Home » Cricket
బంగ్లాదేశ్తో టీ20 సిరీస్కు ఆస్ట్రేలియా తరఫున భారత సంతతి క్రికెటర్ నిఖిల్ చౌదరి ఎంపికయ్యాడు. అతడికి తుది జట్టులో స్థానం లభిస్తే 6 దశాబ్దాల తర్వాత ఆసీస్కు ప్రాతినిధ్యం వహించిన మొదటి ఇండియన్ ఆసీస్ క్రికెటర్ అవుతాడు.
లండన్ నైట్క్లబ్లో జరిగిన గొడవ కారణంగా బెన్ స్టోక్స్పై ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. దీంతో అతడిని జట్టు నుంచి తప్పించి, న్యూజిలాండ్తో జరిగే రెండో టెస్టుకు సీనియర్ బ్యాటర్ జో రూట్ను తాత్కాలిక కెప్టెన్గా నియమించింది.
రాజస్థాన్ రాయల్స్ యువ హిట్టర్ సూర్యవంశీ వైభవ్.. టీమిండియా టీ20 జట్టుకు ఎంపికైన సంగతి తెలిసిందే. త్వరలో ఐర్లాండ్, ఇంగ్లండ్తో జరగనున్న టీ20 మ్యాచుల్లో వైభవ్ ఆడనున్నాడు. ఈ సందర్భంగా వైభవ్ తండ్రి సంజీవ్ తన కుమారుడి క్రికెట్ జర్నీని గుర్తు చేసుకుని ఎమోషనలయ్యారు.
ఐపీఎల్, భారత క్రికెట్పై వస్తున్న విమర్శలపై టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ ఘాటుగా స్పందించాడు. ఐపీఎల్, భారత క్రికెట్ను విమర్శించే వారే ఆదాయం కోసం తిరిగి బీసీసీఐని ఆశ్రయిస్తారని మండిపడ్డాడు.
టెస్టు ర్యాంకింగ్స్ జాబితాను ఐసీసీ తాజాగా విడుదల చేసింది. ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ 869 పాయింట్లతో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు.
అఫ్గానిస్థాన్తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్లో యువ స్పిన్నర్ మానవ్ సూతార్ అరంగేట్రంలోనే 7 వికెట్లు తీసి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. ఈ క్రమంలోనే సుతార్కు ఓ బంపరాఫర్ లభించింది. అతడికి ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లో ఆడే అవకాశం దక్కింది.
ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ భవితవ్యంపై ఉత్కంఠ నెలకొంది. ఓ నైట్ క్లబ్లో మద్యం తాగి ఓ రగ్బీ ప్లేయర్తో వాగ్వాదానికి దిగిన ఘటన తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ క్రమంలో అతడు అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికే అవకాశాలపై ఊహాగానాలు జోరందుకున్నాయి.
న్యూజిలాండ్తో తొలి టెస్టు విజయం అనంతరం.. ఇంగ్లండ్ ప్లేయర్లు మద్యం తాగి ఓ రగ్బీ ఆటగాడితో ఘర్షణకు దిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆ రగ్బీ ప్లేయర్ ఎవరా? అని నెటిజన్లు సోషల్ మీడియాలో తెగ వెతికేస్తున్నారు.
టీమిండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీతో కలిసి కోహ్లీని ఒలింపిక్స్ జట్టులో ఎంపిక చేయాలని బీసీసీఐ సెలక్టర్లకు సూచించాడు.
మరికొద్ది రోజుల్లో మహిళల టీ20 ప్రపంచ కప్ 2026 ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ జాబితాను విడుదల చేసింది. దీంట్లో పలు కీలక మార్పులు చోటు చేసుకున్నాయి.