Home » DMK
పాట్టాలి మక్కల్ కట్చి (పీఎంకే)లో ప్రస్తుతం నెలకొన్న సంక్షోభానికి డీఎంకే కారణం కాదని ఆ పార్టీ వ్యవస్థాపకుడు డాక్టర్ రాందాస్ స్పష్టం చేశారు. నగరంలో అస్వస్థతకు గురై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న పార్టీ గౌరవాధ్యక్షుడు జీకే మణి, ఎమ్మెల్యే అరుళ్ను పరామర్శించేందుకు గురువారం రాందా స్ దిండివనం నుం డి నగరానికి చేరుకున్నారు.
మదురైలో మురుగన్ మహానాడు నిర్వహించడం వల్ల రాష్ట్రంలో బీజేపీ పరపతి పెరిగే అవకాశమే లేదని డీఎంకే ఎంపీ కనిమొళి ఎద్దేవా చేశారు. కన్నియాకుమారిలో బుధవారం ఉదయం ఆమె మీడియాతో మాట్లాడుతూ డీఎంకే కూటమి మరింత పటిష్టంగానే ఉందని మిత్రపక్షాల్లో కొన్ని పార్టీలు కూటమి నుండి వైదొలగుతాయని బీజేపీ, అన్నాడీఎంకే నేతలు చేస్తున్న ప్రకటనలు అవాస్తవాలన్నారు.
ఢిల్లీ నుండి రాష్ట్రంపై పెత్తనం చెలాయించేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పేర్కొన్నారు. సేలంలోని మోహన్కుమారమంగళం ప్రభుత్వ వైద్యకళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన సభలో రూ.880 కోట్లతో నిర్మించనున్న జౌళి పార్కుకు, రూ.100 కోట్లతో నిర్మించనున్న కొత్త గ్రంథాలయ భవనానికి ఆయన శంకుస్థాపన చేశారు.
ఎన్నికల్లో కూటమి లేకుండా డీఎంకే గెలవడమన్నది అసాధ్యమని, 2019 లోక్సభ ఎన్నికల నుండి 2024 లోక్సభ ఎన్నికల దాకా మిత్రపక్షాలను కలుపుకునే ఆ పార్టీ గెలిచిందని, ఈ పరిస్థితి వచ్చే యేడాది జరిగే శాసనసభ ఎన్నికల్లోనూ కొనసాగుతుందని సీపీఎం రాష్ట్ర కమిటీ కార్యదర్శి పి.షణ్ముగం వ్యాఖ్యానించారు.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా ఇతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అసత్య ఆరోపణలు చేసి, ఆయా రాష్ట్రాల్లో మతచిచ్చు రగల్చడమే పనిగా పెట్టుకున్నారని, మదురై సభలో హోదా కూడా మరచిపోయి తమపై విమర్శలు చేశారని డీఎంకే డిప్యూటీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ ఎ.రాజా ధ్వజమెత్తారు.
బీజేపీ రాష మాజీ అధ్యక్షుడు అన్నామలై సంచలన ఆరోపణలు చేశారు. అన్నా విశ్వవిద్యాలయంలో జరిగిన అత్యాచారం కేసుతో కోట్టూరుపురం డీఎంకే స్థానిక నాయకుడు షణ్ముగంకు, ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యంకు సంబంధాలున్నాయని అన్నామలై ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తమిళనాట తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఇక వివరాల్లోకి వెళితే..
ఏం భయంలేవు.. మళ్లీ అధికారం మనదే.. అంటూ డీఎంకే పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆ పార్టీ కార్యకర్తలకు లేఖ రాశారు. జూన్ ఒకటో తేదీ ఉదయం 9 గంటలకు మదురైలో పార్టీ సర్వసభ్య సమావేశం జరుగుతుందని తెలిపారు.
హీరోగారూ.. ఆ పార్టీని ఓడిద్దాం... మా కూటమిలోకి రండి,, అంటూ టీవీకే అధ్యక్షుడు విజయ్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్ ఆహ్వానించారు. ఎన్డీయే కూటమిలోకి విజయ్ పార్టీ కూడా చేరితే ఇక తిరుగులేని విజయం ఖాయమన్నారు.
సినిమాల్లో అనేక పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం (MNM) పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ ఇప్పుడు రాజ్యసభకు (Kamal Haasan Rajya Sabha) వెళ్లనున్నారు. ఆయన పార్లమెంటరీ రాజకీయాల్లోకి అడుగుపెట్టేందుకు డీఎంకే పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది.
అధికార డీఎంకే పార్టీపై ప్రముఖ హీరో, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ ధ్వజమెత్తారు. ఇది దురహంకార ఫాసిస్ట్ పాలన.. అంటూ ఆమన మండిపడ్డారు. డీఎంకే ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని ఆయన వ్యాఖ్యానించారు.