Home » Cricket
టీ20 ప్రపంచ కప్ 2026 సమరం మరో మూడు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో టీమిండియాపై మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని కీలక వ్యాఖ్యలు చేశాడు. ఒత్తిడిలో ఆడిన అనుభవం భారత జట్టుకు ఉందని ఓ కార్యక్రమంలో మాట్లాడాడు.
లిజెలీ లీ.. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున అద్భుత ప్రదర్శనలు చేస్తూ అందరి ప్రశంసలు పొందుతుంది. ఆమె ఆడుతున్న నాక్ చూసి అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు. కారణం ఆ బ్యాటర్ రూపమే. భారీ కాయం ఉన్నా.. వయసు పెరిగిపోతున్నా నిలకడగా రాణిస్తూ వార్తల్లో నిలుస్తుంది.
టీ20 ప్రపంచ కప్ 2026 మరో మూడు రోజుల్లో ప్రారంభం కానుంది.పాక్ ప్రభుత్వం నిర్ణయం మేరకు టోర్నీలో పాల్గొంటాం కానీ గ్రూప్ స్టేజిలో భారత్తో జరిగే మ్యాచును బహిష్కరిస్తున్నట్లు పీసీబీ తెలిపింది. ఈ అంశంపై టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్కు ప్రశ్న ఎదురైంది.
టీ20 ప్రపంచ కప్ 2026 సమీపిస్తోంది. అయితే ప్రస్తుతం అందరి దృష్టి.. విధ్వంసకర బ్యాటర్ అభిషేక్ శర్మపైనే ఉంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అభిషేక్ శర్మ బ్యాటింగ్పై స్పందించాడు.
మహిళల ప్రీమియర్ లీగ్ 2026లో భాగంగా ఎలిమినేటర్ మ్యాచులో గుజరాత్ జెయింట్స్-ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన గుజరాత్.. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్కు 169 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
మహిళల ప్రీమియర్ లీగ్ 2026 తుది దశకు చేరుకుంది. నేడు గుజరాత్ జెయింట్స్-ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు ఎలిమినేటర్ మ్యాచులో తలపడనున్నాయి. టాస్ గెలిచిన ఢిల్లీ.. ఫీల్డింగ్ ఎంచుకుంది. గుజరాత్ను తొలుత బ్యాటింగ్కు ఆహ్వానించింది.
ఫిబ్రవరి 7 నుంచి టీ20 ప్రపంచ కప్ 2026 సమరం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే కీలక వ్యాఖ్యలు చేశాడు. 2024లో ఛాంపియన్గా నిలిచిన జట్టుతో పోలిస్తే ప్రస్తుత జట్టు కాస్త బలహీనంగా ఉందని అభిప్రాయపడ్డాడు.
భారత్తో పాక్ ఆడటంపై టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. పాక్ టీమ్ బలహీనంగా ఉందని.. టీమిండియాకు పోటీ ఇచ్చే పరిస్థితుల్లో లేదని అభిప్రాయపడ్డాడు. భారత్తో మ్యాచ్ ఆడకపోయినా ఫర్వాలేదని అన్నాడు.
క్రీడా చరిత్రలో ఓ అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఓ ఆటగాడు 20 ఏళ్ల కింద ఓ దేశం తరఫున హాకీ ప్రపంచ కప్ ఆడి.. త్వరలో మరో దేశం తరఫున టీ20 ప్రపంచ కప్ ఆడనున్నాడు. అతడే సౌతాఫ్రికాకు చెందిన వేన్ మ్యాడ్సన్.
భారత స్టార్ క్రికెటర్, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మకు ప్రతిష్టాత్మక పద్మ శ్రీ అవార్డు లభించిన విషయం తెలిసిందే. తాజాగా హిట్మ్యాన్ ఈ అంశంపై స్పందించాడు. ఈ గౌరవం తనకు, తన కుటుంబానికి ఎంతో ప్రత్యేకమని అన్నాడు.