Home » Crime News
జనగాం జిల్లా శంకర్ తండా సమీపంలోని కుంటలో యువతి శ్రావ్య మృతదేహం లభ్యమయింది. నిన్న బోళ్లమత్తడి వద్ద ప్రేమికులు బరిగెల శివకుమార్, బక్క శ్రావ్య బైక్తో సహా నీటిలో కొట్టుకుపోయారు. చెట్టుకొమ్మ సాయంతో యువకుడు శివకుమార్ బయటపడగా, యువతి గల్లంతయ్యింది.
వివాహానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.. వేడుకలకు బంధువులు అందరూ చేరుకున్నారు. గుండెపోటుతో వధువు కన్ను యూయడంతో ఆ ఇంట్లో విషాదం నెలకొంది. జీవితంలో కొత్త అధ్యాయానికి అడుగులు వేడయానికి సిద్ధమైన యువతి జీవితం అకస్మికంగా ముగిసిన సంఘటన చిక్కమగళూరు జిల్లా అజ్జంపుర తాలూకాలో గురువారం చోటు చేసుకుంది.
వివాహం చేసుకునేందుకు ఇష్టం లేని దంతవైద్యురాలు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కళ్లకుర్చి జిల్లాలో చోటుచేసుకుంది. తిరుకోవిలూర్ సందైపేట సుబ్రమణ్యనగర్ ప్రాంతానికి చెందిన కృష్ణన్ కుమార్తె అమృతవర్షిణి (24) దంత వైద్యురాలిగా పనిచేస్తోంది.
బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మైసమ్మగూడలో జరిగింది. పేట్బషీరాబాద్ సీఐ విజయవర్ధన్ తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా, దామరచర్ల కృష్ణారావు కాలనీకి చెందిన పూర్ణచందర్రావు రెండో కుమారుడు పి. మల్లికార్జున్(19) మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఆర్ఐటీ)లో బీటెక్ తృతీయ సంవత్సరం చదువుతూ మైసమ్మగూడలోని సిరి డీలక్స్ వసతిగృహంలో ఉంటున్నాడు.
పోక్సో కేసులో అన్నమయ్య జిల్లా యువకుడికి 20 ఏళ్ల జైలు శిక్ష, విధిస్తూ చిత్తూరు న్యాయస్థానం తీర్పు చెప్పింది.
పదేళ్ల క్రితం రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన చిత్తూరు ప్రథమ మేయర్ కఠారి అనురాధ దంపతుల హత్యకేసు విచారణ చివరి ఘట్టానికి చేరుకుంది. శుక్రవారం న్యాయమూర్తి తుది తీర్పు వెల్లడించనున్నారు.
మంత్రి లోకేశ్ ఫొటోను వాట్సప్ డీపీగా పెట్టుకుని.. మోసాలకు పాల్పడుతున్న ముఠాను సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు నిందితులకు కోర్టు 14 రిమాండ్ విధించినట్లు పోలీసులు తెలిపారు.
కొప్పళ జిల్లాలో ఇద్దరు పిల్లలను హతమార్చి తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. సోమవారం కుకనూరు పోలీస్స్టేషన్ పరిధిలో బెణకల్ గ్రామంలో లక్ష్మి భజంత్రి (30), పిల్లలు రమేశ్ (3), జానవి(2)లను హతమార్చి తర్వాత ఆత్మహత్య చేసుకున్నారు.
ఆన్లైన్ వ్యాపారంలో నష్టం రావడంతో, ఏడేళ్ల కుమారుడి గొంతు నులిమి హతమార్చిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి.. రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడగా, గొంతు కోసిన స్థితిలో ఆయన భార్య ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వివరాలిలా వున్నాయి...
ఇండిగో విమానంలో క్యాబిన్ క్రూ గా పనిచేస్తున్న జమ్మూకు చెందిన జాహ్నవి గుప్తా (25) ఈనెల 24న రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆత్మహత్య చేసుకుంది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటన వివరాలు పోలీసులు, మృతురాలి తల్లి సోనిక గుప్తా వెల్లడించారు.