Home » Delhi
ఢిల్లీలో మంగళవారం తెల్లవారు జామున ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మెట్రో అధికారితో సహా ఆయన కుటుంబ సభ్యులంతా మృతిచెందారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
యష్బీర్ తల్లి మాటల్ని సీరియస్గా తీసుకున్నాడు. సోమవారం ఉదయం ఉమ్మెత్త గింజల్ని సేకరించాడు. వాటిని మెత్తగా దంచి తినే లడ్డూల్లో కలిపాడు. ఆ లడ్డూలను కుటుంబసభ్యులకు పెట్టాడు.
కేంద్ర మాజీ మంత్రి, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు సురేశ్ కల్మాడి (81) కన్నుమూశారు. పీవీ నరసింహారావు కేబినెట్లో రైల్వే మంత్రిగా, ఏషియన్ అథ్లెటిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఆయన కీలక బాధ్యతలు నిర్వహించారు.
సోనియా గాంధీ ఆరోగ్య పరిస్థితిపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆరా తీశారు. ఏఐసీసీ పెద్దలకు ఫోన్ చేసి సోనియా గాంధీ ఆరోగ్యపరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. సోనియా ఆరోగ్యం నిలకడగా ఉందని మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.
ప్రభుత్వ ఉన్నత ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి లక్షల రూపాయలు వసూలు చేసిన జాబ్ ఫ్రాడ్ ఘటన హైదరాబాద్లో వెలుగులోకి వచ్చింది. ‘అబ్దుల్ కలామ్ ఓఎస్డీ’ అని తనను తాను పరిచయం చేసుకున్న ఓ వ్యక్తి, గ్రూప్ వన్ ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేసినట్లు బాధితుడు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
దేశ రాజధాని ఢిల్లీలోని లక్ష్మీనగర్లో దారుణం చోటు చేసుకుంది. జిమ్ కేర్ టేకర్ కొంతమందితో కలిసి ఓ కుటుంబంపై దాడికి పాల్పడ్డాడు. ఇంటి యజమానిని కొట్టి.. అతని భార్యను లైంగికంగా వేధించారు.
2020లో ఢిల్లీలో జరిగిన అల్లర్లు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీశాయి. పౌరసత్వ సవరణ చట్టం (CAA)కు అనుకూలంగా, వ్యతిరేకంగా జరిగిన నిరసనల మధ్య ఈ అల్లర్లు చెలరేగాయి. ముఖ్యంగా ఈశాన్య ఢిల్లీలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుని అనేక మంది ప్రాణాలు కోల్పోయారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నదీజలాల వినియోగంలో నెలకొన్న వివాదాల పరిష్కారానికి సంబంధించిన కమిటీని ఇవాళ కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ నోటిఫై చేసిందని కేంద్రమంత్రి కిషన్రెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం.. సహకార సమాఖ్య విధానంతో.. గత 11 ఏళ్లుగా తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాల పరిష్కారానికి సంపూర్ణ సహకారాన్ని అందిస్తోందని పేర్కొన్నారు.
ధూమపాన ప్రియులకు, పాన్ మసాలా తినేవారికి బిగ్ షాక్. పొగాకు ఉత్పత్తులపై కొత్త పన్ను విధానం గురించి కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.
ఢిల్లీలో మనీలాండరింగ్ కేసుకు సంబంధించిన ఈడీ జరిపిన సోదాల్లో పెద్ద ఎత్తున డబ్బు, బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు.