Home » Cyber attack
సైబర్ నేరగాళ్లు కొట్టేసిన డబ్బును క్రిప్టో కరెన్సీగా మార్చి చైనా క్రిమినల్కు దోచిపెట్టిన ఆరుగురు తెలుగు సైబర్ నేరగాళ్లను సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. సైబర్ క్రైమ్ డీసీపీ ధార కవిత తెలిపిన వివరాల ప్రకారం.. తార్నాకకు చెందిన 34ఏళ్ల బాధితురాలికి ఇన్స్టాలో, వాట్సాప్లో టెలీగ్రామ్లో మెసేజ్లు వచ్చేవి.
సైబర్ నేరగాళ్లు ఫుడ్ డెలివరీ యాప్లను సైతం మోసాలకు వాడుకుంటున్నారు. నగరానికి చెందిన వ్యక్తి ఫుడ్ డెలివరీ యాప్లో ఆర్డర్ పెట్టి డబ్బులు చెల్లించాడు. ఫుడ్ ఆర్డర్ సమాచారం కానీ, బ్యాంకు నుంచి డబ్బు చెల్లింపులకు చెందిన సమాచారం కానీ రాలేదు.
సామాన్యులనే కాదు.. విద్యావంతులనూ బురిడీ కొట్టిస్తూ రోజుకో కొత్త మార్గంలో సైబర్ నేరగాళ్లు డబ్బులు దండుకుంటున్నారు. తాజాగా ఫ్లాట్ అద్దె కావాలంటూ ఆర్మీ అధికారుల్లా మాట్లాడి నమ్మించిన కేటుగాళ్లు.. అద్దె అడ్వాన్స్ చెల్లిస్తామంటూ ఓ వ్యక్తి నుంచి ఏకంగా రూ.12.75 లక్షలు కాజేశారు.
డేటింగ్ యాప్ల మాటున సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. యాప్లో యువతితో వీడియోకాల్లో మాట్లాడిన యువకుడిని బెదిరించిన సైబర్ నేరగాళ్లు రూ.1.80 లక్షలు వసూలు చేశారు. గుడిమల్కాపూర్ ప్రాంతానికి చెందిన యువకుడు (24) డేటింగ్ యాప్లో పరిచయమైన శివానితో చాటింగ్ చేస్తూ, వాట్సాప్ లో తరచూ మాట్లాడేవాడు.
సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. సోషల్ మీడియాలో ఇన్వెస్ట్మెంటు పేరుతో నకిలీ యాప్లు ప్రవేశపెట్టి.. ఇందులో పెట్టుబడి పెడితే అధిక మొత్తంలో డబ్బులు వస్తాయంటూ ఆశలు రేకెత్తించి కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్నారు.
డేటింగ్ యాప్లో వలపు వల విసిరింది. పరిచయం పెంచుకుంది. ట్రేడింగ్లో టిప్స్ ఇస్తానంటూ బురిడీ కొట్టించింది. నగరానికి చెందిన వ్యక్తి నుంచి రూ. 13.3 లక్షలు కాజేసింది. సిటీ సైబర్ క్రైమ్ పోలీసుల కథనం ప్రకారం.. బేగంపేటకు చేందిన 41 ఏళ్ల వ్యక్తికి డేటింగ్ యాప్లో చాందినీ చౌదరి పరిచయమైంది.
ఆన్లైన్లో పార్ట్టైమ్ జాబ్ పేరిట సైబర్ నేరగాళ్లు వల విసిరి, ఆ తర్వాత పెట్టుబడులను పెట్టించి ఓ వ్యక్తి నుంచి రూ.27లక్షలు కొల్లగొట్టారు. డీసీపీ ధార కవిత తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఆన్లైన్లో ఆర్డర్ చేసిన వస్తువు రాకపోవడంపై ఫిర్యాదు చేసేందుకు గూగుల్లో కస్టమర్ కేర్ నంబర్ వెతికి సంప్రదించిన వ్యక్తి ఖాతా నుంచి రూ. 1.40 లక్షలు కాజేశారు సైబర్ నేరగాళ్లు. టోలీచౌకి ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి (64) బ్లింక్ ఇట్లో కొన్ని వస్తువులు ఆర్డర్ పెట్టాడు.
ప్రధాన మంత్రి కిసాన్ యోజన స్కీం పేరుతో ఏపీకే లింక్ను పంపిన సైబర్ నేరగాళ్లు, నగరవాసి ఫోన్ను హ్యాక్ చేసి ఖాతాలోని రూ.1.95 లక్షలు కాజేశారు. యూసుఫ్గూడ ప్రాంతానికి చెందిన వ్యక్తికి కొత్త నెంబర్ నుంచి పీఎం కిసాన్ పేరుతో ఏపీకే లింక్ వచ్చింది.
నోయిడా కేంద్రంగా జరిగిన రూ. 260 కోట్ల రూపాయల సైబర్ ఫ్రాడ్ ఇది. సైబర్ నేరగాళ్లు.. పోలీసు అధికారులు లేదా ఇతర ప్రభుత్వ సంస్థల సిబ్బందిగా నటించి దేశ, విదేశీయుల్ని బెదిరించారు. అమెజాన్ ఏజెంట్లమని చెప్పి..