Home » Dharmavaram
పట్టణ సమీపంలోని పోతుల నాగేపల్లి, కుణుతూరు, రేగాటిపల్లి కాలనీలను మున్సిపాలిటీలోకి చేర్చాలం టూ కౌన్సిలర్లు మూకమ్మడిగా అధికారులను డిమాండ్చేశారు. సమావేశం ప్రారంభకానికి ముందే సమావేశపు హాల్లో ఉన్న కమిషనర్, అధికారుల ను చైర్పర్సన కాచర్ల లక్ష్మి, కౌన్సిలర్లు చైర్పర్సన చాంబర్లోకి పిలిపించు కున్నారు. పోతుల నాగేపల్లి, కుణుతూరు, రేగాటిపల్లి కాలనీలను మున్సి పాలిటీలోకి చేర్చేలా అజెండాలో ఎందుకు పొందుపరచలేదని ఇనచార్జ్ కమిషనర్ సాయికృష్ణను డిమాండ్చేశారు.
మండలంలోని ఆర్అండ్బీ రోడ్లు గుంతల మ యంగా మారాయి. వర్షాకాలం కా వడంతో ఎటుచూసినా గుంతల్లో నీరు నిలబడి వాహనాల రాకపో కలకు తీవ్ర ఇబ్బందిగా మారింది. రాళ్లఅనంతపురం క్రాస్ నుంచి హుస్సేనపురం, కొడవం డ్లపల్లి వరకు రోడ్డు అధ్వానంగా మారింది. ఈ మార్గంలో అధికంగా ఇసుక టిప్పర్లు వెళ్లడంతో తారురోడ్డు ధ్వసమైంది. గతంలో రోడ్డుకు అక్కడక్కడ మరమ్మతులు చేపట్టినా మళ్లీ గుంతలు ఏర్పడ్డాయి.
పట్టణంలోని స్వయంభూ కాలభైరవ స్వా మి ఆలయంలో కార్తీక మాసం మొదటి సోమవారం పూజలు ఘనంగా జరిగాయి. పూజారి ధనుంజయ ఆచారి భక్తులచే స్వామివారికి అభిషేకాలు చే యించారు. నారికేళ దీపోత్స వాన్ని నిర్వహించారు. అన్న ప్రసాద సేవ చేపట్టారు.
మొంథా తుఫాన కారణం గా రాబోవు నాలుగురోజులు భారీ ఈదురుగాలులతో వర్షాలు కురి సే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దా ర్ సురేశబాబు తెలిపారు. ఆయన ఆదివారం స్థానిక తహసీల్దార్ కా ర్యాలయంలో వీఆర్ఓలతో సమావేశమయ్యారు. తుఫాన ప్రభా వం తీవ్రంగా ఉందని, మట్టిమిద్దెలలో ఎవరూ నివాసం ఉండరా దన్నారు. పరిస్థితి తీవ్రత తగ్గే వరకు ప్రభుత్వ భవనాలలో ఉండాల న్నారు.
నియోజకవర్గంలో చేపట్టవల సిన అభివృద్ధి పనులపై రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ శనివారం రాత్రి రెవిన్యూ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహిం చారు. ఈ సమీక్షలో మంత్రి మాట్లాడుతూ...నియోజకవర్గం అభివృద్ధి ప ట్ల మన బాధ్యత అత్యంత కీలకమైందన్నారు. ప్రతివార్డు, గ్రామ ప్రజల కు అభివృద్ధి ఫలాలు చేరేలా అధికారులు ప్రణాళికా బద్ధంగా పనిచేయా లని అదేశించారు.
ఘోర బస్సు ప్రమాద ఘటన లో ధర్మవరం యువకులు చూపిన ధైర్యం ఆదర్శనీయమని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్యాదవ్ కొనియాడారు. కర్నూలు వద్ద రెండురోజుల క్రితం జరిగిన బస్సు ప్రమాదంలో పదిమందికి పైగా ప్రాణాలను కాపాడిన ధర్మవరం యువకులను మంత్రి సన్మానించారు.
పట్టణంలోని కూరగాయల మా ర్కెట్ వద్ద ఉన్న సబ్ రిజిసా్ట్రర్ కార్యాలయం ఎదుట రోడ్డుపైనే ద్విచ క్రవాహనాలను పార్కింగ్ చేస్తున్నారు. దీంతో రోడ్డు ఇరుకుగా మారింది. ఆ రోడ్డు వెళ్లే వాహనదారులు, పాదాచారులు చాలా ఇబ్బందులు పడు తున్నారు. ప్రతి రోజు రిజిసే్ట్రషనల కోసం ఎంతోమంది సబ్రిజిసా్ట్రర్ కార్యాలయానికి వస్తుంటారు.
అప్పులు చేసి, ఆరుగాలం కష్టపడి పండించిన పంట మూడురోజులు గా కురిసిన వర్షానికి పూర్తిగా తడిసి ముద్ద అయింది. వేరు శనగకాయలతో పాటు పశువుల మేత కూడా నల్లగామారి ఆ రైతును నిండాముంచింది. మండలంలోని దర్శినమల గ్రామానికి చెందిన రైతు నారాయణ, లక్ష్మీనారాయణమ్మ కుటుంబం నాలుగు ఎకరాలను కౌలుకు తీసుకుని బోరుబా వి కింద వేరుశనగను పంట సాగుచేశారు.
విద్యార్థుల శ్రేయస్సుకు కృషి చేస్తున్నామని, ప్రతి విద్యార్థి ఉద్యోగం సాధించాల్నదే తమ ప్రధాన లక్ష్యమని మంత్రి సత్యకుమార్యాదవ్ అన్నారు. గత నెల 16న సం స్కృతి సేవా సంస్థ ఆధ్వర్యంలో నంగ్యాలలోని గురురాఘవేంద్ర బ్యాం కింగ్ కోచింగ్ సెంటర్ సహకారంతో స్థానిక ప్రభుత్వ డిగ్రీకళాశాలలో శిక్షణ అర్హత పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు 120 మంది విద్యార్థులు హాజరయ్యారు
గ్రామాల అభివృద్ధే ధ్యే యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్యాదవ్ పేర్కొన్నారు. మండలంలోని మోటుమర్ల నుంచి కత్తేకొట్టాల వరకు, పోతులనాగేపల్లి మీదుగా కనంపల్లికి, ధర్మవరం రోడ్డు నుంచి చింతలపల్లి, వసంతపురం నుంచి చిగిచెర్ల క్రాస్ వరకు బీటీ రోడ్ల నిర్మాణానికి ఉపాధి హామీ పథకం కింద రూ.6.10కోట్లు నిధులు మంజూరయ్యాయి.