Home » Dharmavaram
మండల కేంద్రం లోని పాత వూరిలో వెలసిన గ్రామదేవ త పెద్దమ్మ కోర్కెలు తీర్చె కొంగు బంగా రమని భక్తుల నమ్మకం. శివరాత్రి సం దర్భంగా మూడురోజులు జాతర నిర్వ హిస్తారు. ఈ జాతరకు ముదిగుబ్బ మండలం నుంచి కాకుండా కడప, అనంతపురం జిల్లాలు, తెలంగాణ, కర్ణా టక ప్రాంతాల నుంచి భక్తులు తరలివ స్తారు.
నేరాల విషయంలో, ట్రాఫిక్పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సతీశకుమార్ పేర్కొ న్నారు. ఆయన మంగళవారం ఎస్పీ సతీశకుమార్ ధర్మవరం వనటౌన, బత్తలపల్లి పోలీసు స్టేషనలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సంద ర్భంగా రికార్డులను పరిశీలించారు.
మండల పరిధిలోని చిల్లవారిపల్లి సమీపంలో వెలసిన కాట కోటేశ్వర క్షేత్రంలో మహాశివరాత్రి పర్వదినం సంద ర్భంగా జరగనున్న ఉత్సవాలకు ఏర్పాట్ల పనులు ఊ పందుకున్నాయి. మాఘమాసం కావడంతో ప్రతిరోజు స్వామివారికి ప్రత్యేక పూజలు, అలంకరణ చేస్తున్నా రు.
లేబర్ కోడ్లను తిప్పికొడదాం ... దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేద్దామని సీఐటీయూ జిల్లా ఉపా ధ్యక్షుడు అయూబ్ఖాన, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల పల్లి పెద్దన్న పిలుపు నిచ్చారు. దేశవ్యాప్త సమ్మెకు సంబంధించి ప్రచార కార్యక్రమంలో భాగంగా సోమవారం స్థానిక సీఐటీయూ కార్యాల యం నుంచి కళాజ్యోతి, కాలేజ్సర్కిల్, ఆర్డీసీ బస్టాండ్, సాయిబాబా గుడి వరకు ర్యాలీ నిర్వహించారు.
మండల పరిధి లోని అప్రాచెరువు గ్రామంలో వెలసిన వీరనారాయణస్వామికి గ్రామస్థుల ఆధ్వర్యంలో సోమ వారం ఘనంగా ప్రత్యేక పూజలు చేశారు. గ్రామంలో మూడు రో జుల పాటు వీరనారాయణ స్వా మికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు గ్రామపెద్దలు తెలిపారు. అందులో భాగంగా ఆ దివారం ఎలవ గంపను ఊరేగిం చారు
మండలంలోని రావుల చెరువు పంచాయతీలోని నాగిరెడ్డికుంట కొట్టాల గ్రామ సమీపాన ఉన్న కుంట నిండి మరువపారుతోంది. ధర్మవరం చెరువు నుంచి నీరు రావడం తో కుంట నిండింది. ఈ కుంట కింద సుమారు 50 వరకు వ్యవసాయ బోరుబావులు ఉన్నాయి.
మాఘ మాసం ఆదివారం పురస్క రించుకుని మండలంలోని పలు గ్రామాల్లో పాల పొంగుల వెల్లువను భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వ హించారు. తెల్లవారుజా మునే మాఘస్నానాలు ఆ చరించి కొత్తకుండలో పాలుపోసి పొంగులు ని ర్వహిం చారు.
స్థానిక కస్తూర్బా కాలనీలో కనీస వసతులు కరువయ్యాయి. దీంతో చాలా ఇబ్బందులు పడుతున్నట్లు ఆ కాలనీ ప్రజలు వాపోతున్నారు. మండల కేంద్రానికి రెండు కిలోమీటర్ల దూరంలో అనంతపురం రోడ్డులో కస్తూర్బా కాలనీ ఉంది. స్థానిక కస్తూ ర్బా పాఠశాల సమీపంలో గత టీడీపీ హయాంలో ఈ కాలనీ ఏర్పడింది. అప్పట్లో ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో 2017 నుంచి ఇళ్ల నిర్మాణం జ రుగుతూనే ఉంది.
జాతీయ స్థాయి పథకాలు సాధించిన క్రీడాకారులను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ శుక్రవారం రాత్రి పట్టణంలోని ఎన్డీఏ కార్యాలయంలో అభినందించారు.
ధర్మవరం పట్టణంలోని పలు ఆర్ఎంపీ క్లినిక్లలో శనివారం సాయం త్రం అధికారుల బృందం అకస్మిక తనిఖీలు చేపట్టింది. ఆర్డీఓ మహేశ, డీఎస్పీ హేమంతకుమార్, తహసీల్దార్ సురేశబాబు, డాక్టర్ సురేశ, ఎస్ఐ ఉమాదేవి, వీఆర్ఓ రవిశేఖర్రెడ్డి పలు క్లినిక్లలో తనిఖీలు చేపట్టి, అక్క డ రోగులకు అందుతున్న చికిత్సల గురించిపరిశీలించారు.