Home » Donald Trump
వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను అరెస్ట్ చేసి ఆ దేశాన్ని స్వాధీనం చేసుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్ల్యాండ్పై కన్నేశారు. అయితే ట్రంప్ ప్రయత్నాలకు ఐరోపా దేశాలు ఎప్పటిలా వంత పాడడం లేదు. ట్రంప్ ఆలోచన తప్పని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
గాజాలో శాంతి స్థాపన దిశగా తనకు సహకరించకపోతే ఫ్రాన్స్పై 200 శాతం సుంకం విధిస్తానని ట్రంప్ హెచ్చరించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ త్వరలో ఎన్నికల్లో ఓడిపోతారని కూడా జోస్యం చెప్పారు.
తాను ఇప్పటివరకు ఎనిమిది యుద్ధాలను ఆపానని, అయినా తనకు నోబెల్ బహుమతి ఇవ్వలేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు నార్వే ప్రధాని జోనాస్ గహర్ స్టోర్కు ట్రంప్ ఓ లేఖ రాశారు.
ట్రంప్ ‘గ్రీన్లాండ్ టారిఫ్’పై యూరోపియన్ యూనియన్(ఈయూ) మండిపడింది. ట్రంప్ ఏకపక్ష నిర్ణయం యూరోపియన్ దేశాల ప్రయోజనాలకు భంగకరమని పేర్కొంది.
ఇరాన్లో నిరసనకారులకు, భద్రతా దళాలకు మధ్య జరుగుతున్న పోరు మారణ హోమానికి కారణమైంది. గత కొన్ని వారాలుగా ఇరాన్లో జరుగుతున్న ఆందోళనల్లో ఇప్పటివరకు 5 వేల మంది మరణించినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ ఐదు వేల మందిలో 500 మంది భద్రతా సిబ్బంది ఉన్నారని రాయిటర్స్ వెల్లడించింది.
గ్రీన్లాండ్ విషయంలో తమ వైఖరిని వ్యతిరేకిస్తున్న ఎనిమిది ఐరోపా దేశాలపై ట్రంప్ పది శాతం అదనపు సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. యూరప్ దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాల కారణంగా చైనా, రష్యా భారీగా మేలు పొందుతాయని యూరోపియన్ యూనియన్ అభిప్రాయపడింది.
ఇరాన్లో అమెరికా సైన్యం కాలుపెడుతుందని నమ్మిన అనేక మంది ఇరానియన్లు ప్రస్తుతం తాము మోసపోయామని బాధపడుతున్నారు. తమను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నట్టేట ముంచారని ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు.
నోబెల్ శాంతి పురస్కారం అందుకోవాలన్న ట్రంప్ కల మొత్తానికి నెవేరింది. గురువారం ఆ పురస్కారాన్ని అందుకున్నాడు.. కాకపోతే అది నోబెట్ కమిటీ వాళ్లు ఇచ్చింది కాదు.. వెనుజువెలా ప్రతిపక్ష నేత మారియా కొరినా మచాడో అందజేశారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. గ్రీన్లాండ్ విలీనం కోసం నిరంతరం బెదిరింపులకు పాల్పడుతున్నారు. గ్రీన్లాండ్.. అమెరికాలో చేరడానికి నిరాకరిస్తోంది. దీనిపై ట్రంప్ స్పందిస్తూ.. గ్రీన్లాండ్ నిర్ణయం పెద్ద సమస్య సృష్టిస్తోందంటూ పరోక్ష వార్నింగ్ ఇచ్చారు.
ఆర్థిక సంక్షోభం, అంతర్గత తిరుగుబాటు సమస్యలతో సతమతమవుతున్న ఇరాన్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో పిడుగు వేశారు. ఇరాన్తో వాణిజ్యం చేసే దేశాలపై 25 శాతం సుంకాలను విధిస్తామని హెచ్చరించారు.