Home » Gas cylinder
పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం హైదరాబాద్ నగరంలోని చిరు వ్యాపారులను సైతం అతలాకుతలం చేస్తోంది. యుద్ధం సేపథ్యంలో ఇక్కడి వాణిజ్య సిలిండర్లకు కొరత ఏర్పడడంతో చిన్న, మధ్యతరహా హోటళ్ల వ్యాపారం కుదేలవుతోందని తెలంగాణ హోటళ్ల అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటరెడ్డి చెబుతున్నారు.
ఇండక్షన్ స్టవ్లకు డిమాండ్ గ్రేటర్లో భారీగా పెరిగింది. గ్యాస్ కొరత, బుక్ చేసినా సిలిండర్ ఆలస్యంగా రావడం వంటి కారణాలతో నగరవాసులు ఇండక్షన్ స్టవ్లు వినియోగిస్తుండటంతో వాటి అమ్మకాలు ఒక్కసారిగా పెరిగాయి. విక్రయాలు పెరగడంతో హోల్ సేల్ మార్కెట్లో వీటి ధరలు 20-30 శాతం పెరిగాయి.
గుడ్ న్యూస్.. గల్ఫ్ ప్రాంతంలో యుద్ధం కారణంగా దేశంలో గ్యాస్ సరఫరాలో నెలకొన్న ఇబ్బందులు ఇక తొలగిపోనున్నాయి. అమెరికా నుండి భారీ ఎల్పీజీ కార్గో నౌక కర్ణాటకలోని మంగళూరు తీరానికి చేరుకుంది. ఇంధన భద్రత, సరఫరాలో ఇదొక కీలక పరిణామంగా నిలుస్తుంది.
కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పలు రాష్ట్రాలకు కేంద్ర పెట్రోలియం సహజ వాయువుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ నీరజ్ మిట్టల్ లేఖ రాశారు.
వంట గ్యాస్ కష్టాలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. రానున్న రోజుల్లో సిలిండర్లు దొరకడం కష్టమంటూ సామాజిక మాధ్యమాల్లో వీడియోలు వైరల్ కావడంతో జనం గ్యాస్ సిలిండర్ కోసం ఏజెన్సీల వద్ద ప్రజలు బారులు తీరుతున్నారు.
ప్రస్తుతం పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతల నడుమ, దేశ వ్యాప్తంగా గ్యాస్ వినియోగదారులు ఎన్ని కష్టాలు పడుతున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ప్రతిరోజూ గ్యాస్ ఏజెన్సీ ఎదుట ఉదయం నుంచి గ్యాస్ సిలిండర్లతో బారులు తీరుతున్నారు.
ఏపీలో గ్యాస్ సరఫరాపై సీఎం చంద్రబాబు కీలక సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎల్పీజీ సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేవని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
ఎల్పీజీ నిల్వలు, బుకింగ్, సరఫరాపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో ఈరోజు(సోమవారం) సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వివిధ గ్యాస్ సరఫరా కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక అంశాలపై సీఎం దిశానిర్దేశం చేశారు.
మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా ప్రపంచం తీవ్రమైన గ్యాస్ సమస్య ఎదుర్కొంటోంది. అనేక దేశాలలో గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగాయి. ముఖ్యంగా భారతీయులు పెట్రోల్, గ్యాస్ సంక్షోభం గురించి ఆందోళన చెందుతున్నారు.
వంట గ్యాస్ సరఫరాపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. గృహ వినియోగదారులకు వంద శాతం ఎల్పీజీ సరఫరా చేస్తామని కేంద్రం స్పష్టం చేసింది.