Home » Delhi High Court
ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో భారీగా నగదు లభించిన వ్యవహారంపై పార్లమెంటరీ విచారణ కమిటీ కీలక విషయాలు వెల్లడించింది. ఆయన ఇంట్లో లభించిన నగదుకు సంబంధించి తగిన వివరణ ఇవ్వడంలో వర్మ విఫలమయ్యారని కమిటీ పేర్కొంది.
లైంగిక వేధింపుల కేసులో భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్కు ఢిల్లీ కోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో ఆయన్ను నిర్దోషిగా ప్రకటిస్తూ.. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు వెలువరించింది.
టీమిండియా మాజీ స్టార్ ఆల్రౌండర్, ప్రపంచకప్ హీరో యువరాజ్ సింగ్ వ్యక్తిగత హక్కులు, గోప్యతకు భంగం కలిగించవద్దని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. వ్యక్తిగత ప్రయోజనాల కోసం యువీ ఫొటోలను ఉపయోగించకూడదని థర్డ్ పార్టీలను నియంత్రిస్తూ జస్టిస్ జ్యోతి సింగ్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.
నేషనల్ హెరాల్డ్కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి ఢిల్లీ హైకోర్టు మూడు వారాల గడువు ఇచ్చింది.
పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్చుక్ను ఆస్పత్రికి తరలించడం సరైన చర్యేనని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఆయన ఆరోగ్యం క్షీణించడంతోనే కేంద్ర ప్రభుత్వం సఫ్దర్జంగ్ ఆస్పత్రికి తరలించాల్సి వచ్చిందని, ఇది సరైన నిర్ణయమేనని పేర్కొంది.
ప్రముఖ శాస్త్రవేత్త, సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ భార్య గీతాంజలి ఆంగ్మో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. వైద్య చికిత్స నెపంతో తన భర్తను పోలీసులు అక్రమంగా నిర్బంధించారని ఆమె పిటిషన్ వేశారు.
సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ఢిల్లీ హైకోర్టు స్పందించింది. వాంగ్చుక్ ఆరోగ్య పరిస్థితిని అత్యంత తీవ్రంగా పరిగణించిన న్యాయస్థానం.. కేంద్రానికి, ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
బాలీవుడ్ నటుడు రాజ్పాల్ యాదవ్కు చెక్ బౌన్స్ కేసులో ఢిల్లీ హైకోర్టు మూడు నెలల జైలు శిక్ష విధించింది. ట్రయల్ కోర్టు గతంలో విధించిన ఆరు నెలల జైలు శిక్షను హైకోర్టు మూడు నెలలకు తగ్గించింది. రాజ్పాల్ దాఖలు చేసిన పిటిషన్లను జస్టిస్ స్వర్ణ కాంత శర్మ ఇవాళ(శుక్రవారం) కొట్టివేస్తూ తీర్పు వెలువరించారు.
ఢిల్లీ హైకోర్టులో కాక్రోచ్ జనతా పార్టీకి పెద్ద ఊరట లభించింది. వివాదాస్పద కారణాల వల్ల గతంలో నిలిపివేసిన ఆ పార్టీ అధికారిక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ 'ఎక్స్' ఖాతాను తక్షణమే పునరుద్ధరించాలని ఢిల్లీ హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
టెలిగ్రామ్ ఓ 'డార్క్ వెబ్'లా రూపాంతరం చెందిందని, సైబర్ మోసగాళ్లు, తీవ్రవాద గ్రూపులు చట్టం నుంచి తప్పించుకోవడానికి దీనిని విరివిగా ఉపయోగిస్తున్నారని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టులో ఓ అఫిడవిట్ దాఖలు చేసింది.