Home » Dharmavaram
మండలంలో నెలకొన్న చుక్కల భూముల సమస్యతో పాటు ఫ్రీహోల్డ్ భూముల సమస్యలను పరిష్కరించాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు రైతులు సోమవారం సీపీఐ ఆధ్వర్యంలో స్థానిక విద్యుత శాఖ కార్యాల యం వద్ద నుంచి ర్యాలీగా వెళ్లి, జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.
గ్రామాలలో ప్రకృతి వ్యవ సాయాన్ని విస్తరింపజేయలని డీపీఎం లక్ష్మనాయక్ ఐసిఆర్పీలకు సూ చించారు. కొత్తగా ఎంపికైన ట్రైనీ ఐసీఆర్పీలకు మండలపరిధిలోని గం టాపురం గ్రామంలో సోమవారం ప్రకృతి వ్యవసాయం లో శిక్షణ ఇ చ్చారు.
పట్టణంలోని కేశవనగర్లో వెల సిన అయ్యప్పస్వామి ఆలయ గురుస్వామి, అయ్యప్ప మాలధారుల ఆధ్వ ర్యంలో ఆదివారం స్వామి గ్రామోత్పవాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలో మూల విరాట్కు అభిషేకాలు చేశారు. అనంత రం అయ్యప్పస్వామి ఉత్సవ విగ్రహాన్ని వివిధ పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించి, పల్లకిలో ఉంచి పురవీధుల గుండా ఊరేగించారు.
పట్టణంలోని కేశవనగర్లో వెలసిన అయ్యప్పస్వామి ఆలయంలో గురుస్వామి విజయ్కుమార్, అ య్యప్ప మాలధారుల ఆధ్వర్యంలో శనివారం స్వామికి లక్ష పుష్పార్చనను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం వేద మంత్రాలు, మం గళవాయిద్యాల నడుమ సాగింది.
అనునిత్యం తల్లిదండ్రుల కంటే ఎక్కువగా పిల్లల ఉన్నతిని కోరుకునేది ఉపాధ్యాయులు మాత్రమే నని టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్ పరిటాల శ్రీరామ్ అన్నారు. పట్టణం లోని బీఎస్ఆర్ బాలికలు, బాలుర ఉన్నత పాఠశాలలో శుక్రవారం ని ర్వహించిన మెగా పీటీఎం కార్యక్రమానికి పరిటాలశ్రీరామ్ ముఖ్యఅతిథి గా హాజరయ్యారు.
ప్రైవేటు పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలలు మెరుగైన విద్యను అందిస్తున్నాయని, ఉపాధ్యాయులు సమన్వయంతో బాధ్యతగా విధులు నిర్వర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉందని జాయింట్ కలెక్టర్ మౌర్యభరద్వాజ్ పేర్కొన్నారు. పట్టణంలోని కొత్తపేట మున్సిపల్ బాలికల ఉన్నతపాఠశాలలో ఏర్పాటుచేసిన మెగా పీటీ ఎం సమావేశానికి జేసీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
మండల కేంద్రంలోని దొరి గల్లు రోడ్డులో వెలసిన పంచగిరీఊ అయ్యప్ప స్వామి గ్రామో త్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. భక్తుల కోలాటాలు, భజనలు, అయ్యప్ప కీర్తనలతో స్వామి దేవస్థానం వద్ద నుంచి ముదిగుబ్బ వీధులలో అయ్యప్ప స్వామి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగిం చారు.
మండలంలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం చర్చిందేందుకు మూడు నెలలకోసారి నిర్వహించే మండల సర్వసభ్య సమావేశం తాడిమర్రి మండలంలో అబాసుపాలవుతోంది. ఎంపీపీ పాటిల్ భువనేశ్వర్ ఆధ్యక్షతన గురువారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించా రు. అయితే ఈ సమావేశానికి పలు ప్రధాన శాఖల అధికారులు డుమ్మా కొట్టారు.
పట్టణంలోని సాయినగర్ షిర్డీసాయి మంది రంలో దత్తాత్రేయ జయంతిని ఆలయకమిటీ ఆధ్వర్యంలో గు రువారం ఘనంగా నిర్వహించారు. దత్తాత్రేయ విగ్ర హానికి ప్రత్యేక పూజలు చేశారు. దత్తహోమం, సా మూ హిక సత్యనారాయణస్వామి వ్రతం నిర్వహించా రు. రక్త దాన శిబిరంలో 30 మంది యువకులు రక్త దానం చేశారు. అన్నదానం చేపట్టారు.
రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్కల్యాణ్ మాటలను వక్రీకరించి ప్రజల మనోభావాలతో ఆడుకోవడం మంచిదికాదని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్రెడ్డి అన్నారు. ఆయన మాడియాతో మాట్లాడుతూ... పేర్నినాని లాంటి వాళ్లు తిన్నింటి వాసాలు లెక్కపెడతారని ఆయన అన్నారు.