Home » Deputy CM Pawan Kalyan
జగన్ హయాంలో ఆర్థిక విధ్వసం చేసి, ఏపీని గందరగోళంలోకి నెట్టివేశారని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ఆర్థిక విధ్వంసం వల్ల ఏపీ 30ఏళ్లు వెనక్కు వెళ్లిందని ఆవేదన వ్యక్తం చేశారు.
రహదారుల పక్కన ఉన్న భారీ వృక్షాలును విస్తరణ సమయంలో తొలగిస్తున్నారని.. వందేళ్లకు పైగా వయసున్న చెట్లను తొలగించటం బాధాకరమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. వాటిని వేరే ప్రాంతానికి తరలించడానికి ప్రత్యేక పాలసీ తీసుకువస్తున్నామని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్, అటవీ శాఖలకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు.
కాకినాడ జిల్లా బాణాసంచా పేలుళ్ల ఘటనపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని అన్నారు.
నెయ్యిలో రసాయనాలు కలవలేదని వైసీపీ అబద్ధాలు చెబుతోందని.. అందుకే తాము వివరణ ఇవ్వాల్సి వచ్చిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. కల్తీ నెయ్యిపై ఏపీ అసెంబ్లీలో లఘు చర్చ కొనసాగుతోంది. నెయ్యి కావాలంటే పాల నుంచే కాదు రసాయనాల నుంచీ తయారు చేయొచ్చని నిరూపించారని పవన్ అన్నారు.
ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చొరవతో నిర్మించిన 3 కిలోమీటర్ల రోడ్డు పనులు పూర్తి అయ్యాయి. రూ.లక్షల వ్యయంతో 12,500 మంది ప్రజలకు రవాణా సౌకర్యం, రైతుల పంటలకు సులభతరంగా మారింది..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమగ్ర, స్థిర అభివృద్ధి లక్ష్యంతో ముందుకు సాగుతోందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ లక్ష్యాన్ని సాధించడంలో గేట్స్ ఫౌండేషన్ సహకారం కీలకమని పేర్కొన్నారు.
గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్గేట్స్ సోమవారం అమరావతిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వంపై ఆయన ప్రశంసలు కురిపించారు. ‘నైస్, గుడ్, గ్రేట్ ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాలంటూ గేట్స్ కొనియాడారు..
ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్లపై జరుగుతున్న సామాజిక మాధ్యమాల దుష్ప్రచారంపై విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. ఇలా ఫొటోలను మార్ఫింగ్ చేసి సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేసిన వ్యక్తిపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు.
వారసత్వం, కళాసంపద, ధర్మ పరిరక్షణ.. ఆలయాల చుట్టూనే ఉందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. నాగరికతకు ఆలయాలు చిహ్నాలని పేర్కొన్నారు. శ్రీకాళహస్తిలో గిరి ప్రదక్షిణను శుక్రవారం వర్చువల్గా ప్రారంభించారాయన.