Home » Cricket
ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలతో సహా ఆసియా క్రీడలకు భారత టీ20 జట్టును బీసీసీఐ ప్రకటించింది. సూర్యకుమార్ కుమార్ యాదవ్ను కెప్టెన్సీ నుంచి తప్పించి.. శ్రేయస్ అయ్యర్కు ఆ బాధ్యతలు అప్పగించింది.
టీమిండియా స్టార్ బ్యాటర్, వికెట్ కీపర్ రిషభ్ పంత్ అరుదైన ఘనత సాధించాడు. అఫ్గాన్తో జరుగుతోన్న ఏకైక టెస్టుతో అతడు 50 లేదా అంతకంటే ఎక్కువ టెస్టు మ్యాచ్లు ఆడిన భారత వికెట్ కీపర్ల జాబితాలోకి చేరాడు.
టీ20 జట్టు కెప్టెన్గా ఉన్న సూర్యకుమార్ యాదవ్ను ఆ బాధ్యతల నుంచి తప్పిస్తారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఆసియా కప్ గెలిపించాడు.. టీ20 ప్రపంచ కప్ను నిలబెట్టాడు.. భారత టీ20 చరిత్రలో అత్యుత్తమ విజయశాతం కలిగిన కెప్టెన్లలో ఒకడిగా నిలిచాడు. అయినప్పటికీ సూర్యకు ప్రత్యేక వీడ్కోలు సిరీస్ లభించలేదు.
ముల్లాన్పూర్ వేదికగా అఫ్గానిస్థాన్తో ఏకైక టెస్టు మ్యాచ్లో భారత బ్యాటర్లు రాణిస్తున్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన భారత్.. తొలి రోజు లంచ్ బ్రేక్ సమయానికి 25 ఓవర్లలో వికెట్ కోల్పోయి 96 పరుగులు చేసింది.
ముల్లాన్పూర్ వేదికగా భారత్- అఫ్గానిస్థాన్ ఏకైక టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్లో భారత జట్టు తరఫున యువ ఆల్రౌండర్ మానవ్ సుతార్ అరంగేట్రం చేశాడు. మ్యాచ్ ప్రారంభానికి ముందు సీనియర్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్.. సుతార్కు టెస్టు క్యాప్ అందజేశాడు.
అఫ్గానిస్థాన్ క్రికెట్ జట్టు శనివారం నుంచి భారత్లో పర్యటించనుంది. ముల్లాన్పూర్ వేదికగా ఏకైక టెస్టులో భారత్తో తలపడనుంది. ఆ తర్వాత మూడు వన్డేలు ఆడనుంది. ఈ క్రమంలో నిర్వహించిన మీడియా సమావేశంలో టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
వైభవ్ సూర్యవంశీ భవిష్యత్తుపై టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వైభవ్ సూర్యవంశీ టెస్టు క్రికెట్కు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించాడు.
అఫ్గానిస్థాన్ క్రికెట్ జట్టు భారత పర్యటనకు వచ్చింది. టీమిండియాతో శనివారం నుంచి ఏకైక టెస్టు మ్యాచ్ ముల్లాన్పూర్ వేదికగా ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో అఫ్గానిస్థాన్ కోచ్ రిచర్డ్ పైబస్ మాట్లాడాడు.
ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ అనంతరం అహ్మదాబాద్ నుంచి విమానాశ్రయానికి వెళ్తుండగా.. అతడు ప్రయాణిస్తున్న కారు ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది.
మహారాజా టీ20 టోర్నీ వేలంగా టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ అన్సోల్డ్గా మిగిలిపోయాడు. రూ.2 లక్షల బెస్ ప్రైజ్తో వేలంలోకి వచ్చిన అతడిని.. ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపలేదు.