Home » Dharmavaram
దసరా శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా స్థానిక వాసవీ కన్యకపరమేశ్వరి ఆలయం లో అమ్మవారి మూల వి రాట్కు శనివారం అర్చ కులు పుష్పాభిషేకాన్ని ఘ నంగా నిర్వహించారు. అ మ్మవారి మూల విరాట్ ను ఉదయం ప్రత్యేకంగా అలంకరించి, అనంతరం పుష్పాభిషేకాన్ని శాస్ర్తోక్తం గా నిర్వహించారు.
ఎన్డీఏ ప్రభుత్వం అర్హత ఉన్న ప్రతిఒక్కరికి ఎన్టీఆర్ భరోసా పింఛన్లను అందజేస్తోందని టీడీపీ నియోజకవర్గ పరిశీలకులు నాగేంద్రకుమార్, ఏపీ సీడ్స్ కార్పొరేషన డైరెక్టర్ కమతం కాటమయ్య పేర్కొన్నారు. ధర్మవరం పట్టణంలోని ఇందిరానగర్, పీఆర్టీ వీధులలో బుఽధవారం పిం ఛన్ల, స్మార్ట్ రేషనకార్డుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించా రు.
దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బుధవారం మామిళ్ల కుంట కూడలిలోని లలితాంబ మహిషాసురమర్దినిగా దర్శనమిచ్చా రు. ఎనుమలపల్లి దుర్గామాత, ప్రశాంతినిలయంలో గాయత్రిమాత, జిల్లా కేంద్రంలోని సత్యమ్మ, వాసవీమాత, కోవెలగుట్టుపల్లి దుర్గాదేవి మహిషాసురమర్దినిగా దర్శమిచ్చారు.
పట్టణంలోని లోనికోట రామలింగ చౌడేశ్వరీదేవి ఉత్సవ విగ్రహాన్ని దుర్గాష్టమి సందర్భంగా మంగళవారం పట్టణంలో భక్తిశ్రద్ధలతో ఘనంగా ఊరేగించారు. ముందుగా ఆలయంలో కలశ పూజ చేశారు. ఉదయం 8గంటలకు ఆలయం నుంచి 108 కలశాలతో ఉత్సవ విగ్రహాన్ని దేవాంగం పేట వరకు ఊరేగించి తిరిగి ఆలయానికి చేర్చారు.
మండల పరిధిలోని ధర్మపురి గ్రామం నుంచి చిన్నూరుబ త్తలపల్లికి వెళ్లాలంటే ఆ గ్రామప్రజలు వాగుదాటాల్సిందే. ఆ రెండు గ్రామాలకు మధ్యలో వాగు ఉంది. సమీప చెరువు చెలిమి నీటితో ఆ వాగు నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. అంతేగాకుండా వర్షాలు కురిస్తే ఆ వాగులో భారీగా నీరు చేరి ఆ రెండు గ్రామాలకు రాకపోక లు నిలిచిపోతాయి.
మున్సిపల్ కార్మికుల ఆరోగ్య రక్షణే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకు మార్యాదవ్ పేర్కొన్నారు. స్థానిక సంస్కృతి సేవా సమితి ఆధ్వర్యంలో వైదేహి సూపర్స్పెషాలిటీ ఆస్పత్రి సహకారంతో మున్సి పల్ కార్మికుల కోసం మంగళవారం ఏర్పాటు చేసిన ప్రత్యేక ఉచిత వైద్యశిబిరాన్ని మంత్రి సత్యకుమార్యాదవ్ ప్రారంభించారు.
దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొమ్మిదో రోజు మంగళవారం భ క్తులు పాహిమాం దుర్గాదేవి అంటూ ప్రార్థించారు. ఇందులో బాగంగా మా మిళ్ళకుంట లలితాపరమేశ్వరి దుర్గామాతగా, ప్రశాంతినిలయంలోని గాయ త్రీమాత, జిల్లా కేంద్రంలోని సత్యమ్మ, వాసవీ కన్యకా పరమేశ్వరి, ఎను మలపల్లి దుర్గమ్మ దుర్గాదేవిగా దర్శనమిచ్చారు.
ప్రజాసమస్యల పరి ష్కారానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్యాదవ్ అధికారులను ఆదేశించారు. స్థానిక ఎన్డీఏ కార్యాలయంలో సోమవారం సాయంత్రం వివిధ శాఖల అధికా రులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు.
అడుగడుగునా అపరిశుభ్రత తాండవిస్తోంది. దోమలు వృద్ధిచెంది ప్రజలు జ్వరాలతో బాధపడుతున్నారు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆయా కాలనీల వాసులు మండిపడుతున్నారు. మండలకేంద్రమైన బత్తలపల్లిలోని టీచర్స్ కాలనీ, ఎస్సీ కాలనీ, మైనార్టీ కాలనీలలో ఈ పరిస్థితి నెలకొంది. డ్రైనేజీ కాలువలు చెత్త చెదారంతో పూడిపోయాయి.
భారత గౌరవాన్ని ప్రపంచ వేది కపై నిలబెట్టిన వ్యక్తి ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అని రాష్ట్ర వైద్య ఆరో గ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. మోదీ నాయకత్వంలో అమలు చేసిన వివిధ సంక్షేమ పథకాలపై ప్రత్యేక ప్రదర్శనను పట్టణం లోని ఎన్టీఆర్ సర్కిల్లో ఆదివారం ఘనంగా నిర్వహించారు.