సరఫరాపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో ఈరోజు(సోమవారం) సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వివిధ గ్యాస్ సరఫరా కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక అంశాలపై సీఎం దిశానిర్దేశం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్లకు కొరత లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. గృహ వినియోగదారులు ఆందోళనకు గురికాకుండా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్యాస్ సంక్షోభం ముదురుతోంది. ప్యానిక్ బుకింగ్తో సర్వర్లు డౌన్ అవుతున్నాయని ఆయిల్ కంపెనీల నిర్వాహకులు చెబుతున్నారు.
హైదరాబాద్ మహా నగరంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా నిలిచిపోయింది. ఒకవేళ దొరికినా కొన్ని ప్రాంతాల్లో రూ. 4 వేలకు, మరికొన్ని ప్రాంతాల్లో రూ. 3,500కు విక్రయిస్తున్నారు.
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతోంది. దీని ప్రభావం ఆయిల్, గ్యాస్ రంగాలపై పడింది. ఈ నేపథ్యంలో దేశంలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ కొరత ఏర్పడే అవకాశం ఉందంటూ ప్రచారం సాగుతోంది.
పశ్చిమాసియాలో యుద్ధం సెగ మనదేశానికి తగులుతోంది. అక్కడ నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా దేశవ్యాప్తంగా వంట గ్యాస్కు తీవ్ర కొరత ఏర్పడింది....
చమురు మార్కెటింగ్ సంస్థలు సామాన్యులకు షాక్ ఇస్తూ గృహ వినియోగ, వాణిజ్య సిలిండర్ల ధరలను భారీగా పెంచాయి. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.