Home » DMK
సమావేశానంతరం సెల్వపెరుంతగై మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రిని గిరీష్ కలవడంతో అన్ని ఊహాగానాలకు తెరపడినట్టేనని చెప్పారు. కాంగ్రెస్, డీఎంకే మధ్య పటిష్టమైన పొత్తు ఉందని, కలిసికట్టుగా గతంలో ఐదు ఎన్నికలు గెలిచామని చెప్పారు. తమది 'విన్నింగ్ అలయెన్స్' అని అభివర్ణించారు.
తమిళనాడు ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటికే శాంతి భద్రతలు వైఫల్యం, అవినీతి, అవకతవకల్లో కూరుకుపోయిందని, అయితే ముఖ్యమంత్రి నుంచి సీనియర్ మంత్రులందరూ ఇలాంటి వినోదాల్లో తేలుతుండటం సిగ్గుచేటని బీజేపీ విమర్శించింది.
ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీసీఎం ఎడప్పాడి పళనిస్వామి రైతు కాదు... ద్రోహి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా పెను దుమారాన్ని రేపాయి. మరొకొద్ది రోజుల్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ ఆరోపణలు, విమర్శల పర్వం కొనసాగుతోంది.
రాష్ట్ర న్యాయశాఖ మంత్రి రఘుపతి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి ‘సి’ టీం టీవీకే పార్టీ.. అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. ఇవి రాష్ట్ర వ్యాప్తంగా పెను దుమారాన్ని లేపుతున్నాయి. మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపధ్యంలో ‘పొలిటికల్ హీట్’ బాగా పెరిగిపోయింది.
తెలియని వారికి ఎస్ఐఆర్ ఫారాలను డీఎంకే శ్రేణులు పూర్తిచేయడం తప్పా అని పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి కేఎన్ నెహ్రూ ప్రశ్నించారు. ఈ నెల 9వ తేదీ తన జన్మదినం సందర్భంగా టీటీడీలో ఒక రోజు అన్నదానం కోసం రూ.44 లక్షలు కేఎన్ నెహ్రూ విరాళంగా అందజేసిన వ్యవహారం సోషల్ మీడియాలో వివాదాస్పదంగా మారింది.
గడిచిన నాలుగున్నరేళ్లుగా మాయమాటలతో కపట నాటకాలాడుతున్న దుష్టశక్తుల పాలనకు చరమగీతం పాడనున్నామని, వచ్చే యేడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాశక్తి విలువ తెలియజేస్తామని ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) నేత విజయ్ ధ్వజమెత్తారు.
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) పేరుతో ప్రజాస్వామ్యాన్ని చంపేందుకు యత్నిస్తున్నారని డీఎంకే ఎంపీ కనిమొళి వ్యాఖ్యానించారు. తూత్తుకుడిలో శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ... ఎన్నికల ముందు ‘సర్’ అత్యవసరంగా అమలుచేయాల్సిన అవసరం లేదన్నారు.
నలుపు, ఎరుపు రంగులు కలిగిన డీఎంకే పతాకం రూపొందించి 75 యేళ్లు పూర్తయిన సందర్భంగా శనివారం వళ్లువర్కోట్టం లో రెండు రోజుల సదస్సు నిర్వహించనున్నారు. పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగనున్నాయి.
తమిళనాడు ప్రజల ఓటు హక్కులను లాక్కుని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేందుకు హడావిడిగా ఎస్ఐఆర్ను అమలు చేయాలనుకుంటున్నారని, దీనికి వ్యతిరేకంగా అన్ని పార్టీలు ఐక్యంగా తమ గొంతు వినిపించాల్సి ఉందని సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో స్టాలిన్ తెలిపారు.
వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో బీజేపీ అదృశ్యమవుతుందని, డీఎంకే మళ్లీ అధికారం చేపడుతుందని మంత్రి రఘుపతి జోస్యం చెప్పారు. పుదుకోటలో గురువారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ... ఎస్ఐఆర్పై నవంబరు 2వ తేది అఖిలపక్ష సమావేశం తర్వాత ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారన్నారు.