Home » Dharmavaram
మండల పరిధిలోని మోటుమర్ల గ్రామం వద్ద ఉన్న వంతెనపై రక్షణ గోడలు లేకపోవడంతో వాహనదారు లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ధర్మవరం నుంచి పుట్టపర్తి, గోరంట్ల, బెంగళూరు ప్రాంతాలకు పగలు, రాత్రి సమయాల్లో వందలాది వాహనాలు వెళ్తుంటాయి. అయితే వంతెనపై రక్షణ దిమ్మెలు లేకపోవడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని వాహనదారులు తీవ్ర భయాందోళన కు గురవుతుంటారు.
హైకోర్టు బెంచను కర్నూల్లో ఏ ర్పాటుచేయాలని బార్ అసోసియేషన ఆధ్వర్యంలో న్యాయవాదులు బుధ వారం స్థానిక కోర్టు ఆవరణంలో నిరసన చేపట్టారు. బార్ అసోసియేషన ఆధ్వర్యంలో బుధవారం నుంచి మూడు రోజుల పాటు విదులను బహిష్క రిస్తున్నట్లు ప్రకటించారు.
మండలంలోని చిగి చెర్ల గ్రామంలో ప్రసి ద్ధి గావించిన మారె మ్మ, ముత్యా లమ్మ దేవతల ఆల యంలో మంగళ వారం ప్రత్యేక పూజ లు చేశారు. మూల విరాట్లకు ఆలయ పూజారి ఆకుపూజ చేశారు. వేపమండలు, నిమ్మకాయలు, వివిధ రకాల పూలమాలలతో అలంకరించి పూజలు చేశారు. అమ్మవార్లకు గ్రామస్థులు బోనాలు సమర్పించారు.
నియోజకవర్గంలో ట్రాక్టర్ కార్మికు లు అనేక ఇబ్బందులు పడుతున్నారని వారి సమస్యలను వెంటనే పరిష్క రించాలని సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి మసుగుమధు డిమాండ్చేశారు. ఈ మేరకు సోమవారం స్థానిక గాందీనగర్ సర్కిల్ నుంచి సీపీఐ ఆధ్వ ర్యంలో ట్రాక్టర్ కార్మికులు ర్యాలీగా ఆర్డీఓ కార్యాలయం వద్దకు చేరుకుని నిరసన చేపట్టారు.
పట్టణ సమీపంలోని పుట్టపర్తికి వెళ్లే రహదారిలో తుంపర్తికాలనీ వద్ద రోడ్డుపై పడిన గుంతలతో వాహన దారులు సర్కస్ ఫీట్లు చేయాల్సి వస్తోందని పలువురు పేర్కొంటున్నారు. మోటుమర్ల వద్ద నుంచి తుంపర్తి కాలనీ వరకు ఈ రోడ్డు గుంతలుపడి అధ్వానంగా తయారైంది.
మండలంలోని చిగిచెర్ల గ్రామానికి చెందిన రైతు తాడిమర్రి చెన్నారెడ్డి సాగుచేసిన అరటిచెట్లు గాలివానకు నేలకొరిగి రైతుకు తీవ్రనష్టం వాటిల్లింది. రైతు చెన్నారెడ్డి మాట్లాడుతూ... తన మూడెకరాల్లో సుమారు 3వేలకు పైగా అరటిచెట్లు సాగుచేశానన్నారు. పది నెలలుగా కంటిరెప్పలా రేయింబవళ్లు శ్రమించి తెగుళ్లు రాకుండా చెట్లను కాపాడానన్నారు.
మండల కేంద్రలోని జిల్లా పరిషత ఉన్నత పాఠశాల ఆవరణంలో పలు భవనాలు శిథిలావస్దకు చేరి ప్రమాదకరంగా ఉన్నాయి. వాటిని తొలగించేది ఎప్పుడని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. పాఠశాల ఆవరణంలో గతంలో నిర్మించిన పురాతన భవనాలు చాలా ఏళ్లు గడవడంతో పైకప్పు పెచ్చులూడి, గోడలు నెర్రలు చీలి కూలడానికి సిద్ధంగా ఉన్నాయి.
తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని వార్డు సచివాలయ ఉద్యోగులు మున్సి పల్ కార్యాలయ మేనేజర్ రాజేశ్వరికి విన్నవించారు. వారు శుక్రవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఆమెను కలిసి వినతిపత్రం అందజేశా రు.
గడ్డిమందు పిచికారి చేయడంతో మండలంలోని చిగిచెర్ల గ్రామానికి చెందిన రైతు సాయినాథ్ రెడ్డి మూడెకరాల్లో సాగుచేసిన వేరుశనగ పంట ఎండిపోయింది. దీనిపై బుధవారం ఆంధ్రజ్యోతిలో ‘ముంచిన గడ్డిమందు’ అనే శీర్షికతో కథనం ప్రచురితమైన విషయం విదితమే. దీనిపై స్పందించిన మండల వ్యవసా యాధికారి ముస్తఫా సిబ్బందితో కలిసి రైతుపొలాన్ని పరిశీలించారు.
వర్షపు నీటిని సద్వినియోగం చేసు కోవాలనే లక్ష్యంతో నిర్మిం చిన చెక్ డ్యాంలు ప్రస్తు తం నిరుపయోగంగా మా రాయి. వాటర్ షెడ్ ప థకం కింద ఉమ్మడి అనం తపురం జిల్లాలో ప్రధా న వాగులపై మొత్తం 3,326 చెక్ డ్యాములను, వంకల్లో 1600 చెక్ వాల్స్ నిర్మించారు. కొన్ని ఇరిగేషన శాఖ ఆధ్వర్యంలో నిర్మించగా, మరికొన్నింటిని ఆర్డీటీ నిధులతో కట్టించారు.