Home » Cyber Crime
నకిలీ ట్రేడింగ్ యాప్ ద్వారా ఓ ఫార్మా ఉద్యోగి నుంచి రూ.11.29 లక్షలు కాజేసిన సైబర్ మోసగాళ్లపై సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు.
127 మంది సైబర్ నేరస్తులను అరెస్ట్ చేసినట్లు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్బీ) బుధవారం వెల్లడించింది. సైబర్ మోసాలపై ఆపరేషన్ క్రాక్ డౌన్ 3.0లో భాగంగా ఈ నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపింది.
సైబర్ నేరగాళ్లు కొత్త అవతారమెత్తి ఓ కార్పొరేట్ సంస్థను మోసం చేశారు. సంస్థ ఉన్నతాధికారినని మైక్రోసాఫ్ట్ టీమ్స్ చాట్ ద్వారా ఫైనాన్స్ మేనేజర్ను నమ్మించి రూ.18 లక్షలు కాజేశారు.
వాటర్ బోర్డు పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని సైబరాబాద్ సైబర్ క్రైవ్ డీసీపీ టి. సాయిమనోహర్ ఒక ప్రకటనలో తెలిపారు.
సైబర్ కాల్ సెంటర్స్పై హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు.
అధిక లాభాలు వస్తాయని నమ్మించి, కస్టమర్ ఫిక్స్డ్ డిపాజిట్లను ముందుగానే రద్దు చేయించి మోసానికి పాల్పడిన ఘటనలో సైబరాబాద్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ (ఈవోడబ్ల్యూ) పోలీసులు ఓ ప్రైవేట్ బ్యాంకు మాజీ మేనేజర్తో పాటు పలువురిపై కేసు నమోదు చేశారు.
కాకినాడ జిల్లా పెద్దాపురంలో భారీ ఆన్లైన్ మోసం వెలుగులోకి వచ్చింది. స్టాక్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో వాట్సాప్ ద్వారా నమ్మబలికి ఓ దంపతుల నుంచి సైబర్ కేటుగాడు రూ. 85 లక్షలు మోసం చేసిన ఘటన కలకలం రేపింది.
సైబర్ నేరగాళ్లు నకిలీ క్రిప్టో ట్రేడింగ్ యాప్ ద్వారా రిటైర్డ్ సాఫ్ట్వేర్ ఉద్యోగిని నమ్మించి సుమారు రూ.2.93 కోట్లు మోసం చేశారు.
బక్రీద్ పండుగ నేపథ్యంలో.. డిజిటల్ చెల్లింపుల (జీ పే, ఫోన్ పే, వంటివి) విషయంలో వ్యాపారులు జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ హెచ్చరించారు.
స్నేహితుడినని నమ్మించి ఉల్లి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టిస్తానంటూ ఓ వ్యాపారికి రూ.24లక్షలకు పైగా కుచ్చుటోపీ వేశాడో సైబర్ మోసగాడు.