• Home » Dharmavaram

Dharmavaram

GOD: పెద్దమ్మ ఆలయంలో సహస్ర దీపోత్సవం

GOD: పెద్దమ్మ ఆలయంలో సహస్ర దీపోత్సవం

పట్టణంలోని సాలేవీధిలో వెలసిన పెద్దమ్మ దేవత ఆలయంలో కార్తీక మాసం శుక్రవారం సందర్భంగా సహస్ర దీపోత్సవాన్ని బుగ్గవంశస్థులు నిర్వహించారు. ఈ సందర్భంగా మూల విరాట్‌ను పట్టువస్ర్తాలు, వివిధ రకాల పూలతో అలంకరించి పూజలు చేశారు.

ROAD: అధ్వానంగా రహదారి

ROAD: అధ్వానంగా రహదారి

పట్టణం నుంచి మామిళ్లప ల్లికి వెళ్లే రహదారి గుంతలు ఏర్పడి అధ్వానంగా తయారైంది. పోతుకుంట బృందావన కాలనీ పోలీస్‌గెస్ట్‌ హౌస్‌ వద్ద నుంచి ధర్మవరంలోకి రహదారి అంతా దెబ్బతిని గుంతలు ఏర్పడ్డాయి. ఇటీవల కాలంలో ఈ రహదారిపై ప్యాచ వర్కులు చేసినా నెలలు గడవకముందే రహదారి అంతా ఛిద్ర మవు తోందని ఆ రహదారి గుండా ప్రయాణించే గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు.

OFFICES: పరిశుభ్రత పట్టని కార్యాలయాలు

OFFICES: పరిశుభ్రత పట్టని కార్యాలయాలు

స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ఆవరణం అపరిశుభ్రతకు నిలయంగా మారింది. మండల స్థాయి కార్యా లయాలన్నీ ఈ ఆవరణంలోనే ఉన్నాయి. దీంతో అన్ని శాఖల అఽధికారు లు ఇక్కడికి రోజూ వచ్చి పోతుంటారు. అదేవిధంగా ప్రతి నెలా మూడో వారం ఉద్యోగులందరూ. కార్యాలయాల పరిసరాలతో పాటు, గ్రామాలలో స్వచ్ఛాంధ్ర - స్వచ్ఛ భారత కార్యక్రమాన్ని చేపట్టి, పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాల్సి ఉంది.

COUNCIL: ఆ కాలనీలను మున్సిపాలిటీలో చేర్చాలి

COUNCIL: ఆ కాలనీలను మున్సిపాలిటీలో చేర్చాలి

పట్టణ సమీపంలోని పోతుల నాగేపల్లి, కుణుతూరు, రేగాటిపల్లి కాలనీలను మున్సిపాలిటీలోకి చేర్చాలం టూ కౌన్సిలర్లు మూకమ్మడిగా అధికారులను డిమాండ్‌చేశారు. సమావేశం ప్రారంభకానికి ముందే సమావేశపు హాల్‌లో ఉన్న కమిషనర్‌, అధికారుల ను చైర్‌పర్సన కాచర్ల లక్ష్మి, కౌన్సిలర్లు చైర్‌పర్సన చాంబర్‌లోకి పిలిపించు కున్నారు. పోతుల నాగేపల్లి, కుణుతూరు, రేగాటిపల్లి కాలనీలను మున్సి పాలిటీలోకి చేర్చేలా అజెండాలో ఎందుకు పొందుపరచలేదని ఇనచార్జ్‌ కమిషనర్‌ సాయికృష్ణను డిమాండ్‌చేశారు.

ROAD: దారంతా గుంతలే..!

ROAD: దారంతా గుంతలే..!

మండలంలోని ఆర్‌అండ్‌బీ రోడ్లు గుంతల మ యంగా మారాయి. వర్షాకాలం కా వడంతో ఎటుచూసినా గుంతల్లో నీరు నిలబడి వాహనాల రాకపో కలకు తీవ్ర ఇబ్బందిగా మారింది. రాళ్లఅనంతపురం క్రాస్‌ నుంచి హుస్సేనపురం, కొడవం డ్లపల్లి వరకు రోడ్డు అధ్వానంగా మారింది. ఈ మార్గంలో అధికంగా ఇసుక టిప్పర్లు వెళ్లడంతో తారురోడ్డు ధ్వసమైంది. గతంలో రోడ్డుకు అక్కడక్కడ మరమ్మతులు చేపట్టినా మళ్లీ గుంతలు ఏర్పడ్డాయి.

GOD: ఘనంగా కార్తీకమాస పూజలు

GOD: ఘనంగా కార్తీకమాస పూజలు

పట్టణంలోని స్వయంభూ కాలభైరవ స్వా మి ఆలయంలో కార్తీక మాసం మొదటి సోమవారం పూజలు ఘనంగా జరిగాయి. పూజారి ధనుంజయ ఆచారి భక్తులచే స్వామివారికి అభిషేకాలు చే యించారు. నారికేళ దీపోత్స వాన్ని నిర్వహించారు. అన్న ప్రసాద సేవ చేపట్టారు.

CYCLONE: తుఫాన పట్ల అప్రమత్తంగా ఉండాలి : తహసీల్దార్‌

CYCLONE: తుఫాన పట్ల అప్రమత్తంగా ఉండాలి : తహసీల్దార్‌

మొంథా తుఫాన కారణం గా రాబోవు నాలుగురోజులు భారీ ఈదురుగాలులతో వర్షాలు కురి సే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దా ర్‌ సురేశబాబు తెలిపారు. ఆయన ఆదివారం స్థానిక తహసీల్దార్‌ కా ర్యాలయంలో వీఆర్‌ఓలతో సమావేశమయ్యారు. తుఫాన ప్రభా వం తీవ్రంగా ఉందని, మట్టిమిద్దెలలో ఎవరూ నివాసం ఉండరా దన్నారు. పరిస్థితి తీవ్రత తగ్గే వరకు ప్రభుత్వ భవనాలలో ఉండాల న్నారు.

MINISTER: అభివృద్ధి పనులపై మంత్రి సమీక్ష

MINISTER: అభివృద్ధి పనులపై మంత్రి సమీక్ష

నియోజకవర్గంలో చేపట్టవల సిన అభివృద్ధి పనులపై రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ శనివారం రాత్రి రెవిన్యూ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహిం చారు. ఈ సమీక్షలో మంత్రి మాట్లాడుతూ...నియోజకవర్గం అభివృద్ధి ప ట్ల మన బాధ్యత అత్యంత కీలకమైందన్నారు. ప్రతివార్డు, గ్రామ ప్రజల కు అభివృద్ధి ఫలాలు చేరేలా అధికారులు ప్రణాళికా బద్ధంగా పనిచేయా లని అదేశించారు.

MINISTER: యువకుల ధైర్యం ఆదర్శనీయం

MINISTER: యువకుల ధైర్యం ఆదర్శనీయం

ఘోర బస్సు ప్రమాద ఘటన లో ధర్మవరం యువకులు చూపిన ధైర్యం ఆదర్శనీయమని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌యాదవ్‌ కొనియాడారు. కర్నూలు వద్ద రెండురోజుల క్రితం జరిగిన బస్సు ప్రమాదంలో పదిమందికి పైగా ప్రాణాలను కాపాడిన ధర్మవరం యువకులను మంత్రి సన్మానించారు.

TRAFFIC: రోడ్డుపైనే పార్కింగ్‌

TRAFFIC: రోడ్డుపైనే పార్కింగ్‌

పట్టణంలోని కూరగాయల మా ర్కెట్‌ వద్ద ఉన్న సబ్‌ రిజిసా్ట్రర్‌ కార్యాలయం ఎదుట రోడ్డుపైనే ద్విచ క్రవాహనాలను పార్కింగ్‌ చేస్తున్నారు. దీంతో రోడ్డు ఇరుకుగా మారింది. ఆ రోడ్డు వెళ్లే వాహనదారులు, పాదాచారులు చాలా ఇబ్బందులు పడు తున్నారు. ప్రతి రోజు రిజిసే్ట్రషనల కోసం ఎంతోమంది సబ్‌రిజిసా్ట్రర్‌ కార్యాలయానికి వస్తుంటారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి