Home » Cyber attack
జలమండలి అధికారి పేరిట ఓ సైబర్ నేరగాడు ఓ వృద్ధుడి నుంచి రూ.2.30 లక్షలు కాజేశాడు. చిలకలగూడ పోలీసుల కథనం ప్రకారం.. సీతాఫల్మండికి చెందిన రిటైర్డ్ ప్రభుతోద్యోగికి వాటర్ బోర్డు నుంచి నీటి బిల్లు వెరిఫికేషన్ కోసమంటూ ఓ అగంతకుడు ఈనెల 15వ తేదీన పలుమార్లు కాల్ చేశాడు.
రోజురోజుకూ సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. మోసపూరితమైన ఏపీకే ఫైల్ లింకులు పంపి.. అమాయకుల ఫోన్లను హ్యాక్ చేస్తూ వారి ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. నగరానికి చెందిన ఐదుగురు ఖాతాల నుంచి రూ.16.31 లక్షలు కాజేశారు.
నకిలీ ట్రేడింగ్ యాప్ పేరుతో ఓ ప్రైవేట్ ఉద్యోగి నుంచి సైబర్ నేరగాళ్లు రూ.21.93 లక్షలు కాజేశారు. సైబర్ క్రైమ్ డీసీపీ సాయి తెలిపిన వివరాల ప్రకారం.. టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూపులు, ఇతర సోషల్ మీడియా చానళ్ల ద్వారా ఆన్లైన్ స్టాక్ ట్రేడింగ్ పేరుతో సైబర్ నేరగాళ్లు ప్రచారం చేశారు.
ఏపీకే ఫైల్స్ పంపి, వాటిని క్లిక్ చేయగానే ఫోన్ హ్యాక్ చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లోయర్ ట్యాంక్బండ్కు చెందిన బాధితుడికి హెచ్బీఎఫ్సీ బ్యాంకు నుంచి రెండు ఎస్సెమ్మెస్లు వచ్చాయి.
హైదరాబాద్లో సైబర్ అవేర్నెస్ ఉన్నప్పటికీ, ఇంకా బాధితులు ఉన్నారని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి పేర్కొన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం సైబర్ బాధితులు తగ్గేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నామని తెలిపారు డీజీపీ శివధర్ రెడ్డి.
ప్రతి రోజు లక్షల్లో సైబర్ ఫ్రాడ్ జరుగుతోందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ తెలిపారు. పెట్టుబడులు పెట్టీ చాలా యాప్లలో పలువురు మోసపోతున్నారని చెప్పుకొచ్చారు. డిజిటల్ అరెస్ట్పై కూడా అవగాహన కల్పించామని పేర్కొన్నారు సీపీ సజ్జనార్.
ట్రేడింగ్ యాప్ పేరుతో సైబర్ నేరగాళ్లు కోటిన్నర రూపాయలు కొట్టేశారు. తిరుపతిలో ఉండే చైతన్య కుమార్, వెంకటేష్కు ఆన్లైన్ ద్వారా ఒక వ్యక్తితో పరిచయం ఏర్పడింది..
మొబైల్ ఫోన్ల సిమ్ కార్డులు హ్యాక్ చేసి 'SIM స్వాప్' మోసాలకు పాల్పడుతున్నారు. సైబర్ నేరగాళ్లు వినియోగదారుని మొబైల్ నంబర్ను తమ నియంత్రణలోకి తీసుకుని, ఆ నంబర్కు లింకైన ఖాతాలను తమ ఆధీనంలోకి తెచ్చుకుని..
పీఎం కిసాన్, ఆర్టీఓ చలాన్ పేర్లతో ఏపీకే లింక్లను పంపి ఇద్దరు నగరవాసులను బురిడీ కొట్టించిన సైబర్ నేరగాళ్లు రూ.2.47 లక్షలు కాజేశారు. దోమలగూడ ప్రాంతానికి చెందిన వ్యక్తి (29) ఫోన్కు ‘పీఎం కిసాన్’ పేరుతో ఏపీకే లింక్ పంపి దరఖాస్తు చేసుకోవాల్సిందిగా సూచించారు.
లండన్ నుంచి గిఫ్ట్ ప్యాక్ పంపుతున్నామంటూ మాజీ ప్రభుత్వ ఉద్యోగిని దగ్గర రూ.47 లక్షల కాజేసిన అపరిచిత వ్యక్తుల కోసం సైబర్ క్రైం పోలీసులు గాలిస్తున్నారు. తంజావూరు వైద్య కళాశాల రోడ్డుకు చెందిన 64 ఏళ్ల మాజీ ప్రభుత్వ ఉద్యోగిని సెల్ఫోన్కు జూలై 8వ తేది ఫోన్ చేసిన ఓ మహిళ తాను ఆ ఉద్యోగి క్లాస్మేట్నంటూ పరిచయం చేసుకుంది.