Home » Donald Trump
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గుడ్ న్యూస్ చెప్పారు. ఇరాన్ యుద్ధానికి ఐదు రోజులు బ్రేక్ ఇస్తున్నట్టు ప్రకటించారు. ఇరాన్, అమెరికా మధ్య రెండ్రోజులుగా జరుగుతున్న చర్చలు యుద్ధాన్ని ముగించగలవని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇరాన్తో రెండు రోజులుగా జరుగుతున్న చర్చలు ఫలప్రదంగా సాగుతున్నాయని, దీంతో ఇరాన్ ఇంధన మౌలిక సదుపాయాలు, విద్యుత్ కేంద్రాలపై దాడులను ఐదు రోజులు వాయిదా వేయాలని తన బలగాలను ఆదేశించానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనపై టెహ్రాన్ స్పందించింది. అమెరికాతో ఎలాంటి చర్చలు జరపడం లేదని స్పష్టం చేసింది.
మధ్యప్రాచ్యంలో ఘర్షణలు తీవ్రమవుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్ విద్యుత్ ప్లాంట్లు, మౌలిక వసతులపై 5 రోజుల పాటు దాడులు నిలిపివేయాలని తాను ఆదేశాలు జారీచేసినట్టు తన ట్రూత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ట్రంప్.
ట్రంప్ ప్రభుత్వ విధానాలతో భారత్, చైనా దేశాలే ఎక్కువగా ఇబ్బందుల పాలయ్యాయని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. భారత్, చైనా విద్యార్థులకు జారీ అయ్యే వీసాల్లో భారీగా కోత పడినట్టు వెలుగులోకి వచ్చింది.
విమానం దిగుతూ తడబడటం, మెడపై ఎర్రటి మచ్చలు వంటి పరిణామాలతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంపై మళ్లీ ఆందోళనలు మొదలయ్యాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంగానే ఉన్నారా? తాజాగా ఎయిర్ఫోర్స్ వన్ విమానం నుంచి దిగుతున్న సమయంలో ట్రంప్ను చూసిన వారిలో ఈ సందేహం మొదలైంది. అంతకు ముందు రోజు జరిగిన ఓ కార్యక్రమంలో కుర్చీలో కూర్చునేందుకు కూడా ట్రంప్ ఇబ్బంది పడ్డారు.
ఇరాన్పై సైనిక చర్యకు ముగింపు పలికే యోచనలో తాను ఉన్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. తమ లక్ష్యాలకు చేరువయ్యామని అన్నారు.
ఇరాన్పై యుద్ధం ఎటూ తేలని స్థితి, చమురు ధరల పెరుగుదల, గ్యాస్ కొరతతో ప్రపంచ దేశాలు అల్లాడుతుండటంతో.. హోర్ముజ్ జలసంధిని తెరిచేందుకు అమెరికా తీవ్రస్థాయి యుద్ధానికి సన్నద్ధమవుతోంది.
ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ జరుపుతున్న యుద్ధంలో తమకు సహకరించడం లేదంటూ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్పై ట్రంప్ విమర్శలు గుప్పించారు. అమెరికా లేకపోతే నాటో ఒక 'కాగితం పులి' అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం మూడో వారానికి చేరుకోవడంతో ఈ పోరును తదుపరి దిశకు తీసుకు వెళ్లేందుకు డొనాల్ట్ ట్రంప్ యంత్రాంగం సిద్ధమవుతోంది. వేలాదిగా అమెరికా బలగాలను పశ్చిమాసియాకు తరలించేందుకు యూఎస్ మిలటరీ సన్నాహకాలు చేస్తోందని ఉన్నతాధికార వర్గాల సమాచారం.