Home » Crude Oil
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, హోర్ముజ్ జలసంధి మూసివేత భారత ఆర్థిక వ్యవస్థపై, సరఫరా గొలుసుపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. దేశంలో చమురు నిల్వలు నిండుకున్నాయని, మరో 25 రోజులకు సరిపయే ఇంధనం మాత్రమే ఉందని వార్తలు వస్తున్నాయి.
ఇరాన్ - ఇజ్రాయెల్, అమెరికా మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ చక్కగా వ్యవహరిస్తోందంటూ అమెరికా కితాబిచ్చింది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసేందుకు ఇటీవల ఆమోదం తెలిపిన అమెరికా ట్రెజరీ సెక్రటరీ.. భారత్ బాధ్యతాయుతంగా నడుచుకుంటోందంటూ కితాబిచ్చారు.
ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు ప్రపంచ వాణిజ్యంపై, అంతర్జాతీయ మార్కెట్లపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రపంచ చమురు రవాణాలో కీలక మార్గమైన హోర్ముజ్ జలసంధిని మూసేస్తున్నట్టు ఇరాన్ ప్రకటించడం ఆసియా దేశాలను వణికిస్తోంది.
అంతర్జాతీయ ముడి చమురు రవాణాకు కీలక మార్గమైన హోర్ముజ్ జలసంధిని మూసేస్తున్నామని, ఏ నౌక అయినా దాటడానికి ప్రయత్నిస్తే కాల్చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్, నౌకదళం ఆ పని చేస్తాయని వార్నింగ్ ఇచ్చింది.
అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ చేస్తున్న ప్రతీకార దాడులతో పశ్చిమాసియా అట్టుడుకుతోంది. తాజాగా సౌదీ అరేబియాలోని అతిపెద్ద చమురు శుద్ధి కేంద్రాల్లో ఒకటైన అరామ్కో రిఫైనరీ కంపెనీపై డ్రోన్ దాడి జరిగినట్లు తెలుస్తోంది.
గల్ఫ్ దేశాల్లో ఉద్రిక్తతలు నెలకొన్నప్పటికీ ఇది స్వల్పకాలికమేనన్న కథనాలు అంతర్జాతీయ మీడియాలో వెలువడ్డాయి. ఈ పరిస్థితుల్లో చమురు దిగుమతుల పరంగా భారత్కు టెన్షన్ లేనట్టేనన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.
వారం వారం ఏ మేరకు రష్యా, యూఎస్ నుంచి చమురును దిగుమతి చేసుకుంటున్నారో చెప్పాలని కేంద్రం రిఫైనరీలను కోరినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అమెరికాతో వాణిజ్య ఒప్పందం త్వరలో కుదరనుందన్న వార్తల నడుమ ఈ పరిణామం ఆసక్తికరంగా మారింది.
రష్యా అగ్రశ్రేణి చమురు ఉత్పత్తి సంస్థలైన రాస్నెఫ్ట్, లోకోయిల్పై అమెరికా ఆర్థిక ఆంక్షలు విధించిన నేపథ్యంలో సరికొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఆంక్షలు అమల్లోకి రావడంతో క్రూడాయిల్ ధరలు రికార్డు స్థాయిలో తగ్గాయి.
Discount On Oil: అమెరికా నుంచి ఎంత ఒత్తిడి ఉన్నా .. భారత్ మాత్రం వెనక్కు తగ్గటం లేదు. క్రూడ్ ఆయిల్ దిగుమతిని కొనసాగించింది. ఇప్పుడు రష్యా ప్రకటించిన డిస్కౌంట్తో తక్కువ ధరకే క్రూడ్ ఆయిల్ను దిగుమతి చేసుకోనుంది.
OPEC+ Oil Supply Hike August: చమురు ఎగుమతి దేశాల సమాఖ్య (ఒపెక్+) శనివారం జరిగిన సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నాయి. ముడి చమురు ఉత్పత్తిని రోజుకు 548,000 బ్యారెళ్లకు పెంచేందుకు సమిష్టిగా అంగీకారం తెలిపాయి.