Home » Donald Trump
అగ్రరాజ్యం అమెరికాను పరిపాలించిన అధ్యక్షుల ఫొటోలు వైట్హౌస్లో తప్పనిసరిగా ఉంటాయి. వారు డెమొక్రాట్లైనా లేదా రిపబ్లికన్లైనా వారి ఫొటోలకు శ్వేతసౌధంలో స్థానం పదిలం. ఇటీవల వైట్హౌస్లో 'ప్రెసిడెన్షియల్ వాక్ ఆఫ్ ఫేమ్' అనే ప్రత్యేక గ్యాలరీని ఏర్పాటు చేశారు.
అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒక్కో సైనికుడి ఖాతాలోకి 1776 డాలర్లు జమ చేయనున్నట్లు తెలిపింది. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంతో దేశ వ్యాప్తంగా ఉన్న 1.4 మిలియన్ల సైనికులు లబ్ది పొందనున్నారు.
థాయ్లాండ్, కాంబోడియాల మధ్య గత వారం రోజులుగా సరిహద్దు వెంబడి ఘర్షణలు కొనసాగుతున్నాయి. అయితే, ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ జరిగిందని ట్రంప్ తాజాగా ప్రకటించారు. అయితే, ఆయన ప్రకటన వాస్తవ పరిస్థితిని ప్రతిబింబించడం లేదని థాయ్ ఆపద్ధర్మ ప్రధాని పేర్కొన్నారు. కాంబోడియా మాత్రం మౌనాన్నే ఆశ్రయించింది.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన అత్యంత స్నేహపూర్వకంగా సాగింది. పుతిన్ రెండ్రోజుల పర్యటనను ప్రపంచ దేశాలు ఎంతో ఆసక్తికరంగా గమనించాయి. చైనా వంటి దేశాలు పుతిన్ భారత పర్యటనను ఆహ్వానించాయి. అయితే ఆమెరికాలో మాత్రం ఆగ్రహ జ్వాలలు చెలరేగుతున్నాయి.
ఒకవైపు సుంకాలతో దాడులకు దిగుతూనే మరోవైపు ట్రేడ్ డీల్ ద్వారా భారత్తో సయోధ్య కుదుర్చుకోవడానికి అమెరికా ప్రయత్నిస్తోంది. ఇరు దేశాల మధ్య ట్రేడ్ డీల్కు సంబంధించి కొన్ని నెలలుగా చర్చలు జరుగుతున్నాయి. అయితే అవి ఒక కొలిక్కి రావడం లేదు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా శ్వేత సౌధం ప్రెస్ సెక్రెటరీ కెరొలైన్ లెవిట్పై ప్రశంసలు కురిపించారు. అందమైన ముఖం, మెషీన్ గన్లా కదిలే పెదవులతో టీవీ ఇంటర్వ్యూల్లో అమెరికా ప్రభుత్వ విధానాలను గట్టిగా సమర్థిస్తుందని వ్యాఖ్యానించారు. ఆమె సూపర్ స్టార్ అని కీర్తించారు.
తాము వలసలను భారీగా తగ్గించామని, అందువల్లే గత 50 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా అమెరికన్లకు ఎక్కువ ఉద్యోగావకాశాలు, మంచి వేతనాలు దక్కుతున్నాయని అన్నారు. పెన్సిల్వేనియాలోని మౌంట్ పొకానోలో మంగళవారం జరిగిన సభలో ట్రంప్ ప్రసంగించారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపునకు సంబంధించి తాము ప్రతిపాదించిన శాంతి ప్రణాళికకు అంగీకరించాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అవుతున్న బియ్యంపై భారీ మొత్తంలో టారిఫ్లు విధించడానికి పూనుకున్నారు. తాజాగా, వైట్ హౌస్లో జరిగిన సమావేశంలో ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు.
భారత్పై భారీగా సుంకాలు విధించడం, హెచ్1బీ వీసా నిబంధనలను కఠినతరం చేయడం వంటి చర్యలతో భారత్-అమెరికా దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే అమెరికా కాంగ్రెస్ నాయకులు మాత్రం భారత్తో బలమైన బంధాలను కోరుకుంటున్నారు.