Home » Cricket
టీమిండియా వెటరన్ ప్లేయర్ రోహిత్ శర్మ ఈ సిరీస్లో పెద్దగా రాణించలేదు. అయితే.. మ్యాచ్ అనంతరం రోహిత్ ఫామ్పై ఎదురైన ప్రశ్నకు కెప్టెన్ శుభ్మన్ గిల్ స్పందించాడు. న్యూజిలాండ్తో సిరీస్లో రోహిత్ భారీ స్కోర్లు చేయలేకపోయినా మంచి ఫామ్లోనే ఉన్నాడని చెప్పాడు.
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరోసారి తన క్లాస్ను నిరూపించుకున్నాడు. ఇండోర్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన మూడో వన్డేలో అద్భుత శతకంతో మెరిసిన కోహ్లీ.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న మరో ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు.
టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా భారత్లో బంగ్లా ఆడనున్న మ్యాచుల వేదికలను శ్రీలంకకు తరలించాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఐసీసీకి మెయిల్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐసీసీ.. బీసీబీకి ఈ విషయంపై డెడ్లైన్ విధించినట్లు సమాచారం.
భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్పై పెద్దఎత్తున వ్యతిరేకత మొదలైంది. సొంతగడ్డపై చెలరేగాల్సిన భారత జట్టు.. గంభీర్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి వరుస ఓటములను చవిచూస్తోందంటూ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇండోర్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన మూడో వన్డేలో టీమిండియా 41 పరుగుల తేడాతో ఓడిన విషయం తెలిసిందే. అయితే స్టార్ ఆల్రౌండర్ హర్షిత్ రాణా అర్ధ శతకంతో ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ నేపథ్యంలో టీమిండియా క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్.. హర్షిత్ రాణా బ్యాటింగ్పై మాట్లాడాడు.
ఇండోర్ వేదికగా భారత్తో జరిగిన ఆఖరి వన్డేలో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. 338 పరుగుల లక్ష్యంతో ఛేదనకి దిగిన భారత్.. 41 పరుగుల తేడాతో ఓడింది. ఈ మూడు వన్డేల సిరీస్ను కివీస్.. 2-1 తేడాతో దక్కించుకుంది..
భారత జట్టులో స్టార్ ఆల్రౌండర్ హర్షిత్ రాణా గొప్పగా రాణిస్తున్న విషయం తెలిసిందే. హెడ్ కోచ్ గంభీర్ వల్ల హర్షిత్కి తుది జట్టులో చోటు దక్కుతుందంటూ అభిమానుల నుంచి క్రికెట్ మాజీల వరకు చర్చించుకున్న సందర్భాలూ ఎన్నో ఉన్నాయి. ఈ నేపథ్యంలో తన జీవితంలో ఎదుర్కొన్న కఠిన దశలను హర్షిత్ రాణా గుర్తు చేసుకున్నాడు..
న్యూజిలాండ్-భారత జట్లు ఇండోర్ వేదికగా మూడో వన్డే మ్యాచులో తలపడుతున్నాయి. కివీస్ స్టార్ బ్యాటర్ డారిల్ మిచెల్ భారీ సెంచరీతో చెలరేగాడు. అయితే ఇండోర్ మైదానంలో చోటు చేసుకున్న ఓ సరదా సంఘటన అందరినీ నవ్వుల్లో ముంచెత్తుతోంది..
విజయ్ హజారే ట్రోఫీ ఫైనల్లో విదర్భ, సౌరాష్ట్ర తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన విదర్భ.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 317 పరుగులు చేసింది. సౌరాష్ట్రకు 318 పరుగులు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.
టీమిండియాపై ఒకప్పుడు.. సనత్ జయసూర్య, రికీ పాటింగ్, సంగ్కకర, డివిలియర్స్ వంటి ప్లేయర్లు ఆధిపత్యం చెలాయించే వారు. ప్రస్తుత తరంలో స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్సన్, క్వింటన్ డికాక్... ఇలా ఆయా దేశాల తరఫున కొందరు ఆటగాళ్లు భారత జట్టుపై రెచ్చిపోయి ఆడుతుంటారు. తాజాగా అదే బాటలో నడుస్తున్నాడు న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ డారిల్ మిచెల్.