Home » Devotees
ధూప, దీప, నైవేద్యాల కోసం 73 దేవస్థానాలకి నెలకి రూ.10వేలు చొప్పున సహాయం అందిస్తున్నామని ఏపీ మంత్రి ఆనం రామ నారాయణరెడ్డి స్పష్టం చేశారు. దాతలు దేవస్థానాలు నిర్మించేటప్పుడు దేవాదాయ శాఖ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని మంత్రి ఆనం రామ నారాయణరెడ్డి ఆదేశించారు.
తిరుమల వేంకటేశ్వరస్వామి ప్రతిష్ట పెంచేలా చర్యలు తీసుకుంటున్నామని తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి చైర్మన్ బీఆర్ నాయుడు వ్యాఖ్యానించారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం గతం కంటే చాలా బావుందని భక్తులు చెబుతున్నారని పేర్కొన్నారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు.
హైదరాబాద్కు చెందిన జక్కారెడ్డి శ్రీనివాసులు రెడ్డి అనే భక్తుడు ఈరోజు (మంగళవారం) ఉదయం స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం స్వామి వారికి రూ.30 లక్షలు విలువ చేసే 22 కేజీల వెండి గంగాళాన్ని విరాళంగా అందించారు.
యాదగిరిగుట్టలో భక్తుల రద్దీ నెలకొంది. కార్తీక మాసం, ఆదివారం కావడంతో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దర్శనానికి భక్తజనం పోటెత్తింది.
విజయవాడ కనకదుర్గా మల్లేశ్వర స్వామి ఆలయ పరిధిలో ఎలాంటి రాజకీయ విమర్శలు చేయొద్దని పాలకమండలి సభ్యులు విజ్ఞప్తి చేశారు. ఇంద్రకీలాద్రి ఆలయ ప్రాంగణం పవిత్రమైనదని.. దయచేసి అమ్మవారి ప్రాంగణంలో రాజకీయ ఉపన్యాసాలు, రాజకీయ ఆరోపణలు చేయటం మానుకోవాలని పాలకమండలి సభ్యులు సూచించారు.
పరకామణి వ్యవహారంలో నిందితులను వదిలిపెట్టమని తిరుమల తిరుపతి పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి హెచ్చరించారు. జగన్ హయాంలో కొంతమంది రాజకీయ నేతల అండదండలు చూసుకొని వేంకటేశ్వర స్వామివారి సొమ్ములు కాజేశారని భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు.
ఓంగోలు నగరంలోని తూర్పుపాలెంలో ఈ నరకాసురవధ కార్యక్రమం 1902వ సంవత్సరంలో ప్రారంభమైంది. అప్పట్లో తూర్పుపాలెం నివాసి సింగరాజు సుబ్బయ్య అనే వ్యక్తి ఈ నరకాసురవధ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు పెద్దలు చెబుతారు. ఆ ఆచారం తరాలు మారినా నేటికీ కొనసాగుతూనే ఉంది.
విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం 2026 నూతన క్యాలెండర్ని చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో శీనా నాయక్ ఇవాళ(గురువారం) ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భవానీ దీక్షా విరమణల షెడ్యూల్ విడుదల చేశారు.
విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గా మల్లేశ్వర ఆలయానికి రికార్డు స్థాయి హుండీ ఆదాయం వచ్చింది. దసరా నవరాత్రుల 11 రోజుల హుండీని మంగళవారం లెక్కించారు ఆలయ అధికారులు. 2025 దసరా హుండీ ఆదాయం రూ. 10.30 కోట్లు దాటింది.
శ్రీవారి దర్శనార్థం విచ్చేసే సామాన్య భక్తులకు మరింత మెరుగ్గా శ్రీవారి దర్శనం, వసతి, అన్నప్రసాదాలు తదితర సౌకర్యాలు కల్పిస్తామని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం ఉదయం డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఈవో భక్తులను ఉద్దేశించి మాట్లాడారు.