Home » Cricket
డబ్ల్యూపీఎల్ 2026లో భాగంగా నేడు యూపీ వారియర్స్-ముంబై ఇండియన్స్ జట్లు తలపడుతున్నాయి. ఆది నుంచే చెలరేగుతూ ఆడిన యూపీ బ్యాటర్లు భారీ స్కోరు సాధించారు. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 187 పరుగులు సాధించారు. ముంబైకి 188 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించారు.
టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అండర్ 19 ప్రపంచ కప్లో భాగంగా బంగ్లాదేశ్తో ఆడుతున్న మ్యాచులో వైభవ్ 72 పరుగులు చేశాడు. ఈ టోర్నీలో 50కి పైగా పరుగులు చేసిన అతి పిన్న వయస్కుడిగా వైభవ్ చరిత్ర సృష్టించాడు.
భారత్-న్యూజిలాండ్ జట్లు ఇండోర్ వేదికగా ఆదివారం మూడో వన్డే మ్యాచ్ ఆడనున్నాయి. అయితే.. ఇటీవల ఇండోర్లో కలుషిత నీరు తాగడం వల్ల పలువురు మృత్యువాతపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ గిల్ చేసిన ఓ పని అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
భారత్-బంగ్లాదేశ్ దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ వివాదానికి ఐసీసీ తెరదించే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా ఇద్దరు ఐసీసీ అధికారులు ఢాకా వెళ్లాల్సి ఉంది. ఈ నేపథ్యంలో భారత్కు చెందిన ఓ అధికారికి బంగ్లాదేశ్ వీసా నిరాకరించింది.
టీ20 ప్రపంచ కప్ 2026కి ముందు క్రికెట్ అభిమానులను అలరించడానికి మరో ఐసీసీ టోర్నీ సిద్ధమైంది. అదే అండర్ 19 వన్డే ప్రపంచ కప్. తొలి రోజు టీమిండియా.. అమెరికా జట్టుతో తలపడనుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన భారత్.. ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత అమెరికా జట్టును బ్యాటింగ్కు ఆహ్వానించింది.
టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ చరిత్ర సృష్టించాడు. రాజ్కోట్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన రెండో వన్డేలో రాహుల్ సెంచరీతో అజేయంగా నిలిచిన విషయం తెలిసిందే. అయితే రాజ్కోట్లోని నిరంజన్ షా స్టేడియంలో శతకం బాదిన తొలి భారత వన్డే ప్లేయర్గా కేఎల్ రాహుల్ రికార్డులకెక్కాడు.
జనవరి 21 నుంచి న్యూజిలాండ్తో జరగనున్న టీ20 సిరీస్కు టీమిండియా స్టార్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ దూరమయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. కివీస్తో తొలి వన్డేలో వాషీ గాయపడిన సంగతి తెలిసిందే.
రాజ్కోట్ వేదికగా బుధవారం న్యూజిలాండ్తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ గిల్.. జట్టు ఓటమిపై స్పందించాడు.
భారత, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న వన్డే సీరిస్లో భాగంగా ఇవాళ రాజ్ కోట్ లో జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్ జట్టు అలవోకగా విజయం సాధించింది. భారత్ ఇచ్చిన 284 పరుగుల లక్ష్యాన్ని కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది.
న్యూజిలాండ్-భారత్ జట్లు మధ్య రాజ్కోట్ వేదికగా రెండో వన్డే మ్యాచ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన కివీస్.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా తొలుత బ్యాటింగ్కు దిగనుంది.