Home » Dharmavaram
భూ రీసర్వే నిర్వహించిన గ్రా మాల్లోని రైతులకు త్వరలో రాజముద్రతో కూడిన పట్టాదారు పాసుపు స్తకాలు ఇస్తామని ఆర్డీఓ మహేశ తెలిపారు. ప్రస్తుతం రీసర్వే చేసిన భూముల వివరాలను వివరిస్తామని, అందులో తప్పులుంటే సం బంధి త రైతులు తెలియజేయాలన్నారు.
పట్టణంలోని కొత్త పేటలో వెలసిన లక్ష్మీవెంకటేశ్వర స్వామి ఆలయంలో మూడు రోజు ల పాటు సాగిన వార్షిక బ్రహ్మోత్స వాలు సోమవారం ఘనంగా ము గిశాయి. చివరిరోజు స్వామివారి మూలవిరాట్కు ప్రత్యేక పూజలు చేశారు.
మండలకేంద్రంలో నిర్మించిన పంచాయతీ దుకాణ సముదాయంలోని గదులకు వేలంపాట నిర్వ హించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీంతో వేలం ఎప్పుడు నిర్వహిస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. ముదిగుబ్బ పంచా యతీ కార్యాలయం వద్ద ఐదు దుకాణ గదులను నిర్మించారు.
మండలంలోని ఏలుకుంట్ల గ్రామానికి చెందిన రైతు గుట్టూరు నారాయణస్వామి సాగుచేసిన అరటిచెట్లు అగ్నికి అహుతయ్యాయి. తనకున్న మూడు ఎకరాల్లో సుమారు 3000 అరటిచెట్లు సాగుచేశానని బాధిత రైతు ఆదివారం తెలిపాడు.
మండలంలోని పోతు కుంట చెరువు లీకేజీ అయి నీరంతా వృథాగా వెళుతోంది. ఇటీవల హాంద్రీనీవా నీటితో చెరువు నిండి మరువ పారింది. అయితే ప్రస్తుతం మరువ నిలిచిపోయింది. అయితే చెరువు మరువ పారే కట్ట దెబ్బ తినడంతో రాళ్ల సందుల్లో నుంచి నీరు లీకేజీ అవుతోంది.
వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రజలకు కల్తీమద్యం తాపించి ఎంతో మంది అమాయకుల మరణాలకు కారణమైన వైసీపీ నేతలు, తమ అక్రమార్జన కోసం భగవంతుడి సన్నిధి లో సైతం పాపం చేశారని టీడీపీ పట్టణ అధ్యక్షుడు పరిశే సుధాకర్, నాయకులు రాళ్లపల్లి షరీఫ్ అన్నారు.
ప్రజలకు రెవెన్యూ సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ శ్యాంప్రసాద్ హెచ్చరించారు. ఆయన గురువారం స్థానిక తహ సీల్దార్ కార్యాలయన్ని తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. ప్రజల నుంచి వచ్చిన దరకాస్తులు, రెవెన్యూ రికార్డుల నిర్వహణ, భూ సమస్యల పరిష్కారంపై తహసీల్దార్ స్వర్ణలతను అడిగి తెలుసుకు న్నా రు.
కోట్లాది మంది ఆరాధ్యదైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూలో గత వైసీపీ పాలనలో కల్తీ జరి గిందని సిట్ నివేదిక ఇచ్చినా ఆ పార్టీ నాయకులు ఇంకా బుకాయి స్తున్నారని టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్ పరిటాల శ్రీరామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణంలోని శివానగర్లో వెలసిన విజయచౌడేశ్వరి ఆలయ పుష్కర కుంభాభి షేకం, మహా సంప్రోక్షణ మహోత్సవంలో ఆ యన పాల్గొన్నారు.
మండలంలోని సు బ్బరావుపేట సమీపం లో ఉన్న భూమి తమ దని ఓ వర్గం కోర్టును ఆశ్ర యించగా, ఎన్నో ఏళ్లుగా పొజిషనలో ఉ న్నామని మరో వర్గం వారు మొరపెట్టుకున్నారు. గ్రామ సమీపం లోని సర్వేనం. 74-2లో 4.88ఎకరాల భూమి భూమిలో కొన్నేళ్లుగా అదేగ్రామానికి చెందిన వెంకటనారాయణరెడ్డి, వెంకటన రసమ్మ, పెద్దిరాజులు, తలారి గంగాధర్, క్రిష్ణారెడ్డి, భాస్కర్రెడ్డి, గంగులప్ప మరికొంత మంది కళ్లాలు వేసుకుని పొజిషనలో ఉన్నారు.
పట్టణం లోని మార్కండే య స్వా మి ఆలయంలో భద్రావ తి భావనా రుషీంద్రుల కల్యాణోత్సవాన్ని ప ద్మశాలీయ బహూత్తమ సంఘం ఆధ్వర్యంలో బుఽ దవారం ఘనంగా నిర్వ హించారు. టీడీపీ నియో జకవర్గ టీడీపీ ఇనచార్జ్ పరిటాల శ్రీరామ్, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధు సూ దనరెడ్డి, బీజేపీ నియోజకవర్గ ఇనచార్జ్ హరీశబాబు హాజరై స్వామివారి కల్యాణోత్స వాన్ని తిలకించి ప్రత్యేక పూజలు చేయించారు.