Home » Dharmavaram
కాకిముట్టని క్షేత్రంగా మండలంలోని చిల్లవారిపల్లి సమీపంలోని కాటకోటేశ్వరం, కోరిన కోర్కెలు తీర్చే దేవు డిగా అక్కడ వెలసిన కాటకోటేశ్వరు డు ప్రసిద్ధి. ప్రతి ఆది, సోమవారాలు స్వా మికి ప్రత్యేక పూజా కార్య క్రమాలు నిర్వ హిస్తారు.
పీఏబీఆర్ కుడికాలువ కింద ఉన్న చెరువులకు నీరందించేం దుకు ప్రభుత్వం ప్రణాళిక బద్ధంగా వ్యవహరిస్తోందని నీటి పారుదల శాఖ డీఈ ఈ చంద్రశేఖర్, ఏఈఈ ఓ బుళపతి అన్నారు. నీరు స జావుగా ప్రవహించేందుకు రైతులు సహకరించాలని కోరారు.
విజయవాడలో గురువారం జరిగే ‘మన నీరు- మన భవిష్యతు’్త కార్యక్రమానికి మండ లంలోని అన్ని గ్రామాల చెరువు సాగునీటి సంఘం అధ్యక్షులు తరలి వెళ్లి, విజయవంతం చేయాలని టీడీపీ క్లస్టర్ ఇనచార్జ్ మహేష్చౌదరి పిలుపునిచ్చారు. ఆయన మంగళవారం పట్టణంలోని గాంధీనగర్లో ఉన్న టీడీపీ కార్యాలయంలో సాగునీటి సంఘం అధ్యక్షులతో సమావే శమయ్యారు.
భూ రీసర్వే నిర్వహించిన గ్రా మాల్లోని రైతులకు త్వరలో రాజముద్రతో కూడిన పట్టాదారు పాసుపు స్తకాలు ఇస్తామని ఆర్డీఓ మహేశ తెలిపారు. ప్రస్తుతం రీసర్వే చేసిన భూముల వివరాలను వివరిస్తామని, అందులో తప్పులుంటే సం బంధి త రైతులు తెలియజేయాలన్నారు.
పట్టణంలోని కొత్త పేటలో వెలసిన లక్ష్మీవెంకటేశ్వర స్వామి ఆలయంలో మూడు రోజు ల పాటు సాగిన వార్షిక బ్రహ్మోత్స వాలు సోమవారం ఘనంగా ము గిశాయి. చివరిరోజు స్వామివారి మూలవిరాట్కు ప్రత్యేక పూజలు చేశారు.
మండలకేంద్రంలో నిర్మించిన పంచాయతీ దుకాణ సముదాయంలోని గదులకు వేలంపాట నిర్వ హించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీంతో వేలం ఎప్పుడు నిర్వహిస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. ముదిగుబ్బ పంచా యతీ కార్యాలయం వద్ద ఐదు దుకాణ గదులను నిర్మించారు.
మండలంలోని ఏలుకుంట్ల గ్రామానికి చెందిన రైతు గుట్టూరు నారాయణస్వామి సాగుచేసిన అరటిచెట్లు అగ్నికి అహుతయ్యాయి. తనకున్న మూడు ఎకరాల్లో సుమారు 3000 అరటిచెట్లు సాగుచేశానని బాధిత రైతు ఆదివారం తెలిపాడు.
మండలంలోని పోతు కుంట చెరువు లీకేజీ అయి నీరంతా వృథాగా వెళుతోంది. ఇటీవల హాంద్రీనీవా నీటితో చెరువు నిండి మరువ పారింది. అయితే ప్రస్తుతం మరువ నిలిచిపోయింది. అయితే చెరువు మరువ పారే కట్ట దెబ్బ తినడంతో రాళ్ల సందుల్లో నుంచి నీరు లీకేజీ అవుతోంది.
వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రజలకు కల్తీమద్యం తాపించి ఎంతో మంది అమాయకుల మరణాలకు కారణమైన వైసీపీ నేతలు, తమ అక్రమార్జన కోసం భగవంతుడి సన్నిధి లో సైతం పాపం చేశారని టీడీపీ పట్టణ అధ్యక్షుడు పరిశే సుధాకర్, నాయకులు రాళ్లపల్లి షరీఫ్ అన్నారు.
ప్రజలకు రెవెన్యూ సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ శ్యాంప్రసాద్ హెచ్చరించారు. ఆయన గురువారం స్థానిక తహ సీల్దార్ కార్యాలయన్ని తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. ప్రజల నుంచి వచ్చిన దరకాస్తులు, రెవెన్యూ రికార్డుల నిర్వహణ, భూ సమస్యల పరిష్కారంపై తహసీల్దార్ స్వర్ణలతను అడిగి తెలుసుకు న్నా రు.