Home » Dharmavaram
మండలంలోని ధర్మవరం- అనంతపురం రహదారిలో చిగిచెర్ల సమీపంలోని మలుపు ప్రమాదకరంగా మారింది. చిగిచెర్ల విద్యుత సబ్స్టేషన ముందుభాగంలో రోడ్డు మలుపువద్ద కంపచెట్లు ఏపుగా పెరగడంతో రోడ్డు కని పించక తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి.
వాల్మీకులను ఎస్టీ జాబి తాలోకి చేర్చాలంటూ మొదలైన పోరాటానికి మొదట మద్దతు పలికింది పరిటాల కుటుంబమే అని టీడీపీ నియోజకవర్గ ఇన చా ర్జ్ పరిటాలశ్రీరామ్ అన్నారు. పట్టణంలోని ఎర్రగుంట సర్కిల్లో వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్ఠ కోసం మండపం ని ర్మాణానికి ఆ యన మంగళవారం భూమిపూజ చేశారు.
పట్టణంలోని లక్ష్మీచెన్నకేశ వస్వామి ఆలయంలో గరు డ పౌర్ణమి సేవా కార్యక్రమా న్ని వైభవంగా నిర్వహించా రు. మంగళవారం పౌర్ణమిని పురస్కరించుకుని గరుడ వా హనంపై స్వామివారిని ఆశీ నులు చేసి పురవీధుల్లో ఊ రేగించారు.
దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటుచేసిన దుర్గ మ్మ విగ్రహాన్ని శనివారం సంఘమేశ్వరం చెరువులో నిమజ్జనం చేశారు. పట్టణంలోని స్వయంభూ కాలబైరవస్వామి ఆలయంలో దసరా ఉత్సవా లను ఘనంగా నిర్వహించారు.
దసరా శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా స్థానిక వాసవీ కన్యకపరమేశ్వరి ఆలయం లో అమ్మవారి మూల వి రాట్కు శనివారం అర్చ కులు పుష్పాభిషేకాన్ని ఘ నంగా నిర్వహించారు. అ మ్మవారి మూల విరాట్ ను ఉదయం ప్రత్యేకంగా అలంకరించి, అనంతరం పుష్పాభిషేకాన్ని శాస్ర్తోక్తం గా నిర్వహించారు.
ఎన్డీఏ ప్రభుత్వం అర్హత ఉన్న ప్రతిఒక్కరికి ఎన్టీఆర్ భరోసా పింఛన్లను అందజేస్తోందని టీడీపీ నియోజకవర్గ పరిశీలకులు నాగేంద్రకుమార్, ఏపీ సీడ్స్ కార్పొరేషన డైరెక్టర్ కమతం కాటమయ్య పేర్కొన్నారు. ధర్మవరం పట్టణంలోని ఇందిరానగర్, పీఆర్టీ వీధులలో బుఽధవారం పిం ఛన్ల, స్మార్ట్ రేషనకార్డుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించా రు.
దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బుధవారం మామిళ్ల కుంట కూడలిలోని లలితాంబ మహిషాసురమర్దినిగా దర్శనమిచ్చా రు. ఎనుమలపల్లి దుర్గామాత, ప్రశాంతినిలయంలో గాయత్రిమాత, జిల్లా కేంద్రంలోని సత్యమ్మ, వాసవీమాత, కోవెలగుట్టుపల్లి దుర్గాదేవి మహిషాసురమర్దినిగా దర్శమిచ్చారు.
పట్టణంలోని లోనికోట రామలింగ చౌడేశ్వరీదేవి ఉత్సవ విగ్రహాన్ని దుర్గాష్టమి సందర్భంగా మంగళవారం పట్టణంలో భక్తిశ్రద్ధలతో ఘనంగా ఊరేగించారు. ముందుగా ఆలయంలో కలశ పూజ చేశారు. ఉదయం 8గంటలకు ఆలయం నుంచి 108 కలశాలతో ఉత్సవ విగ్రహాన్ని దేవాంగం పేట వరకు ఊరేగించి తిరిగి ఆలయానికి చేర్చారు.
మండల పరిధిలోని ధర్మపురి గ్రామం నుంచి చిన్నూరుబ త్తలపల్లికి వెళ్లాలంటే ఆ గ్రామప్రజలు వాగుదాటాల్సిందే. ఆ రెండు గ్రామాలకు మధ్యలో వాగు ఉంది. సమీప చెరువు చెలిమి నీటితో ఆ వాగు నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. అంతేగాకుండా వర్షాలు కురిస్తే ఆ వాగులో భారీగా నీరు చేరి ఆ రెండు గ్రామాలకు రాకపోక లు నిలిచిపోతాయి.
మున్సిపల్ కార్మికుల ఆరోగ్య రక్షణే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకు మార్యాదవ్ పేర్కొన్నారు. స్థానిక సంస్కృతి సేవా సమితి ఆధ్వర్యంలో వైదేహి సూపర్స్పెషాలిటీ ఆస్పత్రి సహకారంతో మున్సి పల్ కార్మికుల కోసం మంగళవారం ఏర్పాటు చేసిన ప్రత్యేక ఉచిత వైద్యశిబిరాన్ని మంత్రి సత్యకుమార్యాదవ్ ప్రారంభించారు.