Home » Farmers
సీఎం రేవంత్రెడ్డి రైతుబంధు బంద్ పెట్టి.. రాహుల్గాంధీకి కప్పం కడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు విమర్శించారు. కాంగ్రెస్ నేతలు కనపడితే రైతుబంధు ఇంకా ఎప్పుడు ఇస్తారని కాలర్ పట్టుకుని నిలదీయాలని హెచ్చరించారు.
మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ధాన్యం కాపాడుకునేందుకు వెళ్లి నలుగురు రైతులు మృతిచెందగా.. మరో రైతుకి తీవ్రగాయాలు అయ్యాయి.
రైతులకు చేదోడువాదోడుగా నిలుస్తున్న యాంత్రీకరణ ప్రక్రియ మంగళవారం నుంచి మొదలైంది. కూలీల కొరతను అధిగమించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొన్నాళ్లుగా యంత్రపరికరాలను అందిస్తున్నాయి.
జిల్లాలో జలధార పనులు జోరందుకున్నాయి. భూగర్భజలాల పెంపు లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వంద రోజుల కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 6న ప్రారంభమైన ఈ ప్రోగ్రామ్ జూలై 14 వరకు జరుగుతుంది.
జిల్లాలో మూడు రోజులుగా కురుస్తున్న ఆకాల వర్షాలు, బలమైన గాలులు మామిడి రైతులకు నష్టాన్ని తెచ్చిపెడుతున్నాయి.
ప్రత్తిపాడు ప్రాంతానికి గుంటూరు ఛానల్ చాలా ముఖ్యమైనదని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. గుంటూరు ఛానల్లో ప్లో లేకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహిస్తూ అనేక పథకాలు తీసుకొస్తున్నా వాటిపై అవగాహన లేకపోవడంతో రైతులు వినియోగించుకోలేకపోతున్నారు. ఈక్రమంలోనే ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక పేరుతో 99 రోజులపాటు వివిధ అంశాలపై కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన తెలంగాణ ప్రభుత్వం ఈవారం ‘రైతు వారం’గా కార్యక్రమాల నిర్వహణకు కార్యాచరణ రూపొందించింది.
ఈ యాసంగి సీజన్లో ఇప్పటివరకు రైతుల ఖాతాల్లో రూ.1,129 కోట్లు జమ చేసినట్లు రాష్ట్ర పౌరసరఫరా లశాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు..
ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో రైతు వారోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. మే 4వ తేదీ నుంచి 9వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.
మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంలా రైతులపై ఎరువుల భారం పడుతోంది. ధరలు మరింత పెరగడంతో అన్నదాతలు దిక్కుదోచని స్థితిలో పడిపోయారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏడాదికి ఒకే సారి పంట మద్దతు ధర పెంచుతున్నాయి.