Share News

ROAD: అధ్వానంగా రహదారి

ABN , Publish Date - Nov 01 , 2025 | 12:26 AM

పట్టణం నుంచి మామిళ్లప ల్లికి వెళ్లే రహదారి గుంతలు ఏర్పడి అధ్వానంగా తయారైంది. పోతుకుంట బృందావన కాలనీ పోలీస్‌గెస్ట్‌ హౌస్‌ వద్ద నుంచి ధర్మవరంలోకి రహదారి అంతా దెబ్బతిని గుంతలు ఏర్పడ్డాయి. ఇటీవల కాలంలో ఈ రహదారిపై ప్యాచ వర్కులు చేసినా నెలలు గడవకముందే రహదారి అంతా ఛిద్ర మవు తోందని ఆ రహదారి గుండా ప్రయాణించే గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు.

ROAD: అధ్వానంగా రహదారి
This is the road at Brindavan Colony Police Guest House

ధర్మవరం రూరల్‌, అక్టోబరు 31(ఆంధ్రజ్యోతి): పట్టణం నుంచి మామిళ్లప ల్లికి వెళ్లే రహదారి గుంతలు ఏర్పడి అధ్వానంగా తయారైంది. పోతుకుంట బృందావన కాలనీ పోలీస్‌గెస్ట్‌ హౌస్‌ వద్ద నుంచి ధర్మవరంలోకి రహదారి అంతా దెబ్బతిని గుంతలు ఏర్పడ్డాయి. ఇటీవల కాలంలో ఈ రహదారిపై ప్యాచ వర్కులు చేసినా నెలలు గడవకముందే రహదారి అంతా ఛిద్ర మవు తోందని ఆ రహదారి గుండా ప్రయాణించే గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు. ఇంత ఆధ్వానంగా ఉంటే ఎలా ప్రయాణం చేసేది? అంటూ ప్రశ్నిస్తున్నారు. నిత్యం ఈ రహదారి గుండా ఆటోలు, ద్విచక్రవాహనాలతో పాటు పలు వాహనాలు మామిళ్లపల్లి వద్ద జాతీయరహదారిలోకి వెళుతుం టాయి. ఈ గుంతలరోడ్డులో ద్విచక్రవాహనదారులు అదుపు తప్పి గాయాల పాలవుతున్నారు. రోడ్డు ఆధ్వానంగా ఉండటం పట్ల పలువురు వాహన దారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి రహదారిలో ఉన్న గుంతలను పూడ్చివేసి ప్రయాణానికి ఇబ్బంది లేకుండా చేయాలని వాహనదారులు, గ్రామస్థులు కోరుతున్నారు.

Updated Date - Nov 01 , 2025 | 12:26 AM