Home » Cyber attack
ఆన్లైన్ ట్రేడింగ్లో పెద్ద మొత్తంలో లాభాలు వస్తాయని నమ్మించిన సైబర్ నేరగాళ్లు రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి నుంచి రూ.94.36 లక్షలు కాజేశారు. కొత్తపేటకు చెందిన రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి (70)ని సైబర్ నేరగాళ్లు సంప్రదించారు.
దేశవ్యాప్తంగా ఇటీవల డిజిటల్ అరెస్ట్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ కొత్త తరహా మోసం ప్రజలను మరింత ఆందోళనను కలిగిస్తోంది. తాజాగా ఓ రిటైర్డ్ జడ్జిని లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు భారీ మోసానికి పాల్పడిన ఘటన హైదరాబాద్లో వెలుగులోకి వచ్చింది.
సైబర్ నేరగాళ్లు పెట్టుబడుల పేరిట వృద్ధుడిని మోసం చేసి లక్షల రూపాయలు దోచుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది.
ప్రస్తుత కాలంలో సైబర్ నేరగాళ్లు కేవలం డబ్బునే కాకుండా, వ్యక్తిత్వాన్ని దొంగిలిస్తున్నారని, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, బయోమెట్రిక్తో మోసాలకు పాల్పడుతున్నారని హైదరాబాద్ సైబర్ క్రైమ్స్ డీసీపీ వి.అరవింద్బాబు హెచ్చరించారు.
సైబర్ నేరగాళ్లు పండుగలను కూడా తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. రంజాన్ మాసం ప్రారంభమైన తరుణంలో సామాజిక మాధ్యమాల్లో డొనేషన్, రంజాన్ ఆఫర్ల సందేశాల పేరుతో వల విసురుతున్నారు.
ఓ ట్రేడింగ్ సంస్థ నుంచి క్రిప్టో కరెన్సీని కొనుగోలు చేస్తామని నమ్మించిన కొందరు సైబర్ నేరగాళ్లు.. నకిలీ కేవైసీ పేరుతో ఆ సంస్థ వెబ్సైట్ను హ్యాక్ చేసి సుమారు రూ. 21.80 కోట్ల విలువైన క్రిప్టో కరెన్సీని కొల్లగొట్టారు.
వాలెంటైన్స్డే సందర్భంగా ప్రేమికులను లక్ష్యంగా చేసుకుంటున్న సైబర్ క్రిమినల్స్ ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్నారని, యువత అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.
అమలాపురానికి చెందిన ఓ పీఎంపీ వైద్యుడు ఆన్లైన్ మోసగాళ్ల వలలో పడి మోసపోయారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
ఓ ఘరానా సైబర్ నేరగాడిని పోలీసులు అరెస్టు చేశారు. వృద్ధుడిని భయపెట్టి రూ.1.7కోట్లు కొల్లగొట్టిన సైబర్ నేరగాడు ప్రస్తుతం కటకటాలపాలయ్యాడు. నగరంలో సైబర్ నేరాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ తరహ నేరాలపై ప్రజల్లో అవగాహన తక్కువగా ఉండడంతో ప్రతిరోజు ఎవరె ఒకరు బలవుతూనే ఉన్నారు.
ముషీరాబాద్కు చెందిన దక్షిణ మధ్య రైల్వే ఇంజినీర్ను ఓ యువతి పెళ్లి పేరుతో నమ్మించింది. అనంతరం క్రిప్టో ట్రేడింగ్లో లాభాల పేరుతో పెద్ద మొత్తంలో ఊడ్చేసింది. బాధితుడు సుమారు రూ.54 లక్షలు నష్టపోయాడు. ఈ మోసంపై వెంటనే బాధితుడు సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.