Home » Devotees
ఢిల్లీలో జరుగుతున్న మతపరమైన హక్కులు, ఆచారాలు, ప్రభుత్వ జోక్యంపై విచారణలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ముఖ్యంగా శబరిమల కేసు సంబంధిత విచారణలో ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామివారి దేవస్థానంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వీకెండ్, ప్రత్యేక పూజల నేపథ్యంలో భారీ సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనానికి తరలివస్తున్నారు.
విజయనగరం జిల్లాలోని రామతీర్ధం కొండపై ఉన్న పురాతన శ్రీరాముని విగ్రహం వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో ధ్వంసమవడంతో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఈ ఘటనపై అప్పట్లో దర్యాప్తు కూడా జరిగింది.
విశాఖపట్నం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. చైత్ర బహుళ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన 'తొలి గంధం అరగతీత' కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది.
గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి అన్ని శాఖల అధికారులకు ఆదేశించారని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు. గోదావరి పుష్కర ఏర్పాట్లపై ఇప్పటికే మూడు సమీక్ష సమావేశాలు జరిగాయని తెలిపారు.
దేశవ్యాప్తంగా క్రైస్తవులు భక్తిశ్రద్ధలతో ఇవాళ గుడ్ ఫ్రైడే జరుపుకుంటున్నారు. ఏసుక్రీస్తు ప్రాణాలను త్యాగం చేసిన రోజును స్మరించుకుంటున్నారు. క్రీస్తు సిలువ మరణాన్ని ధ్యానిస్తూ భక్తులు ప్రత్యేక ప్రార్థనలు, మౌన ప్రదర్శనలు చేస్తున్నారు.
నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో మల్లన్న భక్తులు తమ భక్తిని చాటుకున్నారు. ఉగాది మహోత్సవాల నేపథ్యంలో స్వామివారికి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది.
కర్నూలు జిల్లాలోని కైరుప్పల గ్రామం మరోసారి వార్తల్లో నిలిచింది. ఉగాది పర్వదినం సందర్భంగా ఇక్కడ నిర్వహించే వీరభద్రస్వామి - కాళికాదేవి వివాహ మహోత్సవం సందర్భంగా జరిగే ‘పిడకల సమరం’ ఈరోజు అత్యంత హోరాహోరీగా సాగింది.
కొండగట్టును అభివృద్ధి చేసే బాధ్యత తాము తీసుకుంటామని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. తన కొండగట్టు పాదయాత్ర రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ అమ్మవారి మహా కుంభాభిషేక కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగిందని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇంద్రకీలాద్రిపై పవిత్రమైన కార్యక్రమంలో తాను పాల్గొనటం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.