Home » Dharmavaram
అనంతపురంలో ఈనెల 10న నిర్వహించే సూపర్సిక్స్ - సూపర్హిట్ సభను విజయవంతం చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి సందిరెడ్డి శ్రీనివాసులు పార్టీ శ్రేణులకు, ప్రజలకు పిలుపు నిచ్చారు. ఆయన శనివారం పట్టణంలోని ఎన్డీఏ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భం గా సందిరెడ్డి మాట్లాడుతూ...గత 15నెలలుగా రాష్ట్ర ప్రజలు ఈ ప్రభు త్వాన్ని మంచి ప్రభుత్వంగా కొనియాడుతున్నారన్నారు.
పట్టణంలోని 25వ వార్డు పరిధి లోని ప్రియాంకనగర్లో పలు సమస్యలు తిష్టవేశాయి. ప్రధానంగా సీసీ రోడ్లు, డ్రైనేజీ, లో ఓల్టేజ్సమస్యతో ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు వాపోతున్నారు. అదేవిధంగా రోడ్డుకు అడ్డంగా పెద్దపెద్ద బండలు, రోడ్డు మధ్యలో విద్యుతస్తంభాలు ఉన్నాయి. ఆ బండలను, విద్యుతస్తంభాలను తొలగిస్తే రోడ్లు వేస్తామని మున్సిపల్ అధికారులు చెబు తున్నారు.
మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన జయంతిని పుర స్కరించుకుని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలో గురు పూజోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ఆపస్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ ఉ పా ధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూల మాల వేసి ఘననివాళులు అర్పించారు.
పట్టణంలోని ఎనిమిదో వార్డు కేశవనగర్లో విద్యుత తీగలు అతి తక్కువ ఎత్తులో ప్రమాదకరంగా ఉన్నాయి. తక్కువ ఎత్తులో ఉం డటం వల్ల వాహనాలలో వెళ్లే వారికి తగిలే విధంగా ఉన్నా యి. ఈ విషయాన్ని పది నెలల నుంచి విద్యుత శాఖ అదికారులకు తెలియజేస్తున్నా నిర్లక్ష్యంగా వ్యహరి స్తున్నారని స్థానికులు వాపోతున్నారు.
అనంతపురంలో ఈనెల 10వ తేదీన జరగబోయే ‘సూపర్ సిక్స్- సూపర్హిట్’ సభను విజయవంతం చేద్దామని టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్ పరిటాలశ్రీరామ్ పార్టీ శ్రేణుల కు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ఆయన గురువారం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో పార్టీ నాయకులతో సమావేశం ని ర్వహించి చర్చించారు.
మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తున్నాడనే సమాచారంతో పోలీసులు బుధవారం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సాయంత్రం పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తున్నాడని తెలియడంతో జేసీ ప్రభాకర్రెడ్డి డీఎస్పీ ఆఫీసు వద్దకు వెళ్లాడని విశ్వసనీయ సమాచారం.
ప్రజలకు మెరుగైన సేవలందించేలా దృష్టి సారించాలని ఆర్డీఓ మహేశ అధికారులకు సూచించారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో ఆయన బుధవారం రెవెన్యూ, సర్వే అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఆర్డీఓ మాట్లాడుతూ...ప్రస్తుత కాలంలో ఎదు రవుతున్న అత్యవసర సమస్యలు, ప్రాధాన్యమైన పనులు, పెం డింగ్లో ఉన్న సమస్యలను సకాలంలో పరిష్కరించేందుకు శ్రద్ధ వహించాలన్నారు.
పట్టణంలోని ఆర్డీటీ క్రీడామైదానంలో జరుగుతున్న అటల్ బిహారీ వాజ్పేయి స్మారక క్రికెట్ టోర్నీ సీజన-2 మ్యాచలో హోరాహోరీగా సాగుతున్నాయి. బుధవారం మొ దటి మ్యాచలో ఫ్రెండ్స్ లెవన్స జట్టుపై గణేష్ ఫ్రెండ్స్ జట్టు 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రెండోమ్యాచలో నాయక్ వారియర్స్ జట్టుపై లక్ష్మీ నరసింహ లెవెన్స జట్టు విజయం సాధించింది.
పట్టణంలోని మైనార్టీల కోసం షాదీమహల్ నిర్మించాలని టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్ పరిటాల శ్రీరామ్కు ముస్లిం నాయకులు విజ్ఞప్తిచేశారు. వారు బుధవారం పట్టణం లోని టీడీపీ కార్యాలయంలో పరిటాల శ్రీరామ్ను కలిశారు. వారి విజ ్ఞప్తి మేరకు ఆయన పోతుకుంట వద్ద ఈద్గా మైదానాన్ని పరిశీలించారు. త్వరలో ఎంపీ బీకే పార్థసారఽథిని కలిసి ఎంపీ ఫండ్స్ ద్వారా షాదీ మహల్ నిర్మించేందుకు కృషిచేస్తానని హామీ ఇచ్చారు.
మండల పరిధిలోని భూ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆర్డీఓ మహేశ అన్నా రు. ఆయన మంగళవారం తాడిమర్రి మండలంలో సుడిగాలి పర్యటన చేశారు. ముందుగా మర్రిమాకులపల్లి, సీసీరేవు గ్రామా ల్లో పారిశుధ్యం, సీసీరోడ్లు, విద్యుత స్తంభాల ఏర్పాట్లను పరిశీలిం చారు.