Home » Delhi
కాంగ్రెస్ మహిళా ఎంపీలు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. ప్రధాని నరేంద్ర మోదీపై దాడికి సిద్ధమయ్యారన్న ఆరోపణలను మహిళా ఎంపీలు ఆ లేఖలో తీవ్రంగా ఖండించారు.
ఢిల్లీలోని ఒక కారులో మూడు మృతదేహాలు లభ్యం కావడం స్థానికంగా పెను సంచలనం సృష్టించింది. రోడ్డు పక్కన అనుమానాస్పదంగా నిలిపి ఉంచిన కారును గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించిన కల్తీ నెయ్యి వ్యవహారంపై టీడీపీ ఎంపీ అప్పలనాయుడు విరుచుకుపడ్డారు.CFTRI రిపోర్టును తొక్కిపెట్టింది నిజం కాదా?భోలేబాబా డెయిరీకి కొమ్ముకాసింది ఎవరు? అంటూ ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు.
ఇటీవల ఇండియన్ రైల్వేలో వరుస అగ్నిప్రమాదాలు ప్రయాణికులలో ఆందోళన కలిగిస్తున్నాయి. సాంకేతిక లోపాల కారణంగా కొన్ని, మానవ తప్పిదాల వల్ల మరికొన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా స్వర్ణగిరి ఎక్స్ ప్రెస్ ట్రైన్ లో ప్రమాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
ఈస్ట్ ఢిల్లీలోని మయూర్ విహార్ పాకెట్ 1 మెట్రో స్టేషన్ పేరు మార్చారు. 'శ్రీరామ్ మందిర్ మయూర్ విహార్'గా పేరు పెట్టారు. మెట్రో స్టేషన్ పేరు మార్చినట్టు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఒక ప్రకటనలో తెలిపింది.
జన్ సురాజ్ పార్టీ వేసిన పిటిషన్ చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని బెంచ్ ముందుకు శుక్రవారం విచారణకు వచ్చింది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ఆ పిటిషన్ను విచారించడానికి అంగీకరించలేదు.
ప్రధాని అధికారిక నివాసంలో దేశంలోని దేవ్మోగ్రా, కోయంబత్తూర్, రాయ్పూర్, గువాహటి, ఢిల్లీ నుంచి ఎంపికైన ఎగ్జామ్ వారియర్స్.. మోదీతో ముచ్చటించారు. సుమారు 4.50 కోట్ల మంది విద్యార్థులను ఉద్దేశించి ప్రధాని 15 నిమిషాలు ప్రసంగించారు.
పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ కిందపడిపోయారు. బుధవారం నాడు పార్లమెంట్ వెలుపల విపక్ష ఎంపీలు ఆందోళన చేస్తున్నారు. అయితే..
దేశ రాజధాని ఢిల్లీలో ఓ ట్రాన్స్జెండర్ రెచ్చిపోయి ప్రవర్తించింది. డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో ఓ యువతి ముఖంపై గుట్కా ఉమ్మేసింది. ట్రాన్స్జెండర్.. యువతిపై గుట్కా ఉమ్మేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
భారత్, అమెరికా మధ్య జరిగి వాణిజ్య ఒప్పందాన్ని(ట్రేడ్ డీల్) 'ఈ శతాబ్దపు అతిపెద్ద ఒప్పందం'గా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఇది ప్రపంచ వేదికపై పెరుగుతున్న భారత దేశ ప్రాముఖ్యత మరింత పెంచుతుందని తెలిపారు.