Home » Cricket
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ భారత జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన సంగతి తెలిసిందే. అయితే భారత్ తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేయడానికి రెండేళ్ల ముందే అతడు పాకిస్థాన్ జెర్సీ ధరించి మైదానంలోకి దిగిన విషయం చాలా మందికి తెలియదు.
ఆగస్టు 23 నుంచి దులీప్ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఇందుకోసం నార్త్ జోన్ జట్టును ప్రకటించారు. జమ్మూకశ్మీర్కు చెందిన 24 ఏళ్ల వికెట్కీపర్, బ్యాటర్ కన్హయ్య వాధ్వాన్కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. ఢిల్లీ యువ బ్యాటర్ ఆయుష్ బదోనిని వైస్ కెప్టెన్గా నియమించారు.
శ్రీలంకతో టెస్టు సిరీస్కు స్టార్ బౌలర్ బుమ్రా దూరమయ్యాడు. అతడి స్థానంలో జమ్ముకశ్మీర్కు చెందిన యువ పేసర్ ఆకిబ్ నబీని ఎంపిక చేసినట్లు బీసీసీఐ వెల్లడించింది. దీంతో నబీకి తొలిసారి భారత సీనియర్ జట్టులో చోటు దక్కింది.
భారత స్టార్ పేసర్ అర్ష్దీప్ సింగ్ తనకు నచ్చిన టాప్-5 భారత బౌలర్ల జాబితాను వెల్లడించాడు. అయితే ఆధునిక క్రికెట్లో అత్యుత్తమ బౌలర్లలో ఒకడిగా గుర్తింపు పొందిన స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు ఈ జాబితాలో చోటు లేకపోవడం గమనార్హం.
టీమిండియా పురుషుల జట్టుకు కొత్త ఫీల్డింగ్ కోచ్గా అసోంకు చెందిన మాజీ క్రికెటర్ శుభదీప్ ఘోష్ను బీసీసీఐ నియమించింది. పదవీకాలం పూర్తవడంతో టి.దిలీప్ ఇటీవల తన బాధ్యతల నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే.
భారత స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్కు వరుసగా అవకాశాలు ఇవ్వకపోవడంపై మాజీ క్రికెటర్ దీప్ దాస్గుప్తా అసంతృక్తి వ్యక్తం చేశాడు. ఇటీవల ఇంగ్లండ్ పర్యటనలో ఒక్క మ్యాచ్లోనూ అతడికి అవకాశం ఇవ్వని సంగతి తెలిసిందే.
ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యను చెన్నై సూపర్ కింగ్స్కు ట్రేడ్ చేయనున్నారనే ప్రచారం ఊపందుకున్న వేళ.. ఆ వార్తలకు ఎంఐ ఫ్రాంచైజీ చెక్ పెట్టింది. హార్దిక్ విషయంలో సీఎస్కేతో గానీ, మరే ఇతర ఫ్రాంచైజీలతో గానీ ఎలాంటి చర్చలు జరపడం లేదని ఎంఐ ప్రతినిధి స్పష్టం చేశారు.
భారత టెస్టు మాజీ కెప్టెన్ అజింక్య రహానెకు బీసీసీఐ నెలవారీ పెన్షన్ ఇవ్వనుంది. జులై 30న రహానె అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.
డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో నిలవాలంటే శ్రీలంక పర్యటనలో టీమిండియా తప్పనిసరిగా మెరుగైన ప్రదర్శన చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఆగస్టు 15 నుంచి శ్రీలంకతో ప్రారంభమయ్యే రెండు టెస్టుల సిరీస్ భారత్కు అత్యంత కీలకంగా మారింది.
దులీప్ ట్రోఫీ డిఫెండింగ్ ఛాంపియన్ సెంట్రల్ జోన్ జట్టుకు స్టార్ బ్యాటర్ రజత్ పాటీదార్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. వైస్ కెప్టెన్గా రింకు సింగ్ బాధ్యతలు చేపట్టనున్నాడు.