Home » Dharmavaram
మండల పరిధిలోని చిల్లకొండయ్యపల్లి వద్ద ఆర్టీసీ బస్సు, బొలేరో వాహనం ఆదివా రం ఢీకొన్నాయి. అయితే ఎవరికీ ఎటువంటి అపాయం కలుగ లేదు. అనంతపురం నుంచి కడపకు వెళ్తున్న పులివెందుల డిపో కు చెందిన ఆర్టీసీ బస్సు, పార్నపల్లి నుంచి బత్తలపల్లి వైపు వె ళ్తున్న బొలేరోవాహనం చిల్లకొండయ్యపల్లి సమీపంలోని పులి వెందుల బ్రాంచ కెనాల్ వద్ద ఢీకొన్నాయి.
స్థానిక డివిజన పరిధిలోని అన్ని ల్యాబ్లలో నిర్ణయించిన ధరలు మాత్రమే తీసుకోవాలని మెడికల్ ల్యాబ్ టెక్నీషియన అసోసియేషన ప్రెసిడెంట్ అంజనరెడ్డి, వైస్ ప్రసిడెంట్ అశోక్నాయక్ తెలిపారు. ఈ మేరకు శనివారం ఽ పట్టణంలోని ఆ అసోసి యేషన కార్యాలయంలో జనరల్ సెక్రటరీ కాడిశెట్టి రామ్మోహన చేతుల మీదుగా ధరల పట్టికను విడుదల చేశారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లే బర్ కోడ్లను ఉపసంహరించుకోవాలని సీ ఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబులు డి మాండ్చేశారు. లేకపోతే పెద్దఎత్తున ఉద్య మాలు చేపడుతామని హెచ్చరించారు. కేం ద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్ల నోటిఫికేషనకు వ్యతిరేకంగా సీఐటీ యూ ఆధ్వర్యంలో శనివారం స్థానిక కళా జ్యోతిసర్కిల్లో అంబేడ్కర్ విగ్రహం ఎదు ట నిరసన చేపట్టారు.
మండలంలోని రేగాటిపల్లి చెరువు హంద్రీనీవా జలాలతో నిండింది. దీంతో శనివారం జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదనరెడ్డి, చా యాదేవి దంపతులు చెరువులో గంగపూజ చేశారు. చెరువు నీటిలోకి చీర, సారే ప సుపు, కుంకుమ వదిలి ప్రత్యేక పూజలు చే శారు.
మండలంలో అనుమతిలేని లేఅవుట్లపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎంపీడీఓ పొలప్ప హె చ్చరించారు. శుక్రవారం రాత్రికి రాత్రే అక్రమ లేఅవుట్లు అన్న కథ నం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైంది.
విద్యార్థుల సమస్యల కోసం రాజీలేని పోరాటాలు నిర్వహించే ఏకైక సంఘం ఎస్ఎ్ఫఐ అని టూటౌన సీఐ రెడ్డప్ప, సంఘం జిల్లాకార్యదర్శి నాగార్జున అన్నారు. శుక్రవారం స్థానిక టూ టౌన పోలీ్సస్టేషనలో ఎస్ఎ్పఐ 25వ రాష్ట్ర మహాసభలకు సంబంధించిన పోస్టర్లను సీఐ చేతులమీదుగా ఆవిష్కరించారు.
మం డలపరిధిలోని గంటా పురానికి చెందిన శ్రీని వాసులు మంగళవారం అయోధ్యకు సైకిల్ యాత్ర ప్రారంభిం చారు. మండలంలోని గంటాపురం గ్రామంలో దాతల సహకారంతో రామాలయం నిర్మా ణం చేపట్టారు. పనులు ప్రారంభించి ఎనిమిదేళ్లు అయినా నిర్మాణం పూర్తి కాలేదు.
గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా పట్టణంలోని శాఖా గ్రంథాల యంలో సోమవారం గ్రంథాలయ అఽధికారి అంజలిసౌభాగ్యవతి ఆధ్వర్యంలో కవి సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హాజరైన కవి ప్రపుల్లా చంద్ర, వెంకటేశులు, టీటీడీ ధర్మచారులు కకాకుమాను, రవీంద్ర, గాయకులు నాగరాజులను శాలువాతో ఘనంగా సత్కరించారు. గ్రంఽథాలయాల గురించి పద్యం, కవిత, పాటల ద్వారా వారు విద్యార్థులకు వివరించారు.
కార్తీక మాసం చివరి సోమవారం పురస్కరించుకుని తాడిమర్రి మండల సరిహద్దులోని కోన మల్లీశ్వర క్షేత్రంలో ఘనంగా పూజలు నిర్వ హించారు. ఉదయం నుంచే వేలాదిగా భక్తులు తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు. కార్తీక దీపాలను వెలిగించారు. ఈ సందర్భంగా పార్న పల్లి నుంచి ఉత్సవ విగ్రహాలను కోన మల్లీశ్వర క్షేత్రానికి తీసుకొచ్చి పూ జలు చేశారు.
ముస్లిం మైనార్టీలకు మంచి చేసింది, చేసేది కూటమి ప్రభుత్వమేనని టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్ పరిటాల శ్రీరామ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇమామ్, మౌజనలకు వేత నాలు చెల్లించడంతో ఆయన శనివారం అనంతపు రంలోని క్యాంపు కార్యాలయంలో ధర్మవరం ముస్లింలతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబా బు నాయుడు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.