Home » Cricket
జింబాబ్వే పర్యటనలో బంగ్లాదేశ్కు ఊహించని షాక్ ఎదురైంది. ఇప్పటికే జింబాబ్వేతో జరిగిన ఏకైక టెస్టులో ఇన్నింగ్స్ తేడాతో పరాజయంపాలైన బంగ్లాదేశ్ వన్డే సిరీస్ను కూడా ఓటమితోనే ప్రారంభించింది.
ఇంగ్లండ్తో మూడో టీ20లో భారత జట్టు పలు కీలక మార్పులతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. గత మ్యాచ్లో పేలవ ప్రదర్శన కనబరిచిన స్పిన్నర్ రవి బిష్ణోయ్పై వేటు పడే అవకాశం ఉన్నట్లు సమాచారం.
భారత యువ క్రికెటర్ పృథ్వీ షా మళ్లీ వార్తల్లో నిలిచాడు. అతడి గురించి వస్తోన్న ప్రతి రూమర్ నిజమేనంటూ.. పృథ్వీ షా పేరు ఎక్కడా వాడకుండా అతడికి కాబోయే భార్య చేసిన ఆరోపణలు నెట్టింట చర్చనీయాంశమయ్యాయి.
టీ20 ప్రపంచ కప్ 2026లో ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అయిన సంజును జట్టు నుంచి తప్పించడంపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ఈ విషయంపై మాట్లాడాడు.
పాకిస్థాన్ క్రికెట్ జట్టులో కీలక మార్పు చోటు చేసుకుంది. స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం మళ్లీ టెస్టు జట్టు కెప్టెన్గా నియమితుడయ్యాడు.
భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ గతేడాది టెస్టు, టీ20లకు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. అప్పట్లో అతడు తీసుకున్న నిర్ణయం అందరినీ షాక్కు గురి చేసింది. ఈ క్రమంలో విరాట్ టెస్టు రిటైర్మెంట్ గురించి క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
మహిళల టీ20 ప్రపంచ కప్ 2026లో భారత జట్టు ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయలేకపోయిన సంగతి తెలిసిందే. అయితే టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన వ్యక్తిగత ప్రదర్శనకు మాత్రం ఐసీసీ గుర్తింపు లభించింది.
భారత సిక్సర్ల పిడుగు వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం చేశాడు. క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమించాడు. అయితే సచిన్, వైభవ్ అరంగేట్రాల మధ్య వయసు తేడా మాత్రమే కాదు.. రెండు తరాల క్రికెట్, సాంకేతికత, అభిమానుల తీరు, ఆట శైలిలోనూ విపరీతమైన మార్పు వచ్చింది.
భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఇంగ్లండ్తో జరిగిన రెండో టీ20లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. తన అంతర్జాతీయ అరంగేట్రం తర్వాత వైభవ్ సూర్యవంశీ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. ఇప్పుడది నెట్టింట వైరల్ అవుతోంది.
భారత్తో ఓల్డ్ ట్రాఫర్డ్ వేదికగా జరిగిన టీ20 మ్యాచ్లో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 191 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ సులువుగా ఛేదించింది. 4 వికెట్ల తేడాతో విజయం సొంతం చేసుకుంది.