Home » Donald Trump
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 20 గంటల విమాన ప్రయాణంలోనూ అస్సలు నిద్రపోరట. అలర్ట్గా ఉండి, ఆ 20 గంటల పాటు కిటికీ బయటకు చూస్తూ ఉంటారట. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే చెప్పారు.
రష్యా చమురు కొనుగోళ్లను నిలిపివేసేందుకు భారత్ అంగీకరించిందని ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ అంశంపై భారత విదేశాంగ శాఖ తాజాగా స్పందించింది. దేశ ప్రజల ఇంధన భద్రతకే తమ తొలి ప్రాధాన్యత అని స్పష్టం చేసింది.
వాణిజ్య ఒప్పందానికి సంబంధించి భారత్, అమెరికా త్వరలో సంయుక్త ప్రకటన విడుదల చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అనంతరం, డీల్కు సంబంధించి కీలక వివరాలు వెల్లడికానున్నాయి.
సీఎన్ఎన్ ఛానల్కు చెందిన ఓ మహిళా రిపోర్టర్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్ష భవనంలోని ఓవల్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సీఎన్ఎన్ ఛానెల్కు చెందిన కైట్లాన్ కొల్లిన్స్ అనే మహిళా జర్నలిస్ట్పై ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
భారత్ విషయంలో సుంకాలను తగ్గిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన చేయడం వెనుక ఓ వ్యక్తి కీలకంగా మారారు. ప్రస్తుతం ఆయన పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయనే భారత్ లోని అమెరికా రాయబారిగా పని చేస్తున్న సెర్గియో గోర్.
కేవలం ఒక వారంలోనే రెండు ప్రపంచ స్థాయి వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకోవడం ద్వారా భారతదేశ ఆర్థిక వ్యవస్థకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ నూతన ఉత్తేజాన్ని అందించారని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ప్రధానికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
భారత్తో అమెరికా వాణిజ్య ఒప్పందం కుదిరింది. భారత్పై ప్రతీకార సుంకాలను 25శాతం నుంచి 18శాతానికి తగ్గిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం ప్రకటించారు.
అమెరికా తమపై దాడికి పాల్పడితే పశ్చిమాసియాలో ప్రాంతీయ యుద్ధం తప్పదని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ హెచ్చరికలపై తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు.
ఇరాన్ చుట్టు పక్కల ప్రాంతాల్లో యుద్ధ నౌకలను మొహరించిన ట్రంప్ యంత్రాంగానికి ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ సూటిగా హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్పై అమెరికా దాడికి పాల్పడితే పశ్చిమాసియాలో ప్రాంతీయ యుద్ధం తప్పదన హెచ్చరించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఆ దేశ ఐఆర్ఎస్, ఆర్థిక విభాగాలపై కోర్టులో దావా వేశారు. ట్రంప్తో పాటు ఆయన ఇద్దరు కుమారులకు సంబంధించిన వ్యాపార, వ్యక్తిగత పన్ను రిటర్నుల సమాచారం లీక్ కాకుండా నిరోధించడంలో విఫలమయ్యాయని అందులో పేర్కొన్నారు.