Home » Farmers
Telangana: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎండిన పంటలను పరిశీలించేందుకు మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుక్రవారం ఉదయం బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా రంగదాంపల్లి అమర వీరుల స్థూపం వద్ద పార్టీ అధినేతకు గులాబీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. భారీ కాన్వాయ్తో కేసీఆర్కు స్వాగతం పలికి ఆయన వెంట కరీంనగర్కు పయనమయ్యారు.
కరీంనగర్: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కరీంనగర్ జిల్లాలో శుక్రవారం పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు కరీంనగర్ రూరల్ మండలం ముగ్ధుమ్పూర్ గ్రామ సమీపంలోని పంటలను ఆయన పరిశీలిస్తారు.
ఏనుగు జాడ కోసం అటవీ శాఖ గాలింపు నిర్వహిస్తోంది. సులుగు పల్లి - ముంజం పల్లి మధ్యలో ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ప్రాణహిత ప్రాజెక్టు కాల్వ గుండా ఏనుగు ప్రయాణం సాగుతోందని తెలుసుకున్నారు. బెజ్జురు, చింతల మానే పల్లి, పెంచికల్ పేట, దహెగాం మండలాల్లో హై అలర్ట్ ప్రకటించారు.
కొమురంభీం: జిల్లాలో ఏనుగు అలజడి సృష్టించింది. చింతల మానేపల్లి మండలం, బూరెపల్లి శివారులో ఏనుగు దాడిలో రైతు మృతి చెందాడు. దీంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. మహారాష్ట్ర అటవీ ప్రాంతం నుంచి కొమురంభీం జిల్లాలోకి ఏనుగు ప్రవేశించింది.
వ్యవసాయంలో కొందరు రైతులు నూతన ఒరవడిలు సృష్టిస్తున్నారు. నష్టాల్లో ఉన్న పంటలను లాభదాయకంగా మార్చే ప్రణాళికలు రచిస్తున్నారు. తమిళనాడుకి చెందిన ఓ రైతు కొంచం విస్తీర్ణంలో పాలకూర సాగు చేస్తూ వేలల్లో ఆదాయం సంపాదిస్తున్నాడు. విల్లుపురం పనంపట్టు ప్రాంతానికి చెందిన మురుగన్ అనే రైతు కొన్నిరోజులుగా పాలకూర పండిస్తున్నాడు.
Telangana: కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వ నీటి నిర్వహణ, విద్యుత్ వైఫల్యమే పంట నష్టానికి కారణమని ఆరోపించారు. మంగళవారం రాష్ట్రంలో ఎండిన పంటలకు ఎకరాకు 25 వేలు నష్టపరిహారం, పంటలకు నీళ్ళు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్కు హరీశ్రావు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరువును నివారించే ప్రయత్నలు ప్రభుత్వం చేయడం లేదని విమర్శించారు.
కరీంనగర్: రైతు సమస్యల పరిష్కారం కోసం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ మంగళవారం కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ కేంద్రం వద్ద రైతు దీక్ష చేపట్టనున్నారు. రూ. రెండు లక్షల రుణమాఫీ, పంట నష్టం పరిహారం చెల్లింపుపై దీక్ష చేయనున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు దీక్ష చేస్తారు.
భూగర్భ జలాలు అడుగంటడంతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో పొలాలు ఎండుముఖం పడుతున్నాయి. దీంతో పొట్ట దశలో ఉన్న పొలాలను కాపాడుకోలేక రైతులు నానా అవస్థలు పడుతున్నారు.
సాగు నీటి సమస్య వల్ల రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకునేందుకు మాజీ సీఎం కేసీఆర్ ఆదివారం పొలం బాట పట్టనున్నారు. జనగామ, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల పరిధిలో నీరు లేక ఎండిపోయిన పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడనున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా భూగర్భ జలాలు అడుగంటిన వేళ.. చాలా చోట్ల పొట్ట దశకు వచ్చిన పొలాలు ఎండిపోతున్నాయి. దీంతో రైతన్నల దిగులును తగ్గించి వారిలో భరోసా నింపడానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) రంగంలోకి దిగనున్నారు. ఆదివారం నుంచి ఆయన ఉమ్మడి నల్గొండ వ్యాప్తంగా పర్యటించనున్నారు.