Home » Dog Bite
మధ్య ప్రదేశ్లోని శివ్పురి వీధుల్లో ఓ వీధి కుక్క బీభత్సం సృష్టించింది. ఒకే రోజు దాదాపు 60 మందిని విచక్షణా రహితంగా కరిచింది. వీధి కుక్క దాడిలో గాయపడ్డ వారిలో మహిళలు, చిన్న పిల్లలు కూడా ఉన్నారు.
పిట్ బుల్ జాతి కుక్కల కారణంగా ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. రెండు పిట్ బుల్స్ ఆ మహిళను అతి దారుణంగా కొరికి చంపేశాయి. ఈ సంఘటన అమెరికాలో చోటుచేసుకుంది.
వీధికుక్కల వల్ల సామాన్య ప్రజలకు గాయాలైనా, హాని లేదా నష్టం జరిగితే.. దానికి సంబంధించిన న్యాయపరమైన బాధ్యతను తీసుకునేందుకు జంతుప్రేమికులు, జంతు సంక్షేమ సంస్థలు, ఎన్జీవోలు సిద్ధమేనా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
వీధి కుక్కల దాడిలో చిన్నారి మరణించిన ఘటనపై హెచ్ఆర్సీ సీరియస్ అయింది. రెండు ఘటనలపై సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో వచ్చిన కథనాన్ని ఆధారంగా చేసుకొని సుమోటోగా ఈ కేసు విచారణకు స్వీకరించింది.
మార్నింగ్ వాక్కు వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్న మహిళపై ఎదురింటి వారి పెట్ డాగ్ అత్యంత క్రూరంగా దాడి చేసింది. ఆ దాడి వల్ల బాధిత మహిళకు 50కి పైగా కుట్లు పడ్డాయి. CCTVలో భయానక దృశ్యాలు రికార్డయ్యాయి.
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రంలో దారుణం జరిగింది. సుమారు 80కి పైగా వీధి కుక్కలు మృత్యువాతపడ్డాయి. మత్తు ఇంజక్షన్ల ద్వారా వీటిని హతమార్చినట్టు ఆరోపణలు వస్తున్నాయి.
వీధి కుక్కలను చంపడంపై ప్రముఖ సినీ నటి రేణూ దేశాయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల కొన్ని ప్రాంతాల్లో వీధి కుక్కల దాడుల పేరుతో వాటిని హతమార్చడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు..
కుక్కల వల్ల ఎవరైనా గాయపడినా, చనిపోయినా.. దానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించే విధంగా ఆదేశిస్తామంటూ సుప్రీం కోర్టు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది.
హనుమకొండలో భారీ సంఖ్యలో వీధి కుక్కలను హతమార్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామ పంచాయతీ సిబ్బందే స్వయంగా ఈ దారుణానికి ఒడిగట్టడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. మూగజీవాల పట్ల ఇంతటి క్రూరత్వమా అని జంతు ప్రేమికులు మండిపడుతున్నారు.
భైంసా పట్టణంలో ఓ పిచ్చి కుక్క బీభత్సం సృష్టించింది. సోమవారం ఒక్క రోజే 50మందిపై దాడిచేసి గాయపరిచింది. శునకం దాడిలో నలుగురు చిన్నారులు, 20 మంది మహిళలు, 26 మంది పురుషులు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.