Home » Dharmavaram
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయా లతో ధర్మవరం పట్టణం ఆర్థికంగా, సామాజికంగా కొత్తదశకు చేరుకుం టోందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్యాదవ్ పేర్కొన్నా రు. ఆయన గురువారం స్థానిక ఎన్డీఏ కార్యాలయంలో మెప్మా బృందంతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లా డుతూ... గత వైసీపీ పాలనలో స్వయం సహాయక సంఘాలకు చాలా అ న్యాయం జరిగిందన్నారు.
విజయాల నాయకుడు వినాయ కుడు వాడవాడలా కొలువుదీరి భక్తుల పూజలు అందుకుంటున్నారు. వినాయక చతుర్థి సందర్భంగా బుధవారం జిల్లా కేంద్రం పుట్టపర్తితో పాటు ధర్మవరం, కదిరి పట్టణాలు, మండల కేంద్రాల్లోని, గ్రామాల్లోని పలు వీధులలో ఉత్సవ కమిటీలు వినాయక విగ్రహాలను ఏర్పాటుచేసి పూజలు చేశారు.
పట్టణంలోని ఎరువుల దుకాణాలపై మంగళవారం విజిలెన్స అధికారులు దాడు లు నిర్వహించారు. ఈ మేరకు ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న ఫర్టి లైజర్ దుకాణాలను విజిలెన్స ఎస్ఐ గోపాలుడు, అధికారులు శ్రీని వాసులు, డీసీటీఓ సురేష్కుమార్ ఏఓ ముస్తఫాతో కలిసి అకస్మిక తనిఖీలు చేశారు.
వినాయకచవితి పండుగను పురస్కరించుకుని పట్టణాల్లో వ్యాపారులు, కొనుగో లు దారుల సందడి నెలకొంది. ధర్మవరం పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్లో మంగళవారం జనంతో కిటకిటలాడింది. వినాయక ప్రతి మలు, పూజా సామగ్రి కోనుగోలు చేసేందుకు పట్టణ, గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రజలు తరలి రావడంతో ఎన్టీఆర్ సర్కిల్ కిక్కరిసిపోయింది.
రాష్ట్రస్థాయి ఆరో యోగాసన స్పోర్ట్స్ చాంపియన షిన పోటీలలో ధర్మవరం విద్యార్థులు ప్రతిభ కనబరచి బంగారు పతకాలు సాధించినట్టు యోగా అసోసియేషన జిల్లా అధ్యక్షుడు గాజుల సోమేశ్వరరెడ్డి తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా పత్తిపాడులో ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు ఈ పోటీలు నిర్వహించినట్లు తెలిపారు.
మట్టి గణపతి విగ్రహాలను పూజించి పర్యావర ణాన్ని కాపాడాలని ఆవోపా జిల్లా ఇనచార్జ్ లక్ష్మీనారాయణ, గౌరవాధ్యక్షుడు శీబా నగేశ గుప్త పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవా రం సాయంత్రం ఆవోపా, ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలను పట్టణ వాసులకు పంపిణీచేశారు. అనంతరం వారు మాట్లాడుతూ... అదే రసాయనిక విగ్రహాలువాడితే పర్యావరణానికి ముప్పు వాటిల్లు తుందని పేర్కొన్నారు.
రైతులు రూ.లక్షలు ఖర్చుపెట్టి సాగుచేసిన టమాటా పంట ఎడతెరిపి లేని వర్షాలకు పూర్తిగా దెబ్బతింది. ఆకులు, కా యలపై నల్లమచ్చలు, తెగుళ్లు వ్యాపించడంతో తీవ్రంగా నష్టపో తున్నారు. జిల్లాలో 1,150 ఎకరాల్లో టమోటా సాగైనట్లు అధికారు ల లెక్కలు చెబుతుం డగా, అనధికారికంగా మరో 500 ఎకరాల్లో సాగైంది. మే నెలాఖరు, జూనలో సాగుచేసిన పంటలను ప్రస్తుతం కోత కోస్తుండగా, జూలైలో సాగైన పంట లు పూత దశలో ఉన్నాయి.
పట్టణంలోని ఆర్డీటీ క్రీడా మైదానంలో జరుగుతున్న అటల్ బిహారీ వాజ్పేయి స్మారక క్రికెట్ టోర్నీ సీజన-2 పోటీలు ఆదివారం ఉత్కంఠ భరితంగా సాగాయి. మొదటి మ్యాచలో నాయక్ వారియర్స్, చత్రపతి శివాజీ లెవన్స జట్లు తలపడగా ఇందులో 28 పరుగుల తేడాతో నాయక వారి యర్స్ జట్టు గెలిచింది. రెండో మ్యాచలో కొత్త చెరువు గాంధీనగర్ లెవన్స జట్టుపై బసంపల్లి జట్టు మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ప్రజల్లో శాస్ర్తీయ దృక్పథం, ప్రశ్నించే తత్వం పెరగాలని మాజీ ఎమ్మెల్సీ గేయానంద్ పేర్కొన్నారు. స్థానిక ఎనజీఓహోంలో ఆదివారం జేవీవీ జిల్లా అధ్యక్షుడు మహేంద్రరెడ్డి అధ్యక్షతన జనవిజ్ఞాన వేదిక జిల్లా మహాసభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన గేయానంద్ మాట్లాడుతూ... ప్రజల్లో శాస్ర్తీయ దృక్ప థం, ప్రశ్నించే తత్వం పెరిగినప్పుడే ప్రభుత్వాలు ప్రజలకు జవాబుదారీ ఉంటాయన్నారు.
మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం(కేజీబీవీ)ని ఎంపీడీఓ నసీ మా, పంచాయతీ కార్యదర్శి మంజుల, ఎంపీపీ ఆదినారాయణ యా దవ్ ఆదివారం ఆకస్మిక తనిఖీ చేశారు. పౌష్టికాహారం అందజేత, సిబ్బంది, టీచర్ల పనితీరుపై బాలికలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేజీబీవీలో పౌష్టికాహారం అం దజేయడంలో లోపం తీవ్రంగా ఉందన్నారు.