GOD: భక్తిశ్రద్ధలతో చౌడేశ్వరి ఊరేగింపు
ABN , Publish Date - Oct 01 , 2025 | 12:08 AM
పట్టణంలోని లోనికోట రామలింగ చౌడేశ్వరీదేవి ఉత్సవ విగ్రహాన్ని దుర్గాష్టమి సందర్భంగా మంగళవారం పట్టణంలో భక్తిశ్రద్ధలతో ఘనంగా ఊరేగించారు. ముందుగా ఆలయంలో కలశ పూజ చేశారు. ఉదయం 8గంటలకు ఆలయం నుంచి 108 కలశాలతో ఉత్సవ విగ్రహాన్ని దేవాంగం పేట వరకు ఊరేగించి తిరిగి ఆలయానికి చేర్చారు.
ధర్మవరం, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని లోనికోట రామలింగ చౌడేశ్వరీదేవి ఉత్సవ విగ్రహాన్ని దుర్గాష్టమి సందర్భంగా మంగళవారం పట్టణంలో భక్తిశ్రద్ధలతో ఘనంగా ఊరేగించారు. ముందుగా ఆలయంలో కలశ పూజ చేశారు. ఉదయం 8గంటలకు ఆలయం నుంచి 108 కలశాలతో ఉత్సవ విగ్రహాన్ని దేవాంగం పేట వరకు ఊరేగించి తిరిగి ఆలయానికి చేర్చారు. ఆలయంలో మధ్యాహ్నం 12-30 గంటలకు అన్నప్రసాద వినియోగం చేపట్టా రు. దేవాంగ సంక్షేమ సంఘం నాయకులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....