Home » Drugs Case
తనపై సోషల్ మీడియాలో వైసీపీ (YSRCP) నేతలు విషప్రచారం చేస్తున్నారని నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి శ్రీకృష్ణదేవరాయలు (Lavu Sri Krishna Devarayalu) అన్నారు. శనివారం నాడు సచివాలయంలోని సీఈఓ ఆఫీసుకు వచ్చారు. తనపై సోషల్ మీడియాలో చేస్తున్న విషప్రచారంపై అడిషనల్ సీఈఓను కలిసి ఫిర్యాదు చేశానని తెలిపారు. ట్విట్టర్, సోషల్ మీడియా వేదికలుగా తనపై వైసీపీ అఫిషియల్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ అంటే దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణ.. ఇప్పుడు యువతకు మత్తు సరఫరా చేసే డ్రగ్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మార్చారని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్ర విమర్శించారు. గంజాయి, హెరాయిన్, కొకైన్ ఏది కావాలన్నా దొరికే ఉడ్తా ఆంధ్రప్రదేశ్గా మారిందని ధ్వజమెత్తారు. దేశంలో ఎక్కడ డ్రగ్స్ దొరికినా దాని మూలాలు ఆంధ్రప్రదేశ్ వైపు ఉన్నాయని వివరించారు.
జగిత్యాలలో (Jagtial) తీవ్ర కలకలం సృష్టించిన డ్రగ్స్ కేసులో (Drugs Case) తాజాగా మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 10వ తరగతి విద్యార్థినులు గంజాయికి బానిసవ్వడం చూసి నివ్వెరపోయిన పోలీసులు.. వెంటనే విచారణ చేపట్టి, నిందితులను పట్టుకున్నారు. ఐదుగురు సభ్యులతో కూడిన ముఠాని అరెస్టు చేశారు. వీళ్లందరు చదువు మానేసి.. గంజాయి విక్రయిస్తున్నారని తెలిసింది.
లోక్ సభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో నకిలీ మద్యం మరణాలు పంజాబ్ నే కాదు.. యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. పంజాబ్ ( Punjab ) లోని సంగ్రూర్లో నకిలీ మద్యం ఘటనలో మృతుల సంఖ్య 20కి చేరింది. సంగ్రూర్ సమీపంలోని దిర్బా గుజ్రాన్ గ్రామంలో నకిలీ మద్యం సేవించడంతో ఈ ఘటన చోటు చేసుకుంది.
యువత జీవితాలను నాశనం చేస్తున్న డ్రగ్స్ని అంతమొందించేందుకు ప్రభుత్వ యంత్రాంగాలు ఎన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నా.. డ్రగ్స్ (Drugs) వినియోగం అంతకంతకూ వ్యాపిస్తూనే ఉంది. కొన్ని ముఠాలు రహస్యంగా ఈ చీకటి దందాని నడిపిస్తూనే ఉన్నాయి. తమ జేబులు నింపుకోవడం కోసం విద్యార్థుల జీవితాలతో డ్రగ్స్ ముఠాలు చెలగాటమాడుతున్నాయి. వారిని మత్తుకి బానిసలు చేసి జీవితాలను నాశనం చేస్తున్నాయి.
విజయవాడ: బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాధినేని యామిని వైసీపీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలను లెక్క చేయకుండా వాలంటీర్స్ను వైసీపీ వాడుకుంటోందని, పోలీసులు కూడా ఈసీ కోడ్ను లెక్క చెయ్యకుండా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు.
ఎప్పుడూ గంజాయి అక్రమ రవాణాతో వార్తల్లో నిలిచే విశాఖలో కొకైన్ కలకలం రేగిన విషయం తెలిసిందే. బ్రెజిల్ నుంచి వచ్చిన ఓ కంటెయినర్లో సుమారు 25వేల కిలోల డ్రై ఈస్ట్లో కొకైన్ కనిపించడం తీవ్ర సంచలనంగా మారింది. దీనిపై విశాఖ నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ మాట్లాడుతూ.. విశాఖలో డ్రగ్స్ పట్టుబడిందని.. ఈ ఘటనపై సీబీఐ విచారణ చేపడుతోందన్నారు.
వైసీపీ ప్రభుత్వం(YSRCP Govt) ఏపీని డ్రగ్స్ రాజధానిగా మార్చిందని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu) అన్నారు. గురువారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... విశాఖ పోర్టులో సీబీఐ 25000 కిలోల డ్రగ్స్ని స్వాధీనం చేసుకోవడం షాక్కు గురిచేసిందని అన్నారు. పోర్టులో 25 వేల కిలోల డ్రగ్స్ స్వాధీనంపై విస్మయం వ్యక్తం చేశారు.
టెస్లా, స్పేస్ ఎక్స్ వంటి సంస్థల యజమాని ఎలాన్ మస్క్(Elon Musk) ఇటివల డ్రగ్స్ వాడకం(Drug Usage) గురించి సంచలన ప్రకటన చేశారు. ఈ ప్రకటన నేపథ్యంలో మస్క్ కంపెనీలలో పనిచేసే ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆయన ఏ ప్రకటన చేశారో ఇక్కడ తెలుసుకుందాం.
లాలీపాల్లు కంటే తేలిగ్గా మాదకద్రవ్యాలు దొరుకుతున్నాయని, పోలీసులు మాత్రం మాదకద్రవ్యాల అక్రమ విక్రేతల జాడ తెలుసుకోవడంలో విఫలమవుతున్నారని ఓ యూనివర్శిటీ విద్యార్థి స్యయంగా పోలీసులకు క్లాస్ పీకాడు. డ్రగ్స్ బెడదను నిర్భీతగా పోలీసుల ముందే ఆ విద్యార్థి బయటపెట్టడాన్ని చూసి తోటి స్నేహితులు చప్పట్లతో హర్షాతిరేకం వ్యక్తం చేశారు.