Delhi Metro Official Family: ఘోర అగ్ని ప్రమాదం.. మెట్రో అధికారితో సహా..
ABN , Publish Date - Jan 06 , 2026 | 08:20 PM
ఢిల్లీలో మంగళవారం తెల్లవారు జామున ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మెట్రో అధికారితో సహా ఆయన కుటుంబ సభ్యులంతా మృతిచెందారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
జాతీయం, జనవరి 06: ఢిల్లీలోని ఒక ఫ్లాట్లో జరిగిన అగ్నిప్రమాదంలో మెట్రో అధికారితో సహా ఆయన కుటుంబ సభ్యులు మరణించారు. మృతులను ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC)లో అసిస్టెంట్ సెక్షన్ ఇంజనీర్ (సిగ్నలింగ్ అండ్ టెలికాం)గా పనిచేస్తున్న అజయ్ విమల్(45), ఆయన భార్య నీలమ్(38) వారి పదేళ్ల కుమార్తె జాహ్నవిగా పోలీసులు గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ఢిల్లీ నగరం ఆదర్శ్ నగర్ ప్రాంతంలోని ఓ అపార్ట్మెంట్లో అజయ్ విమల్.. తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నారు. ఆయనకు జాహ్నవి అనే పదేళ్ల కూతురు ఉంది. అజయ్.. ఢిల్లీ మెట్రో రైల్వే కార్పొరేషన్లో అసిస్టెంట్ సెక్షన్ ఇంజినీర్గా పని చేస్తున్నారు. మంగళవారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో వారి నివాసంలో అగ్నిప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలికి చేరుకున్నారు. మంటలను అదుపుచేసి లోపలికి వెళ్లి చూడగా.. బెడ్ రూమ్ తీవ్రమైన గాయాలతో అజయ్ కుటుంబ సభ్యులు కనిపించారు.
క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తుండగానే వారు మరణించారు. ఇక మంటలార్పే క్రమంలో అగ్నిమాపక శాఖకు చెందిన రమేశ్ అనే ఉద్యోగికి కూడా గాయాలయ్యాయి. దీంతో ఆయనను జగ్జీవన్ ఆస్పత్రిలో చికిత్స అందించి.. ఆ తర్వాత డిశ్చార్జ్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. నీటిని వేడి చేసేందుకు పెట్టిన వాటర్ హీటర్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయని పోలీసులు అనుమానిస్తున్నారు. అగ్నిప్రమాదంలో తమ సహోద్యోగి కుటుంబం మరణిచిందని DMRC కార్పొరేట్ కమ్యూనికేషన్స్ ప్రిన్సిపల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనుజ్ దయాల్ ధృవీకరించారు.
ఇవి కూడా చదవండి..
విధి నిర్వహణలో వైఫల్యం.. సీఏక్యూఎంపై సుప్రీంకోర్టు అసహనం
ఉత్తరప్రదేశ్లో 2.89 కోట్ల మంది ఓటర్ల తొలగింపు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి