Home » Dharmavaram
ఽనియోజకవర్గంలోని చేనేత కార్మికుల ఎన్నో ఏళ్ల కల నేడు సాకారమైందని బీజేపీ నియోజకవర్గ ఇనచార్జ్ హరీశబాబు తెలిపారు. మెగా హ్యాండ్ లూమ్ క్లస్టర్కు భూమి కేటాయింపు కోసం రాష్ట్ర క్యాబినేట్ ఆమోదం తెలపడంతో సోమవారం స్థానిక కదిరిగేటు వద్ద ఉన్న నేతన్న విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం అక్కడే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవనకల్యాణ్, మంత్రి సత్యకుమార్యాదవ్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు.
మండలం లోని కుణుతూరులో పురాతన చంద్రమౌళీశ్వర స్వామి ఆల యంలో ఆదివారం ధాత్రి నారాయణ పూజ, అభిషేకాలు, హో మాలు, కార్తీక వనభోజనాల ను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమాలను అర్చకులు రాఘవ శర్మ, ఆయన శిష్య బృందం వేద మంత్రాల నడుమ నిర్వహిం చారు. ఈ పూజా కార్యక్రమాలకు గ్రామస్థులతో పాటు ధర్మవరం పట్టణ ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు.
మండలపరిధిలోని అ నంతసాగరం గ్రామంలో నూత నంగా నిర్మించిన ఆలయంలో ఆదివారం రామలింగే శ్వరస్వామి, అ మ్మవారు, వినా యకుడు, కుమారస్వామి విగ్రహాల తో పాటు ధ్వజ స్తంభ ప్రతిష్ఠను ఘంనగా నిర్వహించారు. శుక్రవా రం నుంచి మూడు రోజు ల పాటు హోమాలు వి విధ పూజా కార్యక్రమా లను వేదిపండితులు ని ర్వహించారు.
కొద్దికాలం క్రితం వరకు ఆలయాలే టార్గెట్గా దొంగలు రెచ్చిపోయారు. ఆలయాల వద్ద సీసీ కెమెరాలు అమర్చుకోవడంతో ఇప్పుడు రైతుల పొలాలను టార్గెట్గా చేసు కున్నారు. వేలకు వేలు ఖర్చుచేసుకుని పంటలకు విద్యుతకనెక్షన కోసం రైతులు అమర్చుకున్న ట్రాన్స ఫార్మర్లను ధ్వంసం చేసి వాటిలోని ఆయిల్ ను, కాపర్ వైర్ను ఎత్తుకెళ్తుండడంతో విద్యుతసరఫరా లేక పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళనవ్యక్తం చేస్తున్నారు.
మండలవ్యాప్తంగా ఖరీఫ్లో సాగుచేసిన కంది పంటకు తెగుళ్లు సోకాయి. మండలవ్యా ప్తంగా సుమారు ఏడు వేల హెక్టార్లకు పైగా కంది సాగుచేసినట్లు వ్యవసాయాధికారులు తెలుపుతున్నారు. అయితే ఇటీవల తుఫాన్ల ప్రభావంతో కంది పూత, పిందెపై ప్రభావం చూపుతోంది. పూత రాలిపోవడం, పిందెలను పచ్చపురుగు ఆశించడంతో పంటంతా దెబ్బతింటోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మండలంలోని ముచ్చు రామి గ్రామం నుంచి రేగాటిపల్లికి వెళ్లే రహదారిలో ఓ మలుపు ప్రమాద కరంగా మారింది. ఆ మలుపు వద్ద కంపచెట్లు ఏపుగా పెరగడంతో రోడ్డు కనిపించక తరచూ రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయని ఆయా గ్రామస్థులు పేర్కొంటున్నారు. ఇప్పటికే పలువురు రోడ్డు ప్రమాదాల బారిన పడి గాయాలపాలయ్యారు.
పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో అరకొర సౌకర్యాలతో సరైన వైద్య సేవలు అందక రోగులు ఇబ్బంది పడుతున్నారు. వంద పడకల సామర్థ్యం కలిగిన ఈ ఆస్పత్రిలోని ప్రధాన విభాగాల్లో వైద్య పరికరాలు లేవు. దీంతో మెరుగైన వైద్యం కోసం వేరే ఆస్పత్రులకు రెఫర్ చేయాల్సి వస్తోందని వైద్యులు చెబుతున్నారు. పలువిభాగాల్లో వైద్యుల కొరత కూడా వేధిస్తోంది.
మండల కేంద్రంలోని పాతవూరిలో వెలసిన గ్రామదేవత పెద్దమ్మకు కార్తీక మాసం ఆదివారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారు జామున పూజారులు పెద్దన్న, శివసాయి అమ్మవారిని వివిధ రకాల పుష్పాలు, వేప మండలతో ప్రత్యేకంగా అలంకరించారు.
మున్సిపాలిటీతో పాటు ని యోజకవర్గంలోని పలు గ్రామాలు, కాలనీల్లో సమస్యలను పరిష్కరిం చేలా ప్రణాళికలను సిద్ధం చేయాలని టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్ పరిటాల శ్రీరామ్ అధికారులకు సూచించారు. 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదల నేపథ్యంలో పరిటాలశ్రీరామ్ ఆదివారం ధర్మవరంలోని తన క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్తోను, తాడిమర్రి, బ త్తలపల్లి, ముదిగుబ్బ, ధర్మవరం ఎంపీడీఓల తో వేర్వేరుగా సమావే శాలను నిర్వహించారు.
మండలంలోని గొట్లూరు, చిగిచెర్ల గ్రామాల్లో ని ఆంజనేయస్వామి ఆలయాల్లో శనివారం కార్తీకమాస పూజలు ఘనంగా నిర్వహించారు. మూలవిరాట్లను ఆకుపూజతో అలంకరించి పూజలు చేశారు.