Home » Dog
పట్టణాల్లో వీధి కుక్కలు ఇంకా రోడ్లపై గుంపులుగా చేరి మొరుగుతూనే ఉన్నాయి. జనం పిక్కల బలానికి పరీక్షలు పెడుతూనే ఉన్నాయి. కుక్కకాటుతో ఆసుపత్రులను ఆశ్రయిస్తున్న వారి సంఖ్యలో పెద్దగా మార్పేమీ కనిపించడం లేదు.
కూకట్పల్లి నియోజకవర్గంలో వీధి కుక్కల బెడద తీవ్రంగా ఉంది. పలు కాలనీల్లో గుంపులు గుంపులుగా సంచరిస్తూ స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. రాత్రి, పగలు అన్న తేడా లేకుండా స్థానికులను వెంటాడి కరుస్తున్నాయి.
దేశంలో వీధి కుక్కల సమస్యలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వీధి కుక్కల కేసుపై ఇవాళ(శుక్రవారం) విచారణ చేపట్టిన ధర్మాసనం.. రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించింది.
హార్ట్ టచింగ్ వీడియో ఇది.. ప్రమాదాన్ని ముందుగానే గ్రహించిన ఒక పెంపుడు కుక్క, తన యజమానిని కారు ప్రమాదం నుంచి కాపాడింది. ఈ దృశ్యాలు మొత్తం సీసీ టీవీలో రికార్డ్ కావడంతో ఈ అపురూపమైన ఘటన అందరి ముందుకు వచ్చింది.
కుక్కల నుండి ఈ నాలుగు విషయాలు నేర్చుకోవాలని ఆచార్య చాణక్యుడు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
దేశంలోనే మొట్టమొదటి సారిగా పెంపుడు జంతువులను పర్యవేక్షించేందుకు వాటికి మైక్రో చిప్ అమర్చేందుకు, లైసెన్స్ తదితర సేవలను జతచేస్తూ కొత్తగా రూపొందించిన వెబ్సైట్ను గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ మేయర్ ఆర్.ప్రియ ప్రారంభించారు.
కుక్కను బెదిరించాడన్న కోపంతో తండ్రీకొడుకులు ఓ బాలుడిపై దాడిచేశారు. ఈ సంఘటన సరూర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దిల్సుఖ్నగర్ కోదండరాంనగర్ కాలనీకి చెందిన దాసరి సాయి(17) ఆదివారం రాత్రి 9.30 గంటలకు కర్రీ పాయింట్కు నడుచుకుంటూ వెళ్తున్నాడు.
ఇటీవల పట్టణంలో ఎటుచూసిన గ్రామసింహాలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఏస్థాయిలో ఉన్నాయో చెప్పడానికి పై చిత్రమే నిదర్శనం. ఒక టో రెండో కాదు పదుల సంఖ్యలో ఒకేచోట చేరుతున్నాయి. ఆ సమయంలో అటుగా వెళ్లే పాదచారులు లేదా ద్విచక్రవాహన చోదకుల వెంటపడి దాడిచేస్తున్నాయి.
రోజురోజుకు శునకాల బెడద అధికమవుతున్న నేపథ్యంలో గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ అధికారులు కఠిన చర్యలకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా పెంపుడు శునకాలకు ‘మైక్రో చిప్’ అమర్చాలంటూ గతంలో జారీ చేసిన ఉత్తర్వులను కఠినంగా అమలు చేయాలని నిర్ణయించారు.
నేర పరిశోధన, ప్రజల శ్రేయస్సులో పోలీసు జాగిలాలది కీలక పాత్రని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత ఉద్ఘాటించారు. పోలీసు జాగిలాల శిక్షణతో పాటు, వాటి సంరక్షణపైనా ప్రత్యేక దృష్టి పెట్టాలని హోంమంత్రి అనిత సూచించారు.