మనమ్మాయిలు పాక్ను పడగొట్టారు
ABN , Publish Date - Feb 16 , 2026 | 04:59 AM
టీ20 ప్రపంచక్పలో ఆదివారం భారత పురుషుల జట్టు పాకిస్థాన్ను చిత్తుగా ఓడిస్తే... ఇదేరోజు భారత జూనియర్ అమ్మాయిలు కూడా పాక్ పని పట్టారు. మహిళల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్...
స్పిన్నర్ల విజృంభణ
ఆసియా కప్ రైజింగ్ స్టార్స్
బ్యాంకాక్: టీ20 ప్రపంచక్పలో ఆదివారం భారత పురుషుల జట్టు పాకిస్థాన్ను చిత్తుగా ఓడిస్తే... ఇదేరోజు భారత జూనియర్ అమ్మాయిలు కూడా పాక్ పని పట్టారు. మహిళల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో భాగంగా ఆదివారం ఇక్కడ జరిగిన గ్రూప్-ఎ పోరులో భారత-ఎ జట్టు 8 వికెట్ల తేడాతో పాక్ను ఓడించింది. జట్టు కెప్టెన్, స్పిన్నర్ రాధా యాదవ్ (2/11)కు తోడు సైమా ఠాకూర్ (2/14), ప్రేమా రావత్ (2/16) బౌలింగ్లో విజృంభించడతో.. పాక్ 18.5 ఓవర్లలో 93 పరుగులకే కుప్పకూలింది. షవాల్ జుల్ఫికర్ (23) టాప్స్కోరర్. స్వల్ప ఛేదనలో దినేశ్ వ్రింద (55) అజేయ అర్ధ సెంచరీతో భారత్ 10.1 ఓవర్లలోనే 97/2 స్కోరు చేసి అలవోకగా గెలిచింది. అనుష్క శర్మ (24) రాణించింది. ఈ టోర్నీలో భారత-ఎ జట్టుకిదే తొలి గెలుపు. అంతకుముందు శుక్రవారం జరిగిన తమ తొలి మ్యాచ్లో యూఏఈ చేతిలో భారత్ ఓటమిపాలైంది.
ఇవి కూడా చదవండి..
ఈ ఫొటోల్లోని ఏడు తేడాలను 16 సెకెన్లలో కనిపెట్టండి.. మీ కళ్ల పవర్ సరి చూసుకోండి ..
ఇషాన్ కిషన్ సూపర్ ఇన్నింగ్స్..