Home » Cricket
ముక్కోణపు వన్డే సిరీస్లో భాగంగా దంబుల్లా వేదికగా ఫైనల్ పోరులో శ్రీలంక-ఎ, భారత్-ఎ జట్లు తలపడుతున్నాయి. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ.. రివేంజ్ మోడ్లో ఇన్నింగ్స్ ఆడాడు.
ముక్కోణపు సిరీస్లో భాగంగా నేడు భారత్-ఎ, శ్రీలంక-ఎ జట్లు ఫైనల్ పోరులో తలపడనున్నాయి. ఈ మ్యాచ్లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపైనే అందరి దృష్టీ నెలకొంది.
ముక్కోణపు సిరీస్లో భాగంగా దంబుల్లా వేదికగా భారత్-ఎ, శ్రీలంక-ఎ జట్లు ఫైనల్ పోరులో తలపడనున్నాయి. ఈ క్రమంలో టాస్ నెగ్గిన శ్రీలంక.. ఫీల్డింగ్ ఎంచుకుంది.
అఫ్గానిస్థాన్తో జరిగిన మూడో వన్డేలో భారత స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ అద్భుత ప్రదర్శన చేశాడు. 79 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో హిట్మ్యాన్ రెండు అరుదైన రికార్డులు బద్దలు కొట్టాడు.
భారత యువ లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ తన కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అంతర్జాతీయ కెరీర్లో ఇక నుంచి ‘కమ్బ్యాక్ ప్లేయర్’ అనే ముద్ర పడకుండా ఆడాలని స్పష్టం చేశాడు. భారత జట్టులో శాశ్వత సభ్యుడిగా నిలదొక్కుకోవడమే ప్రధాన లక్ష్యమని వెల్లడించాడు.
చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన ఆఖరి వన్డేలో అఫ్గాన్పై భారత్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో 3-0 తేడాతో సిరీస్ను క్లీన్స్వీప్ చేసింది.
చెపాక్ స్టేడియం వేదికగా అఫ్గానిస్థాన్-భారత్ జట్లు మూడో వన్డే ఆడుతున్నాయి. ఈ మ్యాచ్లో స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ, పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ కలిసి ఓ అరుదైన రికార్డును సృష్టించారు.
చెపాక్ స్టేడియం వేదికగా భారత్-అఫ్గానిస్థాన్ జట్లు మూడో వన్డేలో తలపడుతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన అఫ్గాన్.. 44.2 ఓవర్లలో 218 పరుగులకు ఆలౌటైంది. టీమిండియాకు 219 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ 2026లో భారత మహిళలు వరుస విజయాలతో జోరు మీదున్నారు. ఆదివారం దక్షిణాఫ్రికాతో కీలక పోరుకు సిద్ధమవుతున్నారు. ఈ మ్యాచ్లో కూడా నెగ్గి గెలుపు జోరును కొనసాగిస్తారా?
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(HCA)పై తెలంగాణ క్రికెట్ అసోసియేషన్(TCA) జనరల్ సెక్రటరీ ధరమ్ గురువారెడ్డి మరోసారి సీఐడీకి ఫిర్యాదు చేశారు. టీజీ-20 లీగ్ కోసం హెచ్సీఏ ఏర్పాటు చేసిన బ్యాంక్ అకౌంట్లను వెంటనే నిలిపివేయాలని సీఐడీని ఆయన కోరారు.