Home » Cricket news
ఐపీఎల్ 2024 (IPL 2024) చరిత్రలో పంజాబ్ కింగ్స్(Punjab Kings) జట్టు అతిపెద్ద స్కోరు లక్ష్యాన్ని ఛేదించి రికార్డు సృష్టించింది. కోల్కతా నైట్ రైడర్స్(kolkata knight riders)తో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ 262 పరుగుల లక్ష్యాన్ని ఈజీగా ఛేదించింది. ఈ మ్యాచ్లో పంజాబ్ జట్టు 8 వికెట్ల తేడాతో కోల్కతాపై సులువుగా గెలిచింది.
సిక్సర్లు.. ఫోర్లతో కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానం మోతెక్కిపోయింది. పంజాబ్ కింగ్స్పై కోల్కోతా నైట్ రైడర్స్ బ్యాట్స్మెన్ పెనువిధ్వంసం సృష్టించారు. ఓపెనర్లు సునీల్ నరైన్, ఫిలిప్ సాల్ట్ మొదలుకొని 7వ నంబర్ బ్యాట్స్మెన్ అందరూ సమష్టిగా రాణించడంతో కోల్కతా నిర్ణీత 20 ఓవర్లలో ఏకంగా 261 పరుగుల రికార్డు స్థాయి స్కోరు బాదింది.
సైబర్ నేరగాళ్లు ఏ అవకాశాన్ని కూడా వదలడం లేదు. గతంలో అయోధ్య రామ మందిర్ సహా అనేక కార్యక్రమాల పేరుతో సోషల్ మీడియాలో పోస్టులు చేసి అమాయకుల నుంచి డబ్బులు దండుకున్నారు. ఈ క్రమంలో తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni) పేరుతో దుండగులు సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులు చేసి డబ్బులు(money) దోచుకుంటున్నారు.
ఐపీఎల్ 2024(IPL 2024)లో నేడు 42వ మ్యాచ్ కోలకత్తా నైట్ రైడర్స్(Kolkata Knight Riders), పంజాబ్ కింగ్స్(Punjab Kings) జట్ల మధ్య కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు జరగనుంది. ఇక కోలకత్తా నైట్ రైడర్స్ ప్రస్తుతం 7 మ్యాచ్ల్లో 5 గెలిచి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. అదే సమయంలో పంజాబ్ కింగ్స్ 8 మ్యాచ్ల్లో రెండు గెలిచి 4 పాయింట్లతో 9వ స్థానంలో ఉంది.
ఐపీఎల్ 2024(ipl 2024)లో నిన్న 41వ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bengaluru) జట్టు సన్రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad)ను 35 పరుగుల తేడాతో ఓడించింది. అయితే ఆర్సీబీ జట్టు ఈ మ్యాచ్ గెలిచినా కూడా పాయింట్ల పట్టికలో మాత్రం మార్పు కనిపించడం లేదు. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
Watch Video: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో అత్యంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న జట్టు ఏదైనా ఉందంటే అది చెన్నై సూపర్ కింగ్స్(CSK) టీమ్ అని చెప్పొచ్చు. దేశంలోని ఏ ప్రాంతంలో సీఎస్కే మ్యాచ్ జరిగినా.. అక్కడ ప్రేక్షకులు వాలిపోతుంటారు. సీఎస్కే ప్లేయర్స్ బౌండరీలు కొట్టినా.. వికెట్ తీసినా..
ఐపీఎల్ IPL 2024(IPL 2024)లో నేడు 40వ మ్యాచ్ గుజరాత్ టైటాన్స్(Gujarat Titans), ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) మధ్య ఢిల్లీ(Delhi)లోని అరుణ్ జైట్లీ స్టేడియం(Arun Jaitley Stadium)లో జరగనుంది. పాయింట్ల పట్టికలో ఇరు జట్లు దిగువన కొనసాగుతున్నాయి. ఈ విషయంలో వీరిద్దరూ ఈ మ్యాచ్లో గెలుపొందడం చాలా ముఖ్యమని చెప్పవచ్చు.
ఐపీఎల్ 2024(IPL 2024) పాయింట్ల పట్టికలో మంగళవారం రాత్రి సంచలన మార్పు చోటుచేసుకుంది. చెన్నై(Chennai)లోని చిదంబరం స్టేడియంలో ఆతిథ్య చెన్నై సూపర్ కింగ్స్(CSK), లక్నో సూపర్ జెయింట్స్(LSG) మధ్య మ్యాచ్ జరుగగా.. LSG ఈ మ్యాచ్లో ఘన విజయం సాధించింది. దీంతో ఈ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ పాయింట్ల పట్టికలో టాప్ 4 నుంచి మొదటిసారి నిష్క్రమించింది.
ఐపీఎల్ 2024(IPL 2024)లో నేడు 39వ మ్యాచులో లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants), చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ చెన్నై( Chennai)లోని ఎంఏ చిదంబరం స్టేడియం(MA Chidambaram Stadium)లో రాత్రి 7.30 గంటలకు జరగనుంది. అయితే ప్లేఆఫ్ రేస్ నేపథ్యంలో ఇరు జట్లకు కూడా ఈ మ్యాచ్ చాలా కీలకం కానుంది. ఈ నేపథ్యంలో ఏ జట్టు గెలిచే అవకాశం ఉందో ఇక్కడ చుద్దాం.
ఆర్సీబీ ప్లేయర్ విరాట్ కోహ్లి దురుసు ప్రవర్తన నేపథ్యంలో మ్యాచ్ ఫీజులతో కోత విధించారు. నిన్న కోల్ కతాతో జరిగిన మ్యాచ్లో ఔటయిన తర్వాత కోహ్లి అంపైర్లతో వాదనకు దిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత థర్డ్ ఎంపైర్ కూడా ఔట్ ఇవ్వడంతో ఆగ్రహంతో పెవిలియన్ చేరాడు.