Home » Delhi High Court
లిక్కర్ స్కామ్కి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. ఈడీ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్ను ముఖ్యమంత్రిగా తొలగించాలని దాఖలైన పిటిషన్ను న్యాయస్థానం కొట్టివేసింది.
ఢిల్లీ హైకోర్టులో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్కు చుక్కెదురైంది. లిక్కర్ స్కామ్ కేసులో తన అరెస్ట్, ఈడీ రిమాండ్ను సవాల్ చేస్తూ శనివారం నాడు పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ వెంటనే విచారించాలని కేజ్రీవాల్ కోరారు. కేజ్రీవాల్ అభ్యర్థనను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది.
CM Kejriwal: దేశ రాజధాని ఢిల్లీ రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. ఓవైపు సీఎం కేజ్రీవాల్(CM Kejriwal).. మరోవైపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు(ED).. పరిస్థితి తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో(Delhi Liquor Scam Case) సీఎం అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ అరెస్ట్ చేస్తుందని గట్టి ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో.. కేజ్రీవాల్ కీలక నిర్ణయం..
దిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో విచారణకు రావాలంటూ సీఎం కేజ్రీవాల్ ( Kejriwal ) కు ఈడీ తొమ్మిదో సారి సమన్లు జారీ చేసింది. దీనిని తీవ్రంగా తీసుకున్న ఆప్ అధినేత హైకోర్టును ఆశ్రయించారు. తనకు జారీ చేసిన అనేక సమన్లను సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు.
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసు ఆసక్తికరమైన మలుపులు తిరుగుతోంది. మనీలాండరింగ్ కింద తనకు ఇంతవరకూ జారీ చేసిన సమన్లను ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మంగళవారంనాడు ఢిల్లీ హైకోర్టులో సవాలు చేశారు. దీనిపై హైకోర్టు ధర్మాసనం బుధవారం విచారణ జరుపనుంది.
చైనీస్ వీసా కేసుకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ ఎంపీ కార్తి చిదంబరం, ఇతరులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన చార్జిషీటుపై తీర్పును ఢిల్లీ హైకోర్టు సోమవారంనాడు రిజర్వ్ చేసింది. మార్చి 16వ తేదీకి తీర్పును ప్రత్యేక న్యాయమూర్తి ఎంకే నాగ్పాల్ వాయిదా వేశారు.
భర్తకు డబ్బు లేదని తెలిసీ గొంతెమ్మ కోర్కెలతో టార్చర్ పెట్టిన ఓ మహిళకు ఢిల్లీ హైకోర్టు భారీ షాకిచ్చింది. అలవిగాని కోర్కెలతో భర్తకు మనశ్శాంతి లేకుండా చేయడమూ క్రూత్వమేనని తేల్చి చెప్పింది.
ఢిల్లీ లిక్కర్ కేసు ( Delhi Liquor Case ) లో ఈ నెల 22 తర్వాత కీలక పరిణామాలు ఉంటాయని ఈడీ అధికారులు హెచ్చరించారు. ఢిల్లీ లిక్కర్ కేసు నిందితుడు అరుణ్ రామచంద్రా పిళ్ళై ( Arun Ramachandra Pillai ) మధ్యంతర బెయిల్ పొడిగింపుకు ఢిల్లీ హైకోర్టు నో చెప్పింది.
ఓ వితంతువు మానసిక ఆరోగ్యం సరిగ్గా లేని కారణంగా 27 వారాల గర్బవిచ్ఛిత్తికి (Abortion) ఢిల్లీ హైకోర్టు(Delhi High Court) అనుమతించింది. ఢిల్లీకి చెందిన మహిళ భర్త ఇటీవల ఓ ప్రమాదంలో మరణించాడు. అప్పటినుంచి ఆమె తీవ్ర మనోవేదనకు గురవుతోంది.
ప్రధాని పిక్పాకెట్ అంటూ రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై దాఖలైన పిల్లో ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రాహుల్పై చట్టపరంగా తగు చర్యలు తీసుకోవాలని ఈసీని ఆదేశించింది.