Home » Dog Bite
మార్నింగ్ వాక్కు వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్న మహిళపై ఎదురింటి వారి పెట్ డాగ్ అత్యంత క్రూరంగా దాడి చేసింది. ఆ దాడి వల్ల బాధిత మహిళకు 50కి పైగా కుట్లు పడ్డాయి. CCTVలో భయానక దృశ్యాలు రికార్డయ్యాయి.
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రంలో దారుణం జరిగింది. సుమారు 80కి పైగా వీధి కుక్కలు మృత్యువాతపడ్డాయి. మత్తు ఇంజక్షన్ల ద్వారా వీటిని హతమార్చినట్టు ఆరోపణలు వస్తున్నాయి.
వీధి కుక్కలను చంపడంపై ప్రముఖ సినీ నటి రేణూ దేశాయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల కొన్ని ప్రాంతాల్లో వీధి కుక్కల దాడుల పేరుతో వాటిని హతమార్చడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు..
కుక్కల వల్ల ఎవరైనా గాయపడినా, చనిపోయినా.. దానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించే విధంగా ఆదేశిస్తామంటూ సుప్రీం కోర్టు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది.
హనుమకొండలో భారీ సంఖ్యలో వీధి కుక్కలను హతమార్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామ పంచాయతీ సిబ్బందే స్వయంగా ఈ దారుణానికి ఒడిగట్టడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. మూగజీవాల పట్ల ఇంతటి క్రూరత్వమా అని జంతు ప్రేమికులు మండిపడుతున్నారు.
భైంసా పట్టణంలో ఓ పిచ్చి కుక్క బీభత్సం సృష్టించింది. సోమవారం ఒక్క రోజే 50మందిపై దాడిచేసి గాయపరిచింది. శునకం దాడిలో నలుగురు చిన్నారులు, 20 మంది మహిళలు, 26 మంది పురుషులు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.
రంగారెడ్డి జిల్లాలో వీధి కుక్కలు బీభత్సం సృష్టించాయి. నాలుగేళ్ల చిన్నారిపై కుక్కలు విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా కరిచాయి. దీంతో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు.
రాజన్న ఆలయం వద్ద ఓ పిచ్చి కుక్క స్వైర విహారం చేసింది. ఆలయానికి వచ్చిన భక్తులపై పిచ్చికుక్క దాడి చేసింది. దీంతో పలువురు భక్తులు గాయపడ్డారు.
అనంత నగరంలో వీధికుక్కలు 10 వేలకుపైగా ఉన్నాయంటే నమ్మడానికి చిత్రంగా ఉన్నా.. ఇది నిజం. వాటి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఏ వీధికెళ్లినా గుంపులు గుంపులుగా స్వైరవిహారం చేస్తున్నాయి. జనంపై దాడి చేస్తున్నాయి.
పట్టణంలో వీధి కుక్కల నియంత్రణకు ఎట్టకేలకు మున్సిపల్ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకునేందుకు త్వరలో శ్రీకారం చుట్టనున్నారు. వీధికుక్కల సంఖ్య పెరగకుండా పటిష్ట చర్యలకు రంగం సిద్ధం చేస్తున్నారు. దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలతో మున్సిపల్ అధికారుల్లో కదలిక వచ్చింది.