Home » Dharmavaram
నియోజకవర్గంలో చేపట్టవల సిన అభివృద్ధి పనులపై రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ శనివారం రాత్రి రెవిన్యూ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహిం చారు. ఈ సమీక్షలో మంత్రి మాట్లాడుతూ...నియోజకవర్గం అభివృద్ధి ప ట్ల మన బాధ్యత అత్యంత కీలకమైందన్నారు. ప్రతివార్డు, గ్రామ ప్రజల కు అభివృద్ధి ఫలాలు చేరేలా అధికారులు ప్రణాళికా బద్ధంగా పనిచేయా లని అదేశించారు.
ఘోర బస్సు ప్రమాద ఘటన లో ధర్మవరం యువకులు చూపిన ధైర్యం ఆదర్శనీయమని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్యాదవ్ కొనియాడారు. కర్నూలు వద్ద రెండురోజుల క్రితం జరిగిన బస్సు ప్రమాదంలో పదిమందికి పైగా ప్రాణాలను కాపాడిన ధర్మవరం యువకులను మంత్రి సన్మానించారు.
పట్టణంలోని కూరగాయల మా ర్కెట్ వద్ద ఉన్న సబ్ రిజిసా్ట్రర్ కార్యాలయం ఎదుట రోడ్డుపైనే ద్విచ క్రవాహనాలను పార్కింగ్ చేస్తున్నారు. దీంతో రోడ్డు ఇరుకుగా మారింది. ఆ రోడ్డు వెళ్లే వాహనదారులు, పాదాచారులు చాలా ఇబ్బందులు పడు తున్నారు. ప్రతి రోజు రిజిసే్ట్రషనల కోసం ఎంతోమంది సబ్రిజిసా్ట్రర్ కార్యాలయానికి వస్తుంటారు.
అప్పులు చేసి, ఆరుగాలం కష్టపడి పండించిన పంట మూడురోజులు గా కురిసిన వర్షానికి పూర్తిగా తడిసి ముద్ద అయింది. వేరు శనగకాయలతో పాటు పశువుల మేత కూడా నల్లగామారి ఆ రైతును నిండాముంచింది. మండలంలోని దర్శినమల గ్రామానికి చెందిన రైతు నారాయణ, లక్ష్మీనారాయణమ్మ కుటుంబం నాలుగు ఎకరాలను కౌలుకు తీసుకుని బోరుబా వి కింద వేరుశనగను పంట సాగుచేశారు.
విద్యార్థుల శ్రేయస్సుకు కృషి చేస్తున్నామని, ప్రతి విద్యార్థి ఉద్యోగం సాధించాల్నదే తమ ప్రధాన లక్ష్యమని మంత్రి సత్యకుమార్యాదవ్ అన్నారు. గత నెల 16న సం స్కృతి సేవా సంస్థ ఆధ్వర్యంలో నంగ్యాలలోని గురురాఘవేంద్ర బ్యాం కింగ్ కోచింగ్ సెంటర్ సహకారంతో స్థానిక ప్రభుత్వ డిగ్రీకళాశాలలో శిక్షణ అర్హత పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు 120 మంది విద్యార్థులు హాజరయ్యారు
గ్రామాల అభివృద్ధే ధ్యే యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్యాదవ్ పేర్కొన్నారు. మండలంలోని మోటుమర్ల నుంచి కత్తేకొట్టాల వరకు, పోతులనాగేపల్లి మీదుగా కనంపల్లికి, ధర్మవరం రోడ్డు నుంచి చింతలపల్లి, వసంతపురం నుంచి చిగిచెర్ల క్రాస్ వరకు బీటీ రోడ్ల నిర్మాణానికి ఉపాధి హామీ పథకం కింద రూ.6.10కోట్లు నిధులు మంజూరయ్యాయి.
తమ గ్రామాలను మున్సిపాలిటీలోకి విలీనం చేస్తే ము న్సిపాలిటీ విఽధించే పన్నులు చెల్లించ లేమని పలు గ్రామాల ప్రజలు, టీ డీపీ నాయకులు పేర్కొన్నారు. తా మంతా వ్యవసాయం, ఉపాధిహామీ పథకం ద్వారా జీవనం సాగిస్తున్నా మని, మున్సిపాలిటీలోకి తమ గ్రా మాల విలీనం ప్రక్రియను ఆపాలని వారు డిమాండ్ చేశారు.
రహదారులు సరిగా లేకపోవడంతో మండలపరిధిలోని పలు గ్రామాల ప్రజలు చాలా ఇబ్బం దులు పడుతున్నారు. ప్రభుత్వాలు మారినా, అధికారులు మారినా ఎవరూ పట్టించుకున్న పాపనపోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత వైసీపీ హయాంలోనూ ఎవరూ పట్టించుకో లేదు. అయితే కూటమి ప్రభు త్వం రాగానే గ్రామీణ రహదారులకు మోక్షం లభించింది.
ఎస్పీ, ఇద్దరు డీఎస్పీలు, 8 మంది సీఐలు, 10 మంది ఎస్ఐలు, 156 మంది సిబ్బంది ఒక్కసారిగా తనిఖీలకు దిగడంతో ధర్మవరం దద్దరిల్లింది. పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో ధర్మవరం, పెనుకొండ డీఎస్పీలు హేమంతకుమార్, నరసింగప్ప, సీఐలు, ఎస్ఐలతో కలిసి ఎస్పీ సతీష్కుమార్ బుధవారం సోదాలు నిర్వహించారు. ప్రతి ఇంటినీ క్షుణ్ణంగా తనిఖీ చేశారు. నేర చరిత్ర ఉన్నవారికి ఎస్పీ గట్టి హెచ్చరికలు జారీ చేశారు.
మండలంలోని చిన్నూరుబత్తలపల్లి వరిపొలాల్లోకి రావులచెరువుకు వెళ్లే కాలువనీరు వెళుతుండటంతో సాగురైతులు ఇబ్బందులు పడుతున్నారు. రావులచెరువుకు ధర్మవరం చెరువు నుంచి నీరు విడుదల చేశారు. అయితే చెరువుకు వెళ్లే కాలువ గడ్డితో కుంచించిపోవడంతో కాలువలో నీరు సరిగ్గా వెళ్లక చిన్నూరుబత్తలపల్లి రైతుల వరి పొలాల్లోకి వెళ్లాయి.