Home » Football
భారత ఫుట్బాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఫుట్బాల్ ఆడుతూ పాతికేళ్ల యువ ప్లేయర్ మైదానంలోనే కుప్పకూలాడు. ఈ ఘటన పంజాబ్లోని లుధియానా జిల్లా మాజ్రి గ్రామంలో చోటు చేసుకుంది.
ఫిఫా ప్రపంచ కప్ 2026 సమరం మరికొద్ది నెలల్లో ప్రారంభం కానుంది. దీనికి అమెరికా, కెనడా దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ఇరాన్ జట్టు.. ఇప్పటికే ఈ టోర్నీలో పాల్గొనబోమని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో తాజాగా అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అమెరికాలో జరగబోయే పురుషుల ఫుట్బాల్ ప్రపంచకప్2026లో పాల్గొనబోమని ఇరాన్ స్పష్టం చేసింది. ప్రస్తుతం తమ దేశంపై దాడులు చేస్తున్న అమెరికా... అక్కడికెళ్లే తమ జట్టుకు హాని చేయకుండా ఉండదని ఇరాన్ ఆరోపించింది.
అంతర్జాతీయ వేదికపై ఇరాన్ మహిళల ఫుట్బాల్ జట్టు సంచలన నిర్ణయం తీసుకుంది. మహిళల ఆసియా కప్ ప్రారంభ మ్యాచ్కు ముందు మైదానంలో జాతీయ గీతం ఆలపించే సమయంలో ఇరాన్ ప్లేయర్లు మౌనంగా ఉండిపోయారు. ఖమేనీ మృతికి నిరసనగా ప్లేయర్లు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
ఫ్రీకిక్ గోల్స్లో బ్రెజిల్ సాకర్ లెజెండ్ పీలేను అర్జెంటీనా గ్రేట్ లియోనెల్ మెస్సీ సమం చేశాడు. మేజర్ లీగ్ సాకర్ టోర్నీలో ఓర్లాండో సిటీ జట్టుతో మ్యాచ్లో ఇంటర్ మయామి...
టర్కీలో ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతుండగా బంతి తగిలి గాయపడిన సీగల్ పక్షికి ఆటగాడు సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మెక్సికోలో హింసతో జూన్, జులైలో జరగాల్సిన 2026 వరల్డ్ కప్ ఫుట్బాల్ మ్యాచ్ వేదికలపై అనిశ్చితి నెలకొంది. డ్రగ్ లార్డ్.. ఎల్ మెంచో హతుడైన తర్వాత మెక్సికోలో దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో ఆటగాళ్లు, అభిమానుల రక్షణపై ఫిఫా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది.
మేఘాలయ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. షిల్లాంగ్కు చెందిన ఎంపీ, ‘వాయిస్ ఆఫ్ ది పీపుల్ పార్టీ’ కీలక నేత రికీ ఆండ్రూ జె.సింగ్కాన్ కన్నుమూశారు. వివరాల్లోకి వెళితే..
ఎమ్మిగనూరు నీలకంఠేశ్వర స్వామి జాతరను పురష్కరించుకొని దివంగత నేత బీవీ మోహన్ రెడ్డి స్మారకార్థం నిర్వహించిన రాష్ట్రస్థాయి ఫుట్ బాల్ పోటీల్లో ఎమ్మిగనూరుకు చెందిన చైతన్య జట్టు విజయం సాధించగా, రన్నర్గా కర్ణాటకలోని హోబ్బళ్లి జట్టు నిలిచింది.
ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) భవితవ్యంపై అనిశ్చితి నెలకొనడంతో దేశీయ దిగ్గజ ఫుట్బాల్ ఆటగాళ్లు గొంతు విప్పారు. భారత ఫుట్బాల్ ఐకాన్ సునీల్ ఛేత్రి, గోల్కీపర్ గుర్ప్రీత్ సింగ్ సంధు, డిఫెండర్ సందేశ్ ఝింగన్ ఈ విషయంలో ఫిఫాను నేరుగా జోక్యం చేసుకోవాలని కోరారు.