Home » Dharmavaram
పట్టణంలో ఓ ఆటో డ్రైవర్ తన నిజాయతీని చాటుకున్నాడు. ఎస్బీఐ కాలనీకి చెందిన అనసూ యమ్మ పనినిమిత్తం కాలేజ్ సర్కిల్కు వచ్చి తిరిగి ఇంటికి వెళ్లడా నికి ఆటో డ్రైవర్ శేఖర్ ఆటోలో మంగళవారం మధ్యాహ్నం ఎక్కిం ది. అనంతరం ఆమె ఇంటి వద్ద ఆటో దిగి వెళ్లిపోయింది.
మండలకేంద్రంలో ఖాసింస్వామి గంధోత్సవాలు ఘ నంగా ముగిశాయి. ఎని మిది రో జులుగా ఖాసిం స్వామి ట్రస్టు ఆధ్వర్యంలో అంగరంగా వైభవంగా జరి గాయి. చివరి రోజు అయిన మంగళవారం ఖాసింస్వామి పెట్టెను అలంకరించారు. స్వామివారికి కందురి పెట్టి చదివింపులు చేశారు. ఉత్స వాల చివరి రోజు కావడం తో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి మొక్కులు చెల్లించారు.
భద్రావతి భావనా రుషీంద్రుల కల్యాణ మహోత్స వాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. పట్టణం లోని పద్మశాలీయ బహూమత్తమ సంఘం ఆధ్వర్యంలో అర్చకులు ఉదయం 6గంటలకు గోపూజ, మహాగణపతి పూజ, స్వస్తి పుణ్యాహ వాచనం, పంచగవ్య ప్రాశన, బుత్విగ్వరణం, కార్యకర్తలకు కంకణదారణ, కలశస్థాపన, అగ్ని ప్రతిష్ఠ, దీక్షాహోమం, మహాగణపతి హోమం చేశారు.
ఆ గ్రామాలకు వెళ్లే రహదారుల గుండా ప్రజలు భయంభయంగా ప్రయాణిస్తున్నారు. తర చూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నా నివారణకు అధికారులు ఎటువం టి చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. ఆ రహదారు ల మలుపులు, స్పీడుబ్రేకర్లు వద్ద ఎటువంటి సూచిక బోర్డులు రేడియంస్టిక్కరు లేకపోవడంతో ప్రమాదాలకు నిలయంగా మారాయి.
పట్టణంలోని సిద్దయ్యగుట్ట లక్ష్మీనరసింహ స్వామి గుడి వద్ద వెలసిన అవదూత తిక్కనారాయణస్వామి ఆరాధనోత్సవాలను బుధ, గురువారాల్లో నిర్వహిస్తున్నట్టు శ్రీకృష్ణ చైతన్యభక్త భజన మండలి సభ్యు లు తెలిపారు.
స్థానిక మున్సిపాలిటీ పరిధిలో విచ్చలవిడిగా అక్రమ కొళాయి కనెక్షనలు వెలుస్తున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా కొళాయి కనెక్షనలు తీసుకుంటున్నా అ ్డడిగే వారేలేరు. సాధారణంగా మున్సిపాలిటీలో రూ.500లోపల ఇంటి పన్ను చెల్లించేవారు రూ. 1250, ఆ పైన చెల్లించేవారు రూ. 9వేలను ఆనలైన ద్వారా మున్సిపాలిటీకి చెల్లించాలి.
చట్టాలపై విద్యార్థులు అవగా హన పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మహిళా పోలీసు స్టేషన డీఎస్పీ ఇందిర సూచించారు. జాతీయ బాలికా దినోత్సవ సంద ర్భంగా ఎస్పీ సతీశకుమార్ ఆదేశాల మేరకు డీఎస్పీ ఇందిర శనివారం పోలీస్ సిబ్బంది, ధర్మవరం శక్తిటీం-1తో కలిసి పట్టణంలోని పద్మావతి మహిళా డిగ్రీకళాశాలలో శనివారం చట్టాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
మండలకేంద్రంలో శనివారం ఖాసింస్వామి ట్రస్టు ఆధ్వర్యంలో ఆటల పోటీలు నిర్వహించారు. ఉద యం పురుషులకు ఇరుసు ఎత్తే పోటీలు నిర్వహించారు. మొదటి దశ పోటీలలో ప్రతిభ కనబరిచిన తోపుదుర్తికి చెందిన మధుకు ప్రథమ బహుమతి రూ. 10వేలు, అరవకూరు రామంజికి రెండో బహుమతి రూ. 7వేలు, బానుకోటకు చెందిన రాజుకు మూడో బహుమతి రూ. 3 వేలు అందజేశారు.
పట్టణంలోని తేరుబజారులో ఉన్న ఆర్య వైశ్య కొత్తసత్రంలో గోదారంగ నాథస్వామి కల్యాణోత్సవాన్ని శ్రీరామభజన మందిరం ఆధ్వ ర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్రం సుభి క్షంగా సుఖశాంతులతో ఉండా లన్న తలంపు తో ఈ కార్యక్ర మాన్ని నిర్వహించామని నిర్వాహకులు కోటి లక్ష్మీవెంకటేశ్వర్లు, దేవతా కృష్ణమూర్తి పేర్కొన్నారు.
ఉద్యోగభద్రత సర్క్యులర్ 1/19ను అమలు చేసే వరకు పోరాడుతామని ఎనఎంయూ రీజనల్ చైర్మన ముత్యాలప్ప, జోనల్ వైస్ ప్రెసిడెంట్ నాగశేఖర్ తెలిపారు. ఈ మేరకు జోనల్ కమిటీ పిలుపు మేరకు జోనల్ వ్యాప్తంగా ఉన్న సమస్య లపైనా, కడప డీపీటీఓ మొండి వైఖరికి నిరసనగా గత 66 రోజులుగా కడపలో నిరాహార దీక్షలు చేపట్టారన్నారు.