Home » Dharmavaram
కోట్లాది మంది ఆరాధ్యదైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూలో గత వైసీపీ పాలనలో కల్తీ జరి గిందని సిట్ నివేదిక ఇచ్చినా ఆ పార్టీ నాయకులు ఇంకా బుకాయి స్తున్నారని టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్ పరిటాల శ్రీరామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణంలోని శివానగర్లో వెలసిన విజయచౌడేశ్వరి ఆలయ పుష్కర కుంభాభి షేకం, మహా సంప్రోక్షణ మహోత్సవంలో ఆ యన పాల్గొన్నారు.
మండలంలోని సు బ్బరావుపేట సమీపం లో ఉన్న భూమి తమ దని ఓ వర్గం కోర్టును ఆశ్ర యించగా, ఎన్నో ఏళ్లుగా పొజిషనలో ఉ న్నామని మరో వర్గం వారు మొరపెట్టుకున్నారు. గ్రామ సమీపం లోని సర్వేనం. 74-2లో 4.88ఎకరాల భూమి భూమిలో కొన్నేళ్లుగా అదేగ్రామానికి చెందిన వెంకటనారాయణరెడ్డి, వెంకటన రసమ్మ, పెద్దిరాజులు, తలారి గంగాధర్, క్రిష్ణారెడ్డి, భాస్కర్రెడ్డి, గంగులప్ప మరికొంత మంది కళ్లాలు వేసుకుని పొజిషనలో ఉన్నారు.
పట్టణం లోని మార్కండే య స్వా మి ఆలయంలో భద్రావ తి భావనా రుషీంద్రుల కల్యాణోత్సవాన్ని ప ద్మశాలీయ బహూత్తమ సంఘం ఆధ్వర్యంలో బుఽ దవారం ఘనంగా నిర్వ హించారు. టీడీపీ నియో జకవర్గ టీడీపీ ఇనచార్జ్ పరిటాల శ్రీరామ్, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధు సూ దనరెడ్డి, బీజేపీ నియోజకవర్గ ఇనచార్జ్ హరీశబాబు హాజరై స్వామివారి కల్యాణోత్స వాన్ని తిలకించి ప్రత్యేక పూజలు చేయించారు.
పట్టణంలో ఓ ఆటో డ్రైవర్ తన నిజాయతీని చాటుకున్నాడు. ఎస్బీఐ కాలనీకి చెందిన అనసూ యమ్మ పనినిమిత్తం కాలేజ్ సర్కిల్కు వచ్చి తిరిగి ఇంటికి వెళ్లడా నికి ఆటో డ్రైవర్ శేఖర్ ఆటోలో మంగళవారం మధ్యాహ్నం ఎక్కిం ది. అనంతరం ఆమె ఇంటి వద్ద ఆటో దిగి వెళ్లిపోయింది.
మండలకేంద్రంలో ఖాసింస్వామి గంధోత్సవాలు ఘ నంగా ముగిశాయి. ఎని మిది రో జులుగా ఖాసిం స్వామి ట్రస్టు ఆధ్వర్యంలో అంగరంగా వైభవంగా జరి గాయి. చివరి రోజు అయిన మంగళవారం ఖాసింస్వామి పెట్టెను అలంకరించారు. స్వామివారికి కందురి పెట్టి చదివింపులు చేశారు. ఉత్స వాల చివరి రోజు కావడం తో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి మొక్కులు చెల్లించారు.
భద్రావతి భావనా రుషీంద్రుల కల్యాణ మహోత్స వాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. పట్టణం లోని పద్మశాలీయ బహూమత్తమ సంఘం ఆధ్వర్యంలో అర్చకులు ఉదయం 6గంటలకు గోపూజ, మహాగణపతి పూజ, స్వస్తి పుణ్యాహ వాచనం, పంచగవ్య ప్రాశన, బుత్విగ్వరణం, కార్యకర్తలకు కంకణదారణ, కలశస్థాపన, అగ్ని ప్రతిష్ఠ, దీక్షాహోమం, మహాగణపతి హోమం చేశారు.
ఆ గ్రామాలకు వెళ్లే రహదారుల గుండా ప్రజలు భయంభయంగా ప్రయాణిస్తున్నారు. తర చూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నా నివారణకు అధికారులు ఎటువం టి చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. ఆ రహదారు ల మలుపులు, స్పీడుబ్రేకర్లు వద్ద ఎటువంటి సూచిక బోర్డులు రేడియంస్టిక్కరు లేకపోవడంతో ప్రమాదాలకు నిలయంగా మారాయి.
పట్టణంలోని సిద్దయ్యగుట్ట లక్ష్మీనరసింహ స్వామి గుడి వద్ద వెలసిన అవదూత తిక్కనారాయణస్వామి ఆరాధనోత్సవాలను బుధ, గురువారాల్లో నిర్వహిస్తున్నట్టు శ్రీకృష్ణ చైతన్యభక్త భజన మండలి సభ్యు లు తెలిపారు.
స్థానిక మున్సిపాలిటీ పరిధిలో విచ్చలవిడిగా అక్రమ కొళాయి కనెక్షనలు వెలుస్తున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా కొళాయి కనెక్షనలు తీసుకుంటున్నా అ ్డడిగే వారేలేరు. సాధారణంగా మున్సిపాలిటీలో రూ.500లోపల ఇంటి పన్ను చెల్లించేవారు రూ. 1250, ఆ పైన చెల్లించేవారు రూ. 9వేలను ఆనలైన ద్వారా మున్సిపాలిటీకి చెల్లించాలి.
చట్టాలపై విద్యార్థులు అవగా హన పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మహిళా పోలీసు స్టేషన డీఎస్పీ ఇందిర సూచించారు. జాతీయ బాలికా దినోత్సవ సంద ర్భంగా ఎస్పీ సతీశకుమార్ ఆదేశాల మేరకు డీఎస్పీ ఇందిర శనివారం పోలీస్ సిబ్బంది, ధర్మవరం శక్తిటీం-1తో కలిసి పట్టణంలోని పద్మావతి మహిళా డిగ్రీకళాశాలలో శనివారం చట్టాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.