Home » DMK
హిందీ వ్యతిరేక ఆందోళన 1965లో తారాస్థాయికి చేరినప్పటి వీడియోను సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో స్టాలిన్ ఆదివారంనాడు పోస్ట్ చేశారు. 'భాషా అమరవీరుల దినోత్సవం: అప్పుడు, ఇప్పుడు హిందీకి ఇక్కడ చోటు లేదు' అని స్టాలిన్ రాసుకొచ్చారు.
చెన్నైలోని క్వాయిడ్-ఇ-మిల్లత్ ప్రభుత్వ మహిళా కళాశాల మంగళవారం జరిగిన కార్యక్రమంలో దయానిధి మారన్ పాల్గొన్నారు. తమ ప్రభుత్వం అందజేసిన ల్యాప్టాప్లతో లబ్ధిదారులు చదువుకోవడం, ఇంటర్వ్యూలకు హాజరవడం జరుగుతోందని, ఇందుకు తాము గర్విస్తున్నామని చెప్పారు.
తమిళనాడు తమకు కీలక రాష్ట్రమని, ఇండియా కూటమి కీలకమైన కూటమి అని మాణిక్యం ఠాగూర్ అన్నారు. ఇందులో కాంగ్రెస్ భాగస్వామిగా ఉందని, డీఎంకే కీలక భాగస్వామి అని చెప్పారు.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, కాంగ్రెస్ పార్టీకి 32 సీట్లు కేటాయించేందుకు డీఎంకే నుంచి ప్రతిపాదన వచ్చింది. అయితే 40 సీట్లు ఇవ్వాలని కాంగ్రెస్ పట్టుబడుతోంది. కనీసం 38 సీట్లయినా ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు బేరం పెట్టినట్టు చెబుతున్నారు.
మరికొద్దిరోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్నాడీఎంకే పార్టీ బలహీనంగా ఉన్నా ఆ పార్టీనే తమ ప్రత్యర్ధి అని ఆయన అన్నారు.
ఏం డౌట్ అవసరం లేదు.. మళ్లీ వచ్చేది డీఎంకే పాలనే.. అని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అన్నారు. ఆయన మాట్లాడుతూ... డీఎంకే ఎన్నికల మేనిఫెస్టో తయారీ చేసే బాధ్యత కూడా ఎంపీ కనిమొళికి అప్పగించానని తెలిపారు. డీఎంకేకు అధికారం ఖాయం అని ఆయన అన్నారు.
అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి డీఎంకే తరుపున రూపుదిద్దుకోనున్న మేనిఫెస్టో ప్రజలను ఆకట్టుకునేలా ఉంటుందని ఎంపీ కనిమొళి అన్నారు. ఆమె మాట్లాడుతూ... రాష్ట్రంలో జరగాల్సిన అభివృద్ధి, నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు, మహిళలకు హక్కులు, అన్నదాతలకు భద్రత వంటి అంశాలపై మేనిఫెస్టో రూపొందిస్తున్నట్లు ఆమె తెలిపారు.
త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే పార్టీకి మద్దతుగా ప్రచారం చేస్తానని ఎంఎన్ఎం పార్టీ అధ్యక్షుడు, సినీనటుడు కమల్హాసన్ అన్నారు. ఆయన మాట్లాడుతూ... ఎన్నికల్లో డీఎంకే విజయం ఖాయమని, అన్నాడీఎంకేకు ఓటమి తప్పదని కమల్ అన్నారు.
నా విజయం వెనుక భార్య త్యాగం ఉంది.. ఇల్లాలి మాటను భర్త శిరసావహించాలి.. అని అన్నారు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్. భార్య చెప్పే మంచిమాటలను భర్త శిరసావహించాలని, అప్పు డే అన్యోన్య దాంపత్యం సాగుతుందన్నారు. కొళత్తూరులో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
మరికొద్ది రోజుల్లో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న తరుణంలో.. అగ్రహీరో, టీవీకే పార్టీ అధినేత విజయ్కి అతని సన్నిహితుడు, ఇప్పటివరకు ఆయన వెన్నంటి ఉన్న పీటీ సెల్వకుమార్ ఝలక్ ఇచ్చారు. ఆయన టీవీకేని వదిలి డీఎంకే పార్టీలో చేరారు.