Home » Dharmavaram
వైసీపీ నేతలపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ధ్వజమెత్తారు. సుబ్బరాయసాగర్ ప్రాజెక్టు గేట్లకు కనీసం గ్రీస్ పెట్టిన పాపానపోలేదని ఆయన తీవ్రంగా విమర్శించారు. అలాగే.. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిపై కూడా జేసీ ప్రభాకర్రెడ్డి ఫైర్ అయ్యారు.
పట్టణ పరిసర ప్రాంతాల్లోని రెవెన్యూ, మున్సిపల్ రిజర్వుడ్ స్థలాలు ఆక్రమణకు గురయ్యాయని, వాటిని వెంటనే స్వాధీనం చేసుకోవాలని టీడీపీ నాయకులు ఆర్డీవో మహేశకు విన్నవించారు. ఈ మేరకు వారు సోమవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీవోను కలిసి ఆధారాలతో వినతిపత్రం అందజేశారు.
అధికారంలో ఉన్నప్పుడు బెదిరిం పులు, దౌర్జన్యాలతో పెట్టుబడులు రాకుండా చేశారని, ఇప్పుడు అధికారం పోయాక కూడా అదే ధోరణితో వ్యవహరిస్తున్నారని వైసీపీ అధినేత జగనపై టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్ పరిటాలశ్రీరామ్ మండిపడ్డారు. నియోజకవర్గ వ్యాప్తంగా 33 మంది లబ్దిదారులకు రూ.12.90లక్షల వి లువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన సోమవారం పట్టణంలోని టీడీ పీ ఎర్రగుంట కార్యాలయంలో లబ్ధిదారులకు పంపిణీచేశారు.
హైదరాబాద్కు చెందిన విశ్వం ఎడ్యుటెక్ ఆధ్వర్యంలో నిర్వహించిన అబాకస్, వేధిక్ మ్యాథ్స్ జోనల్ లెవల్ పరీక్షలలో పట్టణంలోని పలు పాఠశాలల విద్యార్థులు ప్రతిభ కనబరచినట్టు జోనల్ మేనేజర్ శివాంజనేయులు తెలిపారు. ఆయన ఆదివారం మాట్లాడుతూ....కాకతీయ విద్యానికేతనలో నిర్వహిం చిన ఈ పరీక్షలకు పట్టణంలోని 20 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల నుంచి దాదాపు 400 మంది విద్యార్థులు పాల్గొన్నారని తెలిపారు.
గత వైసీపీ పాలనలో ఆ పార్టీ నాయ కులు ధర్మవరంలో పెద్దఎ త్తున మున్సిపల్, రెవెన్యూ స్థలాలను కబ్జా చేశారని, వాటిలో వాణిజ్య సము దా యాలను నిర్మించి విచ్చల విడిగా ప్రజాదనాన్ని దోపి డీ చేస్తున్నారని టీడీపీ నా యకులు ఆరోపించారు.
మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించాలనేది ప్రభుత్వ లక్ష్యం. అయితే మున్సిపాలిటీ పరిధిలో మొక్కలను నాటి వాటి సంరక్షణను గాలికి వదిలేస్తుండడంతో ఆ లక్ష్యం నీరుగారిపోతోంది. ఉన్నతాధికారులు వచ్చినప్పుడు హడావుడిగా మొక్క లను నాటడం తప్ప ఆ తరువాత వాటి గురించి పట్టించుకున్న పాపాన పోవడంలేదు.
సీఆర్ఎంటీల సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపాలని ఆ యూనియన నాయకులు శని వారం ఎమ్మెల్సీ రాంభూపాల్రెడ్డికి వినతి పత్రం అందజేశారు. వారు ఎమ్మెల్సీని శనివారం అనంతపురంలో కలిసి వినతి పత్రం అందజేసి నట్లు ఆ యూనియన నాయకుడు రమణ తెలిపారు.
మండలంలోని పోతు కుంట గ్రామ చెరువు మరువపారుతోంది. ఇటీవ ల విడుదల చేసిన హం ద్రీనీవా నీటితో రేగాటిపల్లి చెరువు మరువ పారి పోతుకుంట చెరువుకు నీరు చేరుతోంది. ప్రస్తుతం ఆ చెరువు మరువ పారుతోంది. అయితే పోతుకుంట చెరువు మరువ నుంచి నీరు వెళ్లే కాలువ పూడిపోయి, మరమ్మతులకు గురికావడంతో ఆ నీరంతా పొలాల్లోకి వెళుతోంది.
రోడ్డు భద్రతా నిబంధనలను తప్పకుండా పాటించా లని, అప్పుడే ప్రమాదాలు జరగవని ఆర్టీఓ రాణి ఆర్టీసీ డ్రైవర్లకు సూచించారు. జాతీయ రహ దారి భద్రతా మాసోత్సవాలలో భాగం గా శుక్రవారం స్థానిక ఆర్టీసీ బస్టాండ్లోని డిపో గ్యా రేజీలో శుక్రవారం సమావేశాన్ని నిర్వహించారు.
హిందూపూర్, ధర్మవరం, అనంతపూర్, గుంతకల్ వాసులకు రైల్వేశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఎస్ఎంవీటీ బెంగళూరు-బీదర్ మధ్య నడుతున్న ప్రత్యేక రైలును పొడిగిస్తున్నట్లు తెలిపింది. ఫిబ్రవరి నెలాఖరు వరకు పొడిగిస్తున్నట్లు తెలిపింది.