Share News

TDP: ‘మన నీరు - మన భవిష్యత్తు’కు తరలివెళ్దాం

ABN , Publish Date - Feb 04 , 2026 | 12:18 AM

విజయవాడలో గురువారం జరిగే ‘మన నీరు- మన భవిష్యతు’్త కార్యక్రమానికి మండ లంలోని అన్ని గ్రామాల చెరువు సాగునీటి సంఘం అధ్యక్షులు తరలి వెళ్లి, విజయవంతం చేయాలని టీడీపీ క్లస్టర్‌ ఇనచార్జ్‌ మహేష్‌చౌదరి పిలుపునిచ్చారు. ఆయన మంగళవారం పట్టణంలోని గాంధీనగర్‌లో ఉన్న టీడీపీ కార్యాలయంలో సాగునీటి సంఘం అధ్యక్షులతో సమావే శమయ్యారు.

TDP: ‘మన నీరు - మన భవిష్యత్తు’కు తరలివెళ్దాం
TDP leaders in meeting with presidents of irrigation association

- సాగునీటి సంఘం అధ్యక్షులతో టీడీపీ నాయకులు

ధర్మవరంరూరల్‌, ఫిబ్రవరి 3(ఆంధ్రజ్యోతి): విజయవాడలో గురువారం జరిగే ‘మన నీరు- మన భవిష్యతు’్త కార్యక్రమానికి మండ లంలోని అన్ని గ్రామాల చెరువు సాగునీటి సంఘం అధ్యక్షులు తరలి వెళ్లి, విజయవంతం చేయాలని టీడీపీ క్లస్టర్‌ ఇనచార్జ్‌ మహేష్‌చౌదరి పిలుపునిచ్చారు. ఆయన మంగళవారం పట్టణంలోని గాంధీనగర్‌లో ఉన్న టీడీపీ కార్యాలయంలో సాగునీటి సంఘం అధ్యక్షులతో సమావే శమయ్యారు. సీఎం చంద్రబాబు సాగునీటి సంఘాల అధ్యక్షులతో ‘మన నీరు - మన భవిష్యత్తు’ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిర్వహిస్తు న్నారని, ఈ కార్యక్రమంలో నీటి అవసరాల అవశ్యకతను వివరిస్తారని తెలిపారు. కావున మనమందరం ఈ కార్యక్రమంలో పాల్గొనాలని తెలి పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్‌ పోతుకుంట లక్ష్మన్న, నాయకులు విజయసారథి, అమరేంద్ర, తదితరులు పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Feb 04 , 2026 | 12:18 AM