Home » Drugs Case
బీఆర్ఎస్ తాండూరు మాజీ ఎమ్మెల్యే పంజుగుల రోహిత్ రెడ్డికి చెందిన మొయినాబాద్ ఫాంహౌస్ డ్రగ్స్ పార్టీ కేసు దర్యాప్తులో పోలీసులు వేగం పెంచారు. ఈ కేసును విచారిస్తున్న సిట్ అధికారులు డ్రగ్స్ సరఫరాకు సంబంధించిన మూడు ప్రధాన మార్గాలను గుర్తించారు.
శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా హైగ్రేడ్ గంజాయి పట్టుపడింది. బ్యాంకాక్ నుంచి హైదరాబాద్కు వచ్చిన ఇద్దరు ప్రయాణికుల వద్ద గంజాయిని గుర్తించిన అధికారులు వారిని అరెస్టు చేశారు.
విజయవాడలో ఎండీఎంఏ డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. రాజస్థాన్ నుంచి మాదకద్రవ్యాలను తెచ్చి విజయవాడలో నిందితులు విక్రయిస్తున్నట్లు గుర్తించారు.
హైదరాబాద్లో డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరిని ఎక్సైజ్ ఎస్టీఎఫ్బీ అధికారులు అరెస్ట్ చేశారు. వారి నుంచి ఎండీఎంఏ, ఓజీ కుష్, చరస్ డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు.
పేదలకు చౌకగా అత్యాధునిక వైద్యం అందించాలనే సదుద్దేశంతో తిరుపతిలో టీటీడీ నిర్వహిస్తున్న స్విమ్స్ ఆస్పత్రిలో మందుల షాపుల పేరిట మాఫియా నడుస్తోంది.
గత నెలలో బొండపల్లిలో 650 కిలోల గంజాయి పట్టుబడింది. క్యాబేజీ లోడు మాటున గంజాయి తరలిస్తుండగా నార్కోటిక్ కంట్రోల్ టీమ్ దాడిచేసి పట్టుకుంది. గంజాయి తరలిస్తూ ఇద్దరు కానిస్టేబుళ్లు సైతం పట్టుబడ్డారు.
హైదరాబాద్లో మాదకద్రవ్యాల కట్టడిపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో జరిపిన మెరుపు దాడిలో భారీ డ్రగ్ రాకెట్ గుట్టురట్టయింది. మౌలాలి పారిశ్రామిక వాడ కేంద్రంగా సాగుతున్న ఈ అక్రమ దందాను అధికారులు ఛేదించి, కోట్ల రూపాయల విలువైన మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.
వరంగల్ నగరంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఇంతేజార్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ ఎత్తున హాష్ ఆయిల్ తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను డ్రగ్ కంట్రోల్ పార్టీ, స్థానిక పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు..
విద్యాసంస్థల సమీపంలో పొగాకు ఉత్పత్తుల విక్రయ దుకాణాలపై ఉక్కుపాదం మోపుతున్నామని సిటీ పోలీస్ కమిషనర్ వీ.సీ. సజ్జనార్ పేర్కొన్నారు.
మేడ్చల్ జిల్లా మల్లాపూర్ పారిశ్రామిక ప్రాంతంలో నాచారం ఎక్సైజ్ పోలీసులు మెరుపు దాడి జరిపారు. పారిశ్రామిక ప్రాంతాలను, విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని గంజాయి విక్రయిస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు.