Home » Dharmavaram
పట్టణంలోని పార్థసారథి నగర్-2లోని 25 వార్డు సచివాలయంలో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవ హరిస్తున్నట్లు విమర్శలు వినవస్తున్నాయి. సిబ్బంది వార్డు సచివాలయం లో ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు అం దుబాటులో ఉంటూ ప్రజల సమస్యలు పరిష్కరించాల్సి ఉంది.
ఇప్పటికే అయ్యప్ప మాల ధారణ అన్నిచోట్ల ప్రారంభమైంది. అయ్యప్ప మాలధారులు దీక్షలో ఉన్న రోజుల్లో నిత్యాన్నదానం అందించి ఆదర్శంగా నిలుస్తోంది ముదిగుబ్బ శ్రీపంచగిరీశ అయ్యప్పస్వామి ఆలయ కమిటీ. గత 20 ఏళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిరాటంకంగా కొనసాగిస్తూ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తోం ది.
సత్యసాయిబాబా సేవలు మరువలేనివని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని యాదవవీధిలో సత్యసాయిబాబా శతజయంతి సందర్బంగా జనసేన పార్టీ నాయకుడు రాజు ఆధ్వర్యంలో చీరల పంపిణీ, రక్తదాన శిబిరాన్ని సోమవారం ఏర్పాటుచేశారు. ఈ కార్యక్ర మాలకు ముఖ్యఅతిఽథులుగా జనసేనపార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి చిలకం మధుసూదనరెడ్డి, చేనేతప్రముఖులు, టీడీపీ నాయకులు సంధా రాఘవ హాజరయ్యారు.
మండల పరిధిలోని చిల్లకొండయ్యపల్లి వద్ద ఆర్టీసీ బస్సు, బొలేరో వాహనం ఆదివా రం ఢీకొన్నాయి. అయితే ఎవరికీ ఎటువంటి అపాయం కలుగ లేదు. అనంతపురం నుంచి కడపకు వెళ్తున్న పులివెందుల డిపో కు చెందిన ఆర్టీసీ బస్సు, పార్నపల్లి నుంచి బత్తలపల్లి వైపు వె ళ్తున్న బొలేరోవాహనం చిల్లకొండయ్యపల్లి సమీపంలోని పులి వెందుల బ్రాంచ కెనాల్ వద్ద ఢీకొన్నాయి.
స్థానిక డివిజన పరిధిలోని అన్ని ల్యాబ్లలో నిర్ణయించిన ధరలు మాత్రమే తీసుకోవాలని మెడికల్ ల్యాబ్ టెక్నీషియన అసోసియేషన ప్రెసిడెంట్ అంజనరెడ్డి, వైస్ ప్రసిడెంట్ అశోక్నాయక్ తెలిపారు. ఈ మేరకు శనివారం ఽ పట్టణంలోని ఆ అసోసి యేషన కార్యాలయంలో జనరల్ సెక్రటరీ కాడిశెట్టి రామ్మోహన చేతుల మీదుగా ధరల పట్టికను విడుదల చేశారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లే బర్ కోడ్లను ఉపసంహరించుకోవాలని సీ ఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబులు డి మాండ్చేశారు. లేకపోతే పెద్దఎత్తున ఉద్య మాలు చేపడుతామని హెచ్చరించారు. కేం ద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్ల నోటిఫికేషనకు వ్యతిరేకంగా సీఐటీ యూ ఆధ్వర్యంలో శనివారం స్థానిక కళా జ్యోతిసర్కిల్లో అంబేడ్కర్ విగ్రహం ఎదు ట నిరసన చేపట్టారు.
మండలంలోని రేగాటిపల్లి చెరువు హంద్రీనీవా జలాలతో నిండింది. దీంతో శనివారం జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదనరెడ్డి, చా యాదేవి దంపతులు చెరువులో గంగపూజ చేశారు. చెరువు నీటిలోకి చీర, సారే ప సుపు, కుంకుమ వదిలి ప్రత్యేక పూజలు చే శారు.
మండలంలో అనుమతిలేని లేఅవుట్లపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎంపీడీఓ పొలప్ప హె చ్చరించారు. శుక్రవారం రాత్రికి రాత్రే అక్రమ లేఅవుట్లు అన్న కథ నం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైంది.
విద్యార్థుల సమస్యల కోసం రాజీలేని పోరాటాలు నిర్వహించే ఏకైక సంఘం ఎస్ఎ్ఫఐ అని టూటౌన సీఐ రెడ్డప్ప, సంఘం జిల్లాకార్యదర్శి నాగార్జున అన్నారు. శుక్రవారం స్థానిక టూ టౌన పోలీ్సస్టేషనలో ఎస్ఎ్పఐ 25వ రాష్ట్ర మహాసభలకు సంబంధించిన పోస్టర్లను సీఐ చేతులమీదుగా ఆవిష్కరించారు.
మం డలపరిధిలోని గంటా పురానికి చెందిన శ్రీని వాసులు మంగళవారం అయోధ్యకు సైకిల్ యాత్ర ప్రారంభిం చారు. మండలంలోని గంటాపురం గ్రామంలో దాతల సహకారంతో రామాలయం నిర్మా ణం చేపట్టారు. పనులు ప్రారంభించి ఎనిమిదేళ్లు అయినా నిర్మాణం పూర్తి కాలేదు.